అన్వేషించండి

Breaking News on 24 September: బీసీ కార్పొరేషన్ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 23న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

LIVE

Key Events
Breaking News on 24 September: బీసీ కార్పొరేషన్ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 23న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

22:15 PM (IST)  •  23 Sep 2021

బీసీ కార్పొరేషన్ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్

బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయశాఖ పరిధి నుంచి ఏపీ ప్రభుత్వం తప్పించింది. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.  

21:13 PM (IST)  •  23 Sep 2021

ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు శ్రీలక్ష్మికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దాల్మియా కేసులో ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే గురువారం విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వారెంట్‌ను ఈనెల 30లోగా అమలు చేయాలని ఆదేశించింది.

20:44 PM (IST)  •  23 Sep 2021

తెలంగాణలో కొత్తగా 247 కోవిడ్‌ కేసులు..

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 247 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,64,411కు చేరింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు బులెటిన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ కారణంగా ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 3,909కి చేరింది. నిన్న ఒక్కరోజే కోవిడ్ బాధితుల్లో 315 మంది కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 6,55,625కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,877 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

19:49 PM (IST)  •  23 Sep 2021

రేపు మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక

ఏపీలో మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక శుక్రవారం జరగనుంది. శుక్రవారం ఉదయం 10 గంటల్లోగా నామినేషన్ల స్వీకరిస్తారు. ఉదయం 10 నుంచి 12 వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. మధ్యాహ్నం 12 గం.కు నామినేషన్లు వేసిన వారి జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటలోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు కోఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక, ప్రమాణస్వీకారం ఉంటుంది. మధ్యాహ్నం 3 నుంచి ఎంపీపీ, ఉపాధ్యక్షుడి ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. 

19:45 PM (IST)  •  23 Sep 2021

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు 

భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. తొలి దశలో త్వరలో 51 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయింది. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. 

19:41 PM (IST)  •  23 Sep 2021

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో చేపట్టబోయే ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు జారీచేసింది. రూ. 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూ.2,653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టనున్నారు. 1.65 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా రూ.1,774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. సంగమేశ్వర ఈ పథకం ద్వారా సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలకు ప్రయోజనం కలుగనుంది. 

17:20 PM (IST)  •  23 Sep 2021

కార్లపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు... మద్యం మత్తులో డ్రైవర్! 

సికింద్రాబాద్‌ తాడ్‌బండ్‌ కూడలి వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేక్‌ ఫెయిలై కార్లపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  బోయిన్‌పల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. బస్సు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. 

16:28 PM (IST)  •  23 Sep 2021

దేశంలో మరో దారుణం.. బాలికపై 29 మంది సామూహిక అత్యాచారం

దేశంలో మరో దారుణమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ఠాణెలో ఓ బాలికపై ​29 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్ర ఠాణెలోని దోంబివల్లిలోని భోపర్​ ప్రాంతంలో 14 ఏళ్ల బాలికపై 29  మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 21 మందిని అరెస్ట్​ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మరో 8 మంది పరారీలో ఉన్నారు. 

16:14 PM (IST)  •  23 Sep 2021

రేపు దిల్లీకి సీఎం కేసీఆర్

రేపు (శుక్రవారం ) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి శాసన సభా సమావేశాల ప్రారంభ కార్యక్రమం, అనంతరం జరిగే బీఏసీ సమావేశం పాల్గొంటారు. తర్వాత సీఎం కేసీఆర్ దిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 25న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షకావత్ తో సమావేశమౌతారు. 26వ తేదీన విజ్జానభవన్ లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ  మంత్రి పీయూష్ గోయెల్ తో  భేటీ అవుతారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. 

13:19 PM (IST)  •  23 Sep 2021

భవనంలో పేలుడు.. ముగ్గురు మృతి

బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ భవనంలో పెద్ద ఎత్తున నిల్వ ఉన్న బాణా సంచా పేలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. పేలుడు ధాటికి వారి శరీరాలు తునాతునకలు అయ్యాయి. మరికొందరికి గాయాలయ్యాయి. బెంగళూరులోని చామరాజు పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hardik Pandya poor Form IPL 2024 | మరోసారి కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమైన హార్దిక్ పాండ్యా | ABPSandeep Sharma 5Wickets | RR vs MI మ్యాచ్ లో ఐదువికెట్లతో అదరగొట్టిన సందీప్ శర్మ | ABP DesamSanju Samson | RR vs MI | సౌండ్ లేకుండా మ్యాచ్ లు గెలవటమే కాదు..పరుగులు చేయటమూ తెలుసు | IPL 2024Yashasvi Jaiswal Century | RR vs MI మ్యాచ్ లో అద్భుత శతకంతో మెరిసిన యశస్వి | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Money Rules: మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
Allari Naresh: అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా
అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా
Embed widget