అన్వేషించండి

AP School Fee Row : ఏపీలో అతి తక్కువ స్కూల్ ఫీజులు విద్యార్థులకు వరం..! మరి స్కూళ్లకు..?

ఏపీలో ఇంటర్ వరకూ ఫీజులను ఖరారు చేసింది. అతి తక్కువ ఫీజులు నిర్ణయించింది. దీనిపై ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు అసంతృప్తిలో ఉన్నాయి. విద్యారంగం ప్రమాణాలు పడిపోతాయని అంటున్నారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లలో ఎంతెంత ఫీజులు వసూలు చేయాలో ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ప్రైవేటు స్కూళ్లు దోపిడి చేస్తున్నాయని చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. అనేక సార్లు న్యాయస్థానాల్లో పిటిషన్లు కూడా వేశారు. కానీ ఎప్పుడూ ప్రభుత్వం ఇంత ఫీజు మాత్రమే వసూలు చేయాలని నిబంధనలు పెట్టలేదు. దీనికి కారణం ప్రైవేటు స్కూళ్లు అన్నీ ఒకేలా ఉండవు. సౌకర్యాల పరంగా భిన్నమైన స్కూళ్లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం  అందరికీ ఒకే రకమైన ఫీజులు నిర్ణయించింది. అయితే ఆ ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయని..  వాటితో స్కూళ్లను నడపడం ఎలా సాధ్యమనే విమర్శలు యాజమాన్యాల నుంచి వస్తున్నాయి.
AP School Fee Row : ఏపీలో అతి తక్కువ స్కూల్ ఫీజులు విద్యార్థులకు వరం..! మరి స్కూళ్లకు..?

ఏపీలో స్కూల్ ఫీజులు ఇలా..! 

స్కూల్ ఫీజులు నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం  పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఏర్పాటు చేశారు. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి చైర్మన్‌గా ఈ కమిషన్ ఏర్పాటయింది. ఈ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రవేటు పాఠశాలలో నర్సరీ నుండి పదవ తరగతి వరకూ. కళాశాలలో ఇంటర్ వరకు ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది.  గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పాఠశాలల్లో ప్రైమరీ విద్యకు రూ.10వేలు, హైస్కూల్ విద్యకు రూ. 12 వేలు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాఠశాలల్లో ప్రైమరీ విద్యకు రూ.11వేలు, హైస్కూల్ విద్యకు రూ.15వేలు, అదే కార్పోరేషన్ పరిధిలో ఉన్న పాఠశాలలకు ప్రైమరీ విద్యకు రూ.12వేల, హైస్కూల్ విద్యకు రూ.18వేలను ప్రభుత్వం నిర్ణయించింది. జూనియర్ కాలేజీల్లో అయితే  గ్రామ పంచాయతీల్లో ఎంపీసీ, బైపీసీ విభాగాలకు రూ.15వేలు, ఇతర గ్రూపులకు రూ.12వేలు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కళాశాలలకు ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500లు, ఇతర గ్రూపులకు రూ.15వేలు, కార్పోరేషన్ల్ పరిధిలో ఉన్న కళాశాలలకు ఎంపీసీ, బైపీసీలకు రూ.20వేలు, ఇతర గ్రూపులకు రూ.18వేలు నిర్ణయించారు.
AP School Fee Row : ఏపీలో అతి తక్కువ స్కూల్ ఫీజులు విద్యార్థులకు వరం..! మరి స్కూళ్లకు..?
ఇక ఏ ఇతర ఫీజులూ వసూలు చేయరాదు.. !

ఇప్పటి వరకూ కాలేజీలు, స్కూళ్లు ఫీజు కాకుండా రకరకాల రుసుములు వసూలు చేసేవారు. ఇక నుంచి ఏ ఒక్క ఇతర రుసుమునూ వసూలు చేయలేరు. ట్యూషన్, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్‌ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, స్పోర్ట్సు, కంప్యూటర్‌ ల్యాబొరేటరీ, లైబ్రరీ, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీ, స్టూడెంట్‌ వెల్ఫేర్, స్టూడెంట్‌ హెల్త్‌ కేర్, స్టడీ టూర్‌ తదితర ఫీజులన్నీ ఇందులో కలిపి ఉంటాయి.. విద్యార్థుల రవాణా కోసం బస్సులు ఏర్పాటు చేసి ఉంటే రవాణా చార్జీల కింద కిలోమీటరుకు రూ.1.20 చొప్పున వసూలు చేయాలని తెలిపింది. హాస్టళ్ల ఫీజు నిర్దేశించింది. విద్యార్థులకు హాస్టల్‌లో ఉంటే గరిష్టంగా రూ. 24వేలు మాత్రమే వసూలు చేయాలని జీవోలో పేర్కొన్నారు.
AP School Fee Row : ఏపీలో అతి తక్కువ స్కూల్ ఫీజులు విద్యార్థులకు వరం..! మరి స్కూళ్లకు..?

ఇంత తక్కువ ఫీజులతో నిర్వహణ అసాధ్యమంటున్న ప్రైవేటు స్కూల్స్..!

ప్రస్తుతం ఓ మాదిరి కార్పొరేట్ స్కూల్‌లో నర్సరీలో చేర్పించాలన్నా కనీసం రూ. నలభై వేలు వసూలు చేస్తున్నారు.  ప్రతీ ఏడాది పెంచుకుంటూ పోతున్నారు. స్కూల‌్ అంటే ఇప్పుడు అనేక రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని .. కేవలం తరగతి గదులు పెట్టి ఒక్కో టీచర్‌ని ఉంచడం విద్యాబోధన కాదని అంటున్నారు. టెక్నికల్‌గా కూడా ఎంతో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని..  ఒక్కో సెక్షన్‌లో పరిమితమైన విద్యార్థుల్ని పెట్టి అందరిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని చదువులు చెప్పే పరిస్థితి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పదో తరగతి విద్యార్థికి కూడా ఏడాదికి రూ. 18వేలతో చదువు చెప్పడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. నిర్వహణ ఖర్చులు కూడా రావని అంటున్నారు.  ఈ ఫీజులతోనే పాఠాలు చెప్పాలంటే నాణ్యతా ప్రమాణాలు పడిపోతాయని అంటున్నారు. స్కూళ్ల నిర్వహణ భారమై మూతపడుతాయని అంటున్నారు.
AP School Fee Row : ఏపీలో అతి తక్కువ స్కూల్ ఫీజులు విద్యార్థులకు వరం..! మరి స్కూళ్లకు..?

జమాఖర్చులు చూపిస్తే ఫీజులు పెంచుకునే చాన్సిస్తామంటున్న ప్రభుత్వం..! 

అయితే ప్రభుత్వం మాత్రం  తల్లిదండ్రులతో పాటు 90 శాతానికి పైగా ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని ప్రకటించింది. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ మీడియా సమావేశం పెట్టి మరీ ఈ విషయం ప్రకటించారు. ఫీజులు సరిపోవని అనుకుంటే పెంచాలని కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు. ఏ విద్యా సంస్థకైనా తమకు ఆ ఫీజు చాలదని భావిస్తే 15 రోజుల్లో జమా ఖర్చులకు సంబంధించిన అన్ని రికార్డులతో కమిషన్‌కు దరఖాస్తు చేయవచ్చు. దాన్ని పరిశీలించి కమిషన్‌ సానుకూల పరిష్కారం చూపిస్తుందని ప్రకటించారు. అంటే కొన్ని విద్యా సంస్థలకు ఫీజులు పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించబోతోందన్నమాట. 

రాజకీయ ప్రత్యర్థుల వేటకు విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారని విపక్షాల విమర్శలు..!

కరోనా కారణంగా స్కూళ్లు నడవక అప్పుల పాలై కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేటు స్కూల్ ఓనర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల దుస్థితిని తెలిచేసతోందని రాజకీయ పార్టీలు అంటున్నాయి. ఇలాంటి సమంయలో అతి తక్కువ ఫీజులు నిర్ణయించడం వల్ల విద్యా ప్రమాణాలు మరింత పడిపోతాయని అంటున్నారు. ఏపీలో విద్యారంగం ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లోనే ఉందని.. వారిని దెబ్బకొట్టాడనికే ఈ ఫీజులు ఖరారు చేశారన్న ఆరోపణలను టీడీపీ నేతలు వినిపిస్తున్నారు. ఏపీలో అడుగడుగునా కనిపించే నారాయణ గ్రూప్ స్కూల్స్ .. మాజీ మంత్రి నారాయణ కుటుంబానికి చెందినవి. అలపాటి రాజేంద్రప్రసాద్ సహా అనేక మంది టీడీపీ నేతలకు విద్యా సంస్థలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని విమర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రైవేటు విద్యా సంస్థల దోపిడి నుంచి ప్రజలను కాపాడుతున్నామని చెబుతోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Nara Lokesh Speech Tribal University Convocation: ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య - ఘనంగా కేంద్రీయ గిరిజన వర్సిటీ మొదటి స్నాతకోత్సవం
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య - ఘనంగా కేంద్రీయ గిరిజన వర్సిటీ మొదటి స్నాతకోత్సవం
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Pawan Kalyan Meets Devendra Fadnavis : రాష్ట్రానికి రెండు ఆడపులులను సాధించిన కొమరం పులి! మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ
రాష్ట్రానికి రెండు ఆడపులులను సాధించిన కొమరం పులి! మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget