అన్వేషించండి

Corona Updates: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులివే.. దేశంలో 31వేలకు పైగా ఆందోళనకర వేరియంట్లు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా వైరస్ కారణంగా ఏపీలో 13 మంది మృతి చెందగా.. తెలంగాణలో ఇద్దరు చనిపోయారు. 


ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో 41,173 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 878 కరోనా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,13,001కి చేరింది. కొత్తగా కరోనా నుంచి 1,182 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 19,84,301కి చేరింది. ప్రస్తుతం 14,862 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,65,76,995 శాంపిల్స్ పరీక్షించారు.

Also Read: Woman Arrested: ప్రియుడి కోసం కన్నబిడ్డకు చిత్రహింసలు.. ఏపీ మహిళను అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు

India Taliban Relations: 'భారత్'తో బలమైన బంధం కావాలి.. కానీ 'పాక్' మాకు బ్రదర్: తాలిబన్లు

తెలంగాణలో కొత్తగా 340 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,57,716 మంది కరోనా బారిన పడ్డారు. 359 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,47,953 మందికి చేరింది.  కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు 3,872 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Also Read: Paralympics 2020: అవనికి ప్రత్యేక SUV వాహనం... ప్రకటించిన ఆనంద్ మహీంద్ర

Maha ED : మహారాష్ట్ర మంత్రికి ఈడీ సమన్లు.. రాణె అరెస్టుకు ప్రతీకారమా..!?

24 గంటల్లో తెలంగాణలో 75,102 మందికి పరీక్షలు చేశారు. అయితే ఇంకా 1,658 మంది రిపోర్ట్స్​ రావల్సి ఉంది. ఇప్పటివరకు 2,45,59,439 మందికి నిర్ధరణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.58 శాతం, రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది. ఆసిఫాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 24 జిల్లాలో పదిలోపే కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్​లో 72 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.

Also Read: West Godavari: గుంతల రోడ్డు బాగు చేయాలని అడవికొలను ప్రజల ఆందోళన.. పోలీసుల లాఠీ ఛార్జ్..

Gold Smuggling: ప్యాంటుపై పెయింట్ అనుకున్నారా? గోల్డ్ స్మగ్లింగ్ కు 'వాట్ ఏన్ ఐడియా సర్ జీ'

దేశంలో 31వేలకు పైగా ఆందోళనకర కొవిడ్ 19 వేరియంట్లు ఉన్నట్లు గుర్తించింది జీనోమ్​ కన్సార్టియం. దేశవ్యాప్తంగా జరిపిన జీనోమ్​ సీక్వెన్సింగ్​లో వీటిని గుర్తించారు. ఇందులో 4,227 ఆల్ఫా, 219 బీటా, 2 గామా, 21,192 డెల్టా, 5,417 బి.1.1617.1, బి.1.617.3 వేరియంట్లు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి భారత్​లో డెల్టానే ప్రధాన ఆందోళనకర వేరియంట్​గా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Jagan Tollywood Meet : నాలుగో తేదీన టాలీవుడ్ పెద్దలతో ఏపీ సీఎం జగన్ భేటీ !

Gajuwaka: నాలుగో వ్యక్తితో పెళ్లి కోసం మూడో భర్త దగ్గర డబ్బులు తీసుకున్న గాజువాక పిల్ల

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Diet for Weight Loss : ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
Embed widget