అన్వేషించండి

AP Power Cuts : రూ.వెయ్యి కోట్లతో విద్యుత్ కొనుగోలు - ఆసుపత్రులకు కోతల్లేకుండా చూస్తాం : ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్

AP Power Cuts : కోవిడ్ తర్వాత రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. జాతీయ ఎక్స్ఛేంజీల్లో విద్యుత్ లభ్యత లేని కారణంగా విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుందన్నారు.

AP Power Cuts : ఏపీలో విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. విద్యుత్ డిమాండ్ పెరగడంతో కోతలు తప్పడంలేదని అధికారులు అంటున్నారు. కోవిడ్ తర్వాత విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి బి. శ్రీధర్ అన్నారు. రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లు మాత్రమేనన్నారు. సాధారణంగా ప్రతీ వేసవిలో విద్యుత్ వినియోగం 204 మిలియన్ యూనిట్లకు చేరుతుందన్నారు. కానీ కోవిడ్ తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిందన్నారు. పరిశ్రమలు, ఆర్థిక లావాదేవీలు పూర్తి స్థాయిలో జరుగుతున్న కారణంగా 240 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం చేరిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంత విద్యుత్ డిమాండ్ ఇప్పుడు ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని జెన్కో యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని ఆయన తెలిపారు.

గ్రిడ్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం 

ప్రస్తుత సీజన్లో రూ. 1058 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశామని బి.శ్రీధర్ తెలిపారు. జాతీయ ఎక్స్ఛేంజీల్లో లభ్యత లేని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు విద్యుత్ కోత విధించాల్సి వచ్చిందన్నారు. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. లేకపోతే గ్రిడ్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అందుకే పరిశ్రమల వినియోగంలో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని చెప్పామన్నారు. ఇదీ ఇబ్బందే కానీ తప్పని పరిస్థితి అని శ్రీధర్ తెలిపారు. వ్యవసాయ అవసరాలకు వినియోగించే విద్యుత్ ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత పరిశ్రమలకు యథావిధిగా విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు.

పరిశ్రమలకు 10 మిలియన్ యూనిట్ల కోత 

బొగ్గు సరఫరా గురించి సీఎం, ఎంపీలు ప్రధానితో మాట్లాడితే సరఫరా పెరిగే అవకాశం ఉంటుందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. పొరుగు రాష్ట్రాలకు కూడా తీవ్రమైన విద్యుత్ కొరత ఉందన్నారు. ఆస్పత్రులకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలని డిస్కంలకు ఆదేశాలిచ్చామన్నారు. ప్రస్తుతం 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నామన్నారు. ఎక్సైఛేంజీల్లో లభ్యత లేని కారణంగా గృహాలకు పరిమితంగా కోతలు విధించాల్సి రావొచ్చన్నారు. నికరంగా 30 మిలియన్ యూనిట్ల వరకు లోటు ఉందని ఆయన చెప్పారు. నిన్నటి వరకు పరిశ్రమలకు 10 మిలియన్ యూనిట్ల కోత విధించామని స్పష్టం చేశారు. 

Also Read : Power Cut Memes : కరెంట్ ఏది పుష్పా - ఏపీ పవర్ కట్స్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Embed widget