East Godavari Crime News: తూర్పుగోదావరి జిల్లాలో వివాహిత మర్డర్ అండ్ రేప్ కేసులో రాజమండ్రి కోర్టు సంచలన తీర్పు; మృగాళ్లకు జీవిత ఖైదు,జరిమానా!
East Godavari Crime News: 2024లో సంచలనం సృష్టించిన మృతి కేసులో రాజమండ్రి మూడో అదనపు జిల్లా కోర్ట్ జడ్జి ఈ కేసులో వాదోపవాదాల అనంతరం సోమవారం సంచలన తీర్పు వెలువరించారు.

- తూర్పుగోదావరిలో మహిళ హత్య కేసులో నలుగురికి జీవితఖైదు.
- 2024లో బుర్రిలంకలో రౌతు కస్తూరిపై గ్యాంగ్ రేప్, హత్య జరిగింది.
- నిందితులకు జీవితఖైదుతో పాటు జరిమానా కూడా విధించారు.
- కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన అధికారులను ఎస్పీ అభినందించారు.
East Godavari Crime News: 2024 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక గ్రామంలో సంచలనం రేపిన రౌతు కస్తూరి హత్య (గ్యాంగ్ రేప్ & మర్డర్) కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. నిందితులకు జీవిత ఖైదు, జరిమానా విధించింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ వెల్లడించారు.
సంచలనంగా మారిన మహిళ హత్య కేసు..
కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన రౌతు కస్తూరి అనే వివాహిత 2024 అక్టోబర్ 15వ తేదీన హత్యకు గురైంది. మధ్యాహ్నం 2:00 సమయంలో పని కోసం బుర్రిలంక వంతెన దగ్గరలో గల పాఠం శెట్టి రాముడు నర్సరీలోకి పనికి వెళ్లింది. సాయంత్రం 6 గంటలు అయినా ఇంటికి రాకపోవడంతో భర్త ఫోన్ కంగారు పడ్డాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ దొరికని పరిస్థితుల్లో మరుసటి రోజు కడియం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివాహిత అదృశ్యంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో ఉండగా 2024 అక్టోబర్ 17న కస్తూరి మృతదేహం చొప్పెల్ల లాకులు వద్ద లభ్యమైంది. మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసును అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి పోస్ట్ మార్టం జరిపించారు..
అత్యాచారం, హత్య
నర్సరీ పనికి వెళ్లి అనుమానాస్పదంగా మృతి చెందిన వివాహిత కేసు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. దీంతో పోలీసులు దర్యాప్తును మరింత వేగం పెంచారు. అక్కడ లభ్యమైన సీసీ కెమెరాలు ఇతర ఆధారాలతో దర్యాప్తు చేస్తున్న క్రమంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. 2024 అక్టోబర్ 15న సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో పని ముగించుకొని వెళ్తున్న క్రమంలో ఆమెను హత్య చేశారు. నర్సరీ మొక్కల మధ్యలో మద్యం సేవిస్తూ వ్యక్తులు ఆమె కాళ్లు చేతులు పట్టుకుని సామూహిక అత్యాచారం చేశారు. తరువాత హత్య చేశారు. తర్వాత పక్కనే ఉన్న కాలువలోకి విసిరేసినట్లు విచారణలో వెల్లడైంది. బుర్రిలంకకు చెందిన దేవర యేసు (26), వెలుబుడి ప్రవీణ్ (21) లోకిన జయ ప్రసాద్ (19)
పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి సురేష్(22) ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్దారణైంది. వీరిని అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. నిందితులంతా 26 ఏళ్లలోపు వారే కావడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
జీవిత ఖైదు-జరిమానా
2024లో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో సౌత్ జోన్ డి.ఎస్.పి భవ్య కిషోర్ నేతృత్వంలో నిందితులను అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. రాజమండ్రి మూడో అదనపు జిల్లా కోర్ట్ జడ్జి ఈ కేసులో వాదోపవాదాల అనంతరం సోమవారం సంచలన తీర్పు వెలువరించారు. దేవర యేసు, వెలుబుడి ప్రవీణ్, లోకిన జయ ప్రసాద్, దాసరి సురేష్ నలుగురికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.2000/- చొప్పున జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించారు.
అధికారులను అభినందించిన ఎస్పీ..
ఈ కేసులో ముద్దాయిలకు జీవిత ఖైదు పడటంలో ముఖ్యపాత్ర వహించిన ఏపీపీకే రాధ కృష్ణ రాజు, సౌత్ జోన్ డి.ఎస్.పి ఎస్. భవ్య కిషోర్, కడియం ఎస్సై బి నాగ దుర్గ ప్రసాద్, కే శ్రీనివాస్ను అభినందించారు. దర్యాప్తునకు సహకరించి సాక్ష్యులను కోర్ట్కు హాజరు అయ్యేలా చేసిన కడియం సీఐ ఏ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుల్ వాసు, భీమారావు ను ఎస్పీ డి. నరసింహ కిషోర్ అభినందించి, రివార్డులు ప్రకటించారు.
ట్రెండింగ్ వార్తలు





















