అన్వేషించండి

Chandrababu Comments: ఆస్కార్ ఇవ్వాల్సింది ట్రిపుల్ ఆర్‌కి కాదు ఆయనకే- చంద్రబాబు హాట్ కామెంట్స్!

Chandrababu Comments: ప్రజల రక్తాన్ని తాగే జలగలు, వైసీపీ దొంగలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పును ప్రజలే కట్టాల్సి వస్తుందని చెప్పారు.  

Chandrababu Comments: వైసీపీ ప్రభుత్వం చేసిన రూ.10 కోట్ల అప్పులను ఏపీ సీఎం జగన్ కట్టరని, ప్రజలే కట్టుకోవాలని అన్నారు. రూ. లక్షల కోట్ల అప్పు ప్రజల నెత్తిన వేసి.. జగన్ ఓడిపోయాక ఎక్కడికి పారిపోతారో కూడా తెలియదని ఆరోపించారు. అంతే కాకుండా ప్రజలకు రక్తాన్ని తాగే జలగలు... వైసీపీ దొంగలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల ఆస్తి పరుడైన సీఎం.. రాబోయే ఎన్నికల్లో పేదలకు-ధనికులకు యుద్ధం అంటున్నారని.. ఇదెక్కడి విడ్డూరమని చంద్రబాబు అన్నారు. జగన్ అఫిడవిట్ లో రూ.373 కోట్ల ఆస్తిని పేర్కొన్నారని.. దేశంలో అందరూ సీఎంల సంపద కలిపినా ఈయన సంపదలో సగం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాళ్ల పేదవాళ్ల పక్షం అంటే నమ్మడం కష్టమని చెప్పారు. వైసీపీ నేతలు 5, 10 వేల రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకునేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారని వివరించారు. ప్రజలు ఏమాత్రం డబ్బులపై ఆశ చూపించినా ఇక మీ భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తారంటూ స్పష్టం చేశారు. 

కాకినాడ జిల్లా జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. గురువారం రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొని వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. రాత్రికి పెద్దాపురం చేరుకున్న చంద్రబాబు బహిరంగ సభలో.. మా నమ్మకం నువ్వే అనే స్టిక్కర్లను ప్రతీ ఇంటికి అతికిస్తారట అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రజల నమ్మకం కాదు మా దరిద్రం నువ్వే జగన్ అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు పోయాయంటూ ఆరోపించారు. ప్రజలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి ఎమ్మెల్యే ద్వారంపూడి ఆఫ్రికాకు అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. పోలీసులు మంచి వాళ్లే అయినప్పటికీ.. వారి మెడపై కత్తి పెట్టి చెడు పనులు చేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్కార్‌ ఇవ్వాల్సింది ట్రిపుల్ ఆర్‌కు కాదని...కోడి కత్తి కమల్‌ హాసన్‌కు అని ఎద్దేవా చేశారు చంద్రబాబు. 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు చంద్రబాబు పర్యటనకు అనూహ్య స్పందన వచ్చింది. కాట్రావులపల్లిలో పంటపొలాలు పరిశీలించిన చంద్రబాబు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత స్కూలు విద్యార్థులు వెళ్తున్న పాఠశాల బస్సు ఎక్కి ముచ్చటించారు. వారిలో ఉత్సాహం నింపారు. పిల్లలంతా ముక్తకంఠంతో మీరే సీఎం కావాలంటూ విద్యార్థులు కోరారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సొంత పార్టీలో కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా జగ్గంపేటలో పర్యటిస్తున్న చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ప్రతి ముఫ్ఫై ఇళ్లకు టీడీపీ తరపున ఓ సాధికార సారథిని నియమించాని నిర్ణయించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయించుకోలేకపోయమని కొంత మంది కార్యకర్తలు బాధపడ్డారని.. ఈసారి మాత్రం ప్రత్యేక వ్యవస్థ పెట్టి .. అందరికీ న్యాయం చేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఏ కార్యకర్తకు పని అవసరం అయినా.. పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్‌ ఇన్‌ఛార్జ్‌లందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేలా వీళ్లు పనిచేస్తారని వివరించారు. సాధికార సారథులుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని చెప్పారు.                                                     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan meets Chandrababu : గ్రామ వికాసమే లక్ష్యం - చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు
గ్రామ వికాసమే లక్ష్యం - చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Karumuri Nageswara Rao: కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదు, సిట్ అధికారికే లంచం ఇచ్చే ప్రయత్నం!
కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదు, సిట్ అధికారికే లంచం ఇచ్చే ప్రయత్నం!
Kesineni Chinni vs MLA Kolikapudi: కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Manchu Manoj Wedding Anniversary: మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Embed widget