అన్వేషించండి

AP Congress : మోదీ, జగన్ కలిసే మోసం చేశారు - తిరుపతిలో ప్రత్యేకహోదా డిక్లరేషన్ చేసిన వైఎస్ షర్మిలారెడ్డి !

AP Congress : ఏపీని చంపింది ప్రధాని మోదీనేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ప్రత్యేకహోదా డిక్లరేషన్ సభలో ప్రసంగించారు.

AP Congress : కేంద్రంలో  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదాపై తొలి సంతకం చేస్తామని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి ప్రకటించారు. గతంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చిన  తిరుపతి తారక రామ గ్రౌండ్ లో  APCC ప్రత్యేక హోదా సాధన సభ నిర్వహించింది.  ప్రత్యేక హోదా పై డిక్లరేషన్ ప్రకటన చేశారు షర్మిలారెడ్డి.  అధికారంలో వచ్చిన వెంటనే హోదాపై రాహుల్ తొలి సంతకం చేస్తామన్నారు.  10 ఏళ్లు ప్రత్యేక హోదా అమలు చేస్తామని.. "ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. హోదా పై మూడు నామాల వానికే మోడీ పంగనామాలు పెట్టాడని విమర్శించారు. 

మోడీ ఒక కేడీ 

పంగనామాలు పెట్టిన మోడీ ఒక KD అని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.  మోడీ అంటే మోసం. మోసం చేసే వాడే మోడీ అని మండిపడ్డారు.  హోదా అడిగితే తల్లిని చంపి బిడ్డను వేరు చేశాడు అంటున్నాడని..   నిజానికి తల్లి లాంటి ఆంధ్రను చంపింది మోడి నేనని మండిపడ్డారు.  హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని మోడీ చంపాడన్నారు.  పోలవరం కట్టకుండా రాష్ట్రాన్ని చంపుతుంది మోడీ నేనని..  విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని చంపింది మోడీ నేనని విమర్శఇంచారు.  ప్రత్యేక హోదా ఇచ్చే వాళ్ళు కావాలా ? హోదా ను తాకట్టు పెట్టే వాళ్ళు కావాలా ?  అని వైఎస్ షర్మిలా రెడ్డి ప్రశ్నించారు.  కోమాలో ఉన్న కాంగ్రెస్ లో నేను చేరింది కేవలం విభజన హామీల సాధన కోసమేనని..  హోదాకోసం అరాట పడే వాళ్ళ మద్య..హోదాను తాకట్టు పెట్టే వారికి మధ్య జరుగుతున్న పోరాటమన్నరాు.  ప్రత్యేక హోదా తో పాటు వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి గడపకు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. 
 
ప్రత్యేక హోదా మన హక్కు 

తిరుపతిలో ఇదే మైదానం వేదికగా మోడీ హామీ ఇచ్చారని.. ఆంధ్ర ప్రజల అవేదన నాకు తెలుసు అన్నాడని..  అధికారం వచ్చిన వెంటనే 10 ఏళ్లు హోదా ఇస్తా అన్నాడన్నారు. ఆంధ్ర రూపు రూపు రేఖలు మారుస్త అన్నాడు కానీ.. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. న్యూ ఢిల్లీ చిన్నబోయే రాజధాని సహకారం అన్నాడు..  ఆంధ్రలో హర్డ్ వేర్ హబ్ అన్నాడు ..ఇంధన యూనివర్సిటీ అన్నాడు ..ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేక పోయాడని విమర్శించారు. ఢిల్లీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా మన హక్కు అని స్పష్టం చేసారు.  హోదా మన హక్కు,పోలవరం మన హక్కు కడప స్టీల్ మన హక్కు, దుగ్గరాజ పట్నం పోర్ట్ మన హక్కు, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ మన హక్కు అన్నారు. 
 
రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి !

హక్కుల సాధనలో బాబు,జగన్ విఫలం అయ్యారని.. ఒక్క హక్కు మీద కూడా పోరాటం చేయలేదన్నారు.  విభజన జరిగి 10 ఏళ్లు దాటింది... ఒక్క హామీ సాధించుకొలేదున్నారు.  15 ఏళ్లు హోదా కావాలని బాబు అడిగారు .. తర్వాత హోదా అడిగితే జైల్లో పెట్టారు.. ఊసరవెల్లి లా రంగులు మార్చారు.. ఈయన రంగులు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు.  జగన్ ఆన్న 25ఎంపీలు కావాలని అడిగారు .. హోదా కోసం దీక్షలు చేశారు  ఎంపీలు రాజీనామా చేస్తే హోదా ఎందుకు రాదో చూద్దాం అన్నాడు   పులిలా గర్జించి అధికారం రాగానే పిల్లి అయ్యాడన్నారు.  మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నాడని మండిప్డారు.  ఒక ముఖ్యమంత్రి 3D గ్రాఫిక్స్ చూపించారు,, ఒక ముఖ్యమంత్రి 3 రాజధానులు అన్నాడు  ఈ పాపం బీజేపీది,బాబుది,జగన్ దన్నారు.  రాష్ట్ర అభివృద్ధి 25 ఏళ్లు వెనక్కి పోవడానికి వీళ్ళే కారణం విభజన హామీలు కాదు..స్థానిక హామీలు కూడా అమలు కానీ పరిస్థితి ఉందన్నారు.  

ఒక్కహామీని నిలబెట్టుకోవాలేదు !

‘‘ఏపీని హార్డ్ వేర్ హబ్‌గా మారుస్తామని, చమురు రిఫైనరీలు ఇస్తామని మోదీ చెప్పారు. వాటిలో ఒక్కమాటా నిలబెట్టుకోలేదు. పదేళ్లుగా ఏపీ ప్రజలను భాజపా మోసం చేసింది. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకు పరిశ్రమలు వస్తాయి.. తద్వారా ఉద్యోగాలు వస్తాయి. మరి ఏపీకి ఏం వచ్చాయి? కనీసం 10 పరిశ్రమలు కూడా రాలేదు. ఉద్యోగాలు దొరక్క యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. యువత లేని రాష్ట్రంగా ఏపీ తయారవుతోంది. మెగా డీఎస్సీ అని దగా చేశారు. జాబ్ క్యాలెండర్‌ అని జగన్‌.. యువతను మోసం చేశారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి ఓట్లు దండుకున్నారే తప్ప.. ఎవరూ పోరాటం చేయలేదు. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి నిర్ణయాలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి’’ అని షర్మిల పిలుపునిచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
Embed widget