అన్వేషించండి

Breaking News Live: మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్.. 12.4 కోట్లు మాయం..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
Ap telangana breaking news live updates on 24 January 2022 Breaking News Live: మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్.. 12.4 కోట్లు మాయం..
బ్రేకింగ్ న్యూస్(ప్రతీకాత్మక చిత్రం)

Background

తెలుగు రాష్ట్రాల్లో నేడు సైతం అకాల వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ కాలేదు.

కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. జనవరి 26 వరకు తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురవనుండగా.. మరికొన్ని చోట్ల ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు సూచించారు. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత వర్షాల కారణంగా పెరిగింది.   శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాం, (పుదుచ్చేరి)లలో నేడు వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యల్పంగా కళింగపట్నంలో 17.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గలేదు కానీ వర్షాల కారణంగా చలి గాలులు వీస్తున్నాయి.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయి. ఇటీవల కురిసిన వర్షాలతో చలి ప్రభావం మరింతగా పెరుగుతోంది. అనంతపురంలో 17 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 18.5 డిగ్రీలు, నంద్యాలలో 19 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

తెలంగాణలో వర్షాలు..

తెలంగాణలో అకాశం నిర్మలమై ఉంటుంది. ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత అధికమైంది.  కనిష్ట ఉష్ణోగ్రత 18.5 ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33.5 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో నే కొన్ని జిల్లాల్లో పలు చోట్ల తేలిక పాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  స్పష్టం చేశారు.

బంగారం, వెండి ధరలు

భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(సోమవారం) గ్రాముకి ఒక రూపాయి తగ్గింది. కానీ వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.47,520 ఉండగా, 24 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ.49,520గా ఉంది. 

ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630
  • విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల ధర రూ.49,630
  • దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,790, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,870, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040
  • ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,520, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,520
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,690, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,390
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630

వెండిధరలు: 

భారత మార్కెట్ లో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.64,900 ఉండగా, చెన్నైలో రూ.69,000గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.64,900 ఉండగా, కోల్‌కతాలో రూ.64,900, బెంగళూరులో కిలో వెండి రూ.69,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, విజయవాడ, విశాఖలో కూడా రూ. 69,000 వద్ద కొనసాగుతోంది.

అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

19:07 PM (IST)  •  24 Jan 2022

మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్.. 12.4 కోట్లు మాయం..

మహేష్ బ్యాంక్ మెయిన్ సర్వర్ ను సైబర్ కేటుగాళ్ళు హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. మెయిన్ సర్వర్ హ్యాక్ చెసి 12.4 కోట్ల రూపాయలు కాజేశారు. వెంటనే 12.4 కోట్లు.. 127 వేరు వేరు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మహేష్ బ్యాంక్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

17:18 PM (IST)  •  24 Jan 2022

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి.. 4 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిన సఫారీ వాహనం

అనంతపురం జిల్లా.. సోమలదొడ్డి వద్ద సఫారీ వాహనం హాల్చల్ చేసింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి 4 కిలో మీటర్లు ఈడ్చుకొచ్చింది. సఫారీ వాహనంతో ఢీకొట్టి.. ముగ్గర్ని చంపే ప్రయత్నం జరిగింది. అయితే హత్యకేసులో వాయిదాకు వస్తుండగా.. తండ్రీ కొడుకులపై ఈ హత్యాయత్నం జరిగింది. రేగటికొత్తూరులో ఏడాది క్రితం పొలం వద్ద ఘర్షణలో ఒక వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. హత్యకేసులో వాయిదాకు వస్తున్న వెంకటరమణారెడ్డి, పుల్లారెడ్డి, గురుశేఖర్ రెడ్డి.. ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని సఫారీ వాహనం ఢీ కొట్టింది. దీంతో తండ్రీ కొడుకులు కింద పడిపోయారు. అయితే ద్విచక్ర వాహనాన్ని అలానే.. నాలుగు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత.. సఫారీ వాహనాన్ని హంద్రీనీవా కాలువ లో వదిలేసి వెళ్లారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Durgam Lake Encroachment Case: దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
Embed widget