అన్వేషించండి

Chandra Babu Naidu: చంద్రబాబుకు బెయిల్ రావడంతో సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. తమకు పార్టీకి లభించిన భారీ ఊరటగా చెప్పుకుంటున్నారు నేతలు.

Chandra Babu Naidu: చంద్రబాబుకు వచ్చింది మధ్యంతర బెయిల్ అయినప్పటికీ టీడీపీ శ్రేణులు భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమకు పార్టీకి లభించిన భారీ ఊరటగా చెప్పుకుంటున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి పరిటాల సునీత ఇంటి వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చి బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. 

పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... ఇక నుంచి వైసీపీ నాయకులకు ఆట మొదలైందని.. చంద్రబాబు ఒకసారి జనం మధ్యలోకి వస్తే వారి పతనం ప్రారంభమవుతుందని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. ఇన్ని రోజులు చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడిన వారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గత 54 రోజులగా ప్రతి ఇంట చంద్రబాబు కోసం ఆవేదన చెందినవారు ఉన్నారని.. ఆయన బయటికి రావడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు పండుగ చేసుకుంటున్నారన్నారు. ఒక వ్యక్తి ప్రజల గుండెల్లో ఈ స్థాయిలో జరగని ముద్ర వేసుకోవడం చాలా అరుదు అని శ్రీరామ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇకనుంచి మరింత ఉత్తేజంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు..

చంద్రబాబు బెయిల్ మంజూరు కావడంతో తిరుమలలో‌ మొక్కులు

తిరుమల శ్రీవారికి టిడిపి నాయకులు  మొక్కులు సమర్పించుకున్నారు.. శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి, కర్పూరం వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. టిడిపి నాయకులు మీడియాతో మాట్లాడుతూ... శ్రీవారి ఆశీస్సులతో చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయిందన్నారు. నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభానికి ముందు శ్రీవారి ఆశీర్వాదం పొందిన నారా భువనేశ్వరి ఒక్కటే‌ కోరుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని, నిజం గెలవాలని ప్రార్ధించారని తెలిపారు. భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టిన తరువాత శ్రీవారి ఆశీస్సులతో చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయ్యిందని, నారా భువనేశ్వరి సంకల్పం నెరవేరుతుందన్నారు.

పూతలపట్టు సమీపంలోని జాతీయ రహదారిపై బాణాసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు తెలుగు తమ్ముళ్లు. జై చంద్రబాబు జై టీడీపీ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. రాజమండ్రి, హిందూపురం ఇలా ప్రతి నియోజకవర్గంలో టిడిపి శ్రేణుల సంబరాలు చేసుకున్నాయి. 

చంద్రబాబు నాయుడు మధ్యంతర బాయిల్  మంజూరు కావడంతో  అంబరాన్నంటిన సంబరాలు. కుప్పం టీడీపీ కార్యాలయం నుంచి కుప్పం బస్టాండ్ సెంటర్ వద్దకు పాదయాత్ర చేసుకుంటూ ర్యాలీ తీశారు నేతలు. బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి ,ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాయి టీడీపీ  శ్రేణులు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద టపాసులు  కాల్చుకుంటూ స్వీట్స్‌  పంచుకున్నారు. నిజం గెలిచింది ..నిజమే గెలిచింది ..  సైకో పోవాలి సైకిల్  రావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. 

హైదరాబాద్‌లో సంబరాలు
హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో టిడిపి శ్రేణుల సంబరాలు చేసుకున్నాయి. ఇకపై టీడీపీకి తిరుగు ఉండదని అభిప్రాయపడ్డారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP BJP Congress: నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్Raja Singh Counter to Asaduddin | అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలకు రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలుBJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP BJP Congress: నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
Bharateeyudu 2 Trailer: ‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
Nandyal: నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
Embed widget