అన్వేషించండి

East Godavari: కోమాలో ఉన్న తల్లిని కదిలించిన బిడ్డ ఏడుపు.... తల్లి ప్రేమకు నిదర్శనం ఈ ఘటన

బిడ్డకు ఏంకావాలో తల్లికి చెప్పక్కర్లేదు. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో మాతృమూర్తులకు ఇట్టే తెలిసిపోతుంది. బిడ్డ ఏడుపు వింటే అమ్మ తల్లడిల్లిపోతుందనడానికి నిదర్శనం ఈ ఘటన.

ప్రసవ సమయంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు తల్లీ బిడ్డా క్షేమంగా ఉండేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. అయితే పరిస్థితులు చేయిదాటుతున్నప్పుడు తల్లినైనా.. లేదా పరిస్థితులకనుగుణంగా బిడ్డనైనా బతికించేందుకు ప్రయత్నిస్తారు. ఇక తల్లి బతికే అవకాశాలు దాదాపు లేవని తెలిస్తే కనీసం బిడ్డనైనా బతికించేందుకు సిజేరియన్ చేస్తుంటారు. అయితే దాదాపు కోమాలోకి వెళ్లిపోయిన ఓ మాతృమూర్తికి బిడ్డ ఏడుపుతో చలనం వచ్చిన అరుదైన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చోటుచేసుకుంది. జిల్లాలోని కూనవరం మండలం టేకులబోరు ప్రాంతానికి చెందిన జోడె నాగమణి నిండుగర్భిణీ కాగా వచ్చే నెల నాలుగో తేదీకి ఆమెకు డెలివరీ టైం ఇచ్చారు. కానీ ఇంతలో నొప్పులు రావడంతో కూనవరం మండలం కోతులగట్టు పీహెచ్‌సీకు ఆమెను తీసుకెళ్లారు. 

East Godavari: కోమాలో ఉన్న తల్లిని కదిలించిన బిడ్డ ఏడుపు.... తల్లి ప్రేమకు నిదర్శనం ఈ ఘటన

Also Read: ఆయ్.. మా గోదారోళ్ళు ఇంతేనండీ.. 365 రకాల వంటలు.. కాబోయే మనవడికి, అల్లుడు గారికి మర్యాదలు మామూలుగా లేవుగా!

బిడ్డనైనా రక్షిద్దామని ఆపరేషన్ 

నాగమణికి పరీక్షలు నిర్వహించిన వైద్యసిబ్బంది ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. ఇదే విషయాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్యకు సమాచారం అందించారు పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్‌ కోటిరెడ్డి. ఈ పరిస్థితుల్లో అప్పటికే గర్భిణీ నాగమణి కోమాలోకి వెళ్లిపోయింది. భద్రాచలం ఆసుపత్రిలో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెలో చలనం కనిపించకపోగా దాదాపు ఆమె మృతి చెందిందని వైద్యులు భావించారు. అయితే డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్య, పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్‌ కోటిరెడ్డి ఏరియా ఆసుపత్రికి తీసువెళ్లి కనీసం కడుపులో ఉన్న బిడ్డనైనా బయటకు తీస్తే బిడ్డ బతుకుతుందేమోనని భావించి భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరెంటెండ్‌ డాక్టర్‌ రామకృష్ణను ఒప్పించారు. 

Also Read: గోదారోళ్లా మజాకా... రూ.3.6 లక్షలు పలికిన పందెం పుంజు.... ఈసారి తగ్గేదేలే అంటున్న పందెంరాయుళ్లు

బిడ్డ ఏడుపుతో స్పృహ

గర్భిణీ నాగమణి సోదరుడు జోడె నాగేశ్వరరావు, భర్త సత్యనారాయణ అనుమతితో గైనకాలజిస్టు నరసయ్య, ఎనస్తీషియన్‌ కిషన్‌, ఐసీయూ సిబ్బంది ఆపరేషన్‌ చేసి మగబిడ్డను బయటకు తీశారు. ఇంతలో బిడ్డ ఏడుపు విని నాగమణిలో కదలికలు రావడంతో ఆశ్చర్యానికి లోనై హుటాహుటిన అత్యవసర వైద్యసేవలు అందించారు. తరువాత నాగమణి స్పృహలోకి వచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. దాదాపు కోమాలోకి వెళ్లిపోయిన మాతృమూర్తి బిడ్డ ఏడుపు విని స్పృహలోకి రావడం చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు. తల్లి బిడ్డలను రక్షించేందుకు వైద్యుల చేసిన కృషిని అధికారులు ప్రశంసిస్తున్నారు.  

Also Read:  చిన్నప్పుడు వేరుశనక్కాయలు కొని డబ్బులు ఇవ్వలేదని... ఇప్పుడు రూ.25 వేల ఆర్థిక సాయం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Earthquake: విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Embed widget