అన్వేషించండి

Sharmila: రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి - విశాఖ దీక్షలో షర్మిల

దేశంలోని సాధారణ ప్రజల హక్కుల రక్షణకై రాహుల్‌ గాంధీ యాత్ర సాగిస్తున్నారని, అటువంటి యాత్రపై బీజేపీ గూండాలు దాడులకు తెగబడడం దేనికి సంకేతమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు

Pcc chief Sharmila Comments : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్రపై అస్సాంలో బీజేపీ శ్రేణులు దాడి చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో భాగంగా విశాఖ నగర పరిధిలోని జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద షర్మిల నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ నిరంకుశ పాలన సాగిస్తోందని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ యాత్రపై దాడి చేయడం దారుణమన్నారు. దేశంలోని సాధారణ ప్రజల హక్కుల రక్షణకై రాహుల్‌ గాంధీ యాత్ర సాగిస్తున్నారని, అటువంటి యాత్రపై బీజేపీ గూండాలు దాడులకు తెగబడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ తరహా దాడులతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను భయపెట్టలేరని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికైనా బీజేపీ నిరంకుశ విధానాలకు స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉందని, శాంతియుతంగా సాగుతున్న యాత్రపై దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్యం అంటారా..? అని ఆమె ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీని గుడికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని, నిరంకుశ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని షర్మిల స్పష్టం చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, వీహెచ్‌పీ వాళ్లు తప్పా మరొకరు గుళ్లకు వెళ్లకూడదా..? దేశంలో బతకకూడదా..? అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ చర్యలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ఎన్నికలు సమయంలో సరైన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఈ తరహా దాడుల ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని ఆమె పేర్కొన్నారు. దాడికి పాల్పడిన రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉందని, రాహుల్‌ గాంధీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్‌ చేశారు. ప్రజల హక్కులను కాపాడేందుకు సాగిస్తున్న యాత్రపై దాడి చేయడం దారుణమన్నారు.

భారత పౌరుల హక్కులు కోసం కొట్లాడే దిశగా రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ యాత్రను మొదలు పెట్టారన్నారు. అంతకుముందు చేసిన భారత్‌ జోడో యాత్రలో భాగంగా నాలుగు వేల కిలో మీటర్లు చేస్తే.. అడుగడుగునా బీజేపీ, కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఈ తరహా చర్యలను మానుకోవాలని ఆమె పిలుపున్చారు. ఈ తరహా దాడులను ప్రజాస్వామ్యం అంటారా..? అని ఆమె ప్రధాని మోదీని ప్రశ్నించారు. 

గాంధీ విగ్రహానికి నివాళి.. నినాదాలు 
పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆమె విశాఖలో తొలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం ఏడు గంటలకు గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న ఆమె 20 నిమిషాలపాటు అక్కడ కూర్చుని నిరసన తెలిపారు. ముందుగా గాంఽధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నేలపై కూర్చుని నినాదాలు చేశారు. మోదీ డౌన్‌ డౌన్‌, బీజేపీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. సుమారు ఐదు నిమిషాలపాటు బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన షర్మిల.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ విన్నవించారు. 

భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు 
షర్మిల యాత్ర కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఎయిర్‌పోర్టు నుంచి షర్మిల వెంట కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు భారీగా తరలివచ్చారు. ఆమెతోపాటు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాకూర్‌, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరారావు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ పీసీసీ ప్రెసిడెంట్‌ గిడుగు రుద్రరాజు, రాకేష్‌ రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు గంపా గోవింద్‌, పార్టీ నాయకులు వజ్జపర్తి శ్రీనివాస్‌, చోడదాసి సుధాకర్‌, మూల వెంకటరావుతోపాటు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ఎయిర్‌ పోర్టు నుంచి కార్లతో ఆమె కాన్వాయ్‌ వెంట వచ్చారు. ఇక్కడ పర్యటన అర్ధగంటలో ముగించుకున్నారు. ఇక్కడి నుంచి శ్రీకాకుళం పర్యటనకు ఆమె వెళుతున్నట్టు పార్టీ శ్రేణులు వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget