అన్వేషించండి

Payyavula : దాడుల్లో డీజీపీ పాత్ర - సీబీఐ విచారణకు టీడీపీ డిమాండ్ !

టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడుల్లో డీజీపీ పాత్ర ఉందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.


తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి విషయంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.  పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడులన్నీ పోలీసుల కనుసన్నల్లోనే జరిగాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో విధ్వంసం సృష్టించిన వారిలో పది మంది పోలీసులు ఉన్నారని ప్రకటించారు. పార్టీ ఆఫీసులో ఉన్న సీసీ కెమెరాల్లో అన్నీ దృశ్యాలు నమోదయ్యాయని స్పష్టం చేశారు. తాము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని.. కోర్టున సైతం ఆశ్రయిస్తామని ప్రకటించారు. 

Also Read : పోలీసులకు సిగ్గు లేదా?, నీ కథ ఏంటో చూస్తా..! ఆ పని చేస్తే జగన్‌కి మేమూ సహకరిస్తాం: చంద్రబాబు

డీజీపీ కార్యాలయంలో పీఆర్వోగా పనిచేస్తున్న వ్యక్తి టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిలో ఉన్నారని ఫోటోలను మీడియాకు పయ్యావుల కేశవ్ విడుదల చేశారు.  ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఆయన చేతే నారా లోకేశ్ పై కేసు పెట్టించారని మండిపడ్డారు. డీజీపీ సరైన చర్యలను ఇప్పుడు తీసుకోకపోతే... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు. రిటైర్ అయిన తర్వాత డీజీపీ కూడా సామాన్యుడిగానే మారిపోతారని... జరుగుతున్న పరిణామాల్లో కిందస్థాయి పోలీసుల తప్పు లేదని... పోలీస్ అధికారులదే మొత్తం తప్పని స్పష్టం చేశారు.

Also Read: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్.. తలుపులు బద్దలుకొట్టి మరీ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు..

ఐపీఎస్ అధికారిగా చేసిన ప్రమాణం ఏమైందని డీజీపీని పయ్యావుల ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని అన్నారు. ఇంటికి వెళ్లి మీ భార్యా పిల్లలను అడగాలని మీరు చేస్తున్నది కరెక్టేనా అనేది అడిగి తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు సిఫార్సుచేయాలన్నారు. లేకపోతే తామే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని... ఆధారాలన్నింటినీ కోర్టుల్లో పెడతామన్నారు. 

Also Read: నిన్నటి వరకూ బూతులు .. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ? 

మరో వైపు ముఖ్యమమంత్రి జగన్ పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో తనను టీడీపీ నేతలు బోషడికే అని తిట్టారని.. ఆ తిట్టుకు అర్థం కూడా విడమర్చి చెప్పడంపై పయ్యావుల కేశవ్ ఆస్చర్యం వ్యక్తం చేశారు.  అసలైన సమస్యను తప్పుదోవ పట్టించేందుకే సీఎం ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇదే పదాన్ని మీ మంత్రులు గతంలో అనలేదా? అని ప్రశ్నించారు. బ్రిటీష్ కాలంలోనే బోసడీకే అని పిలిచే సంప్రదాయం ఉన్నట్టు కొందరు చెపుతున్నారని.... ఆ పదానికి అర్థం 'మీరు బాగున్నారా' అని అంటూ మరికొందరు భాష్యం చెపుతున్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. డ్రగ్స్ సమస్యపై మాట్లాడకుండా ఇతర అంశాలను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసి.. భావితరాల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. 

Also Read : మోహన్‌బాబు అరెస్ట్‌కు రెండు రాష్ట్రాల్లో ఫిర్యాదులు ! ఎందుకంటే ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ ట్రైన్స్!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ ట్రైన్స్!
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Secret Wedding Misfires: విజయవాడ కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు.. న్యాయం కోసం మహిళ ఆవేదన
విజయవాడ కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు.. న్యాయం కోసం మహిళ ఆవేదన
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget