అన్వేషించండి

Chandrababu: జీవితంలో జగన్ ఇక గెలవడు- తుని సభలో చంద్రబాబు వ్యాఖ్యలు

Tuni TDP Meeting: జగన్ ఇక జీవితంలో గెలవడని తుని బహిరంగ సభలో చంద్రబాబు విమర్శించారు. జగన్ ఇక గెలిచే పరిస్థితులు లేవని, వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు.

TDP Public Meeting In Tuni: వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమి గెలవడం ఖాయమని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఆశాభావం వ్యక్తం చేశారు. జీవితంలో ఎప్పుడూ జగన్ గెలిచే అవకాశాలు లేవని, రాష్ట్రంలో రాజకీయం మరిందని చెప్పడానికి తునినే సాక్ష్యమన్నారు. 'రా.. కదలి రా' కార్యక్రమంలో భాగంగా ఇవాళ తునిలో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ (YS Jagan) ప్రభుత్వంపై వ్యతిరేకతతో తాము ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలకు ఎక్కడ చూసినా జనం బ్రహ్మారథం పడతున్నారని అన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని,  త్వరలో సునామీగా మారుతుందన్నారు, సునామీలో వైసీపీ చిరునామా గల్లంతవుతుందని, మూడు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అహంకారమే ఆయన అంతానికి దారితీసే పరిస్థితి వచ్చిందని, వైసీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. జగన్ రాతియుగం పోవాలని, టీడీపీ-జనసేన స్వర్ణయుగం రావాలన్నారు.

ప్రజల జీవిత ప్రమాణాల్లో మార్పు వచ్చిందా? 
'సైకో జగన్‌కు.. ఐదు కోట్ల మంది ప్రజలకు మధ్య పోరాటం జరుగుతుంది. ఐదేళ్లలో ప్రజల జీవిత ప్రమాణాల్లో మార్పు వచ్చిందా?  కల్తీ మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లతో ఆడుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీగా టీడీపీకి పేరుంది. త్వరలోనే పేదలు, రైతుల సంక్షేమ రాజ్యం వస్తుంది. ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలి. మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. కౌలు రైతులను ఆదుకునే బాధ్యత తీసుకుంటా. వెనుకబడిన వర్గాలకు సమర్థ నాయకత్వం ఇచ్చిన పార్టీ టీడీపీ.. వెనుకబడిన వర్గాల కోసం జయహో బీసీ తీసుకొచ్చాం. అన్ని వర్గాలను గౌరవించే బాధ్యత తీసుకుంటాం. 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ' తప్పకుండా అమలు చేస్తా. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ. తెలుగుజాతిని స్వర్ణయుగం వైపు నడిపే బాధ్యత తీసుకుంటా. ప్రపంచంలో తెలుగుజాతి నంబర్‌వన్‌గా ఉండాలనేది నా సంకల్పం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి జగన్? 
పేదరికం లేని సమాజం చూడాలనే ఎన్టీఆర్ కలను సాకారం చేస్తానని, పేదరికం నుంచి ప్రతి ఒక్కరూ బయటపడేలా చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి జగన్ అని, నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎస్సీలు, ఎస్టీలు అంటే జగన్‌కు లెక్క లేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఆదాయంతో సమానంగా వడ్డీలు, అసలు కట్టే పరిస్థితి లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించి ఆదాయం పెంచుతామని, పెంచిన ఆదాయంతో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామన్నారు.

అమరావతే రాజధాని అని జగన్ అధికారంలోకి వచ్చారని, వచ్చిన తర్వాత అమరావతిని పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచి ప్రజలకు భారం మోపారన్నారు. దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధరలు ఏపీలోనే ఉన్నాయని ఆరోపించారు. నాసిరకం, కల్తీ మధ్యం తీసుకువచ్చారని, దాని వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. తెలుగుజాతికి దశ, దిశ చూపిస్తామని, రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచింది టీడీపీనేనని తుని బహిరంగ సభలో చంద్రబాబు పేర్కొన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.