అన్వేషించండి

CM Chandrababu: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం తీర్పు - స్వాగతించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్

Andhra News: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును సీఎం చంద్రబాబు స్వాగతించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

CM Chandrababu Welcome The Order Of Supreme Court: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకానికి సంబంధించి స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్వాగతించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సీబీఐ, ఏపీ పోలీస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

తీర్పును స్వాగతించిన మంత్రి లోకేశ్

మరోవైపు, మంత్రి నారా లోకేశ్ సైతం సుప్రీం తీర్పును స్వాగతించారు. 'పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీకి పాల్పడిన వారిని గుర్తించేందుకు సిట్‌లో భాగమైన ఏజెన్సీల అదనపు మద్దతుతో కొనసాగుతోన్న దర్యాప్తును పటిష్టం చేయాలనే సుప్రీం నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అటు, హోంమంత్రి అనిత సైతం సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించారు. 'శ్రీవారి లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన  విషయం. సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఈ వ్యవహారంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలి. తప్పు చేయనివారు భయపడరు. విజిలెన్స్ ఎంక్వైరీ అంటే సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారు.' అని అనిత ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు తీర్పు ఇదే

తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి వేర్వేరు పిటిషన్ల సందర్భంగా ఇటీవల ఏపీ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారించాలని సూచించింది. ప్రస్తుతం వేసిన సిట్ నుంచి ఇద్దరు, సీబీఐ నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఐఏ నుంచి మరొకరు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ దర్యాప్తు సంస్థకు నాయకత్వం వహించబోతున్నారు. మొత్తం దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌ సూద్‌ పర్యవేక్షించబోతున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్‌ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ స్వతంత్ర దర్యాప్తునకే మొగ్గు చూపింది.

Also Read: Sharmila On Pawan : మోడీ డైరక్షన్‌లో పవన్ - రాహుల్‌ను విమర్శించే అర్హత ఉందా - షర్మిల విమర్శలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
NTRNeel Project: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
Sai Pallavi: సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా?
సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా ?
Maha Kumbh: ఎలా వస్తాయబ్బా ఇలాంటి ఐడియాలు - వీడియో కాల్‌తో త్రివేణి సంగమంలో  పుణ్యస్నానం చేయించేస్తున్నారు.
ఎలా వస్తాయబ్బా ఇలాంటి ఐడియాలు - వీడియో కాల్‌తో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయించేస్తున్నారు.
Embed widget