Breaking News on 24 September: బీసీ కార్పొరేషన్ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 23న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 23న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
బీసీ కార్పొరేషన్ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్
బ్రాహ్మణ కార్పొరేషన్ను దేవాదాయశాఖ పరిధి నుంచి ఏపీ ప్రభుత్వం తప్పించింది. బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు శ్రీలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాల్మియా కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే గురువారం విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్ను ఈనెల 30లోగా అమలు చేయాలని ఆదేశించింది.





















