అన్వేషించండి

Pawan Kalyan: 'రఘురామ గారు మీ నుంచి మేం చాలా నేర్చుకోవాలి' - ఏపీ అసెంబ్లీలో నవ్వులు పూయించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Andhrapradesh News: ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నవ్వులు పూయించారు. గత ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను చాలా ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపిస్తూ.. ఎమ్మెల్యే రఘురామ గురించి ప్రస్తావించారు.

Pawan Kalyan Comments In AP Assembly: ఏపీ అసెంబ్లీలో (Ap Assembly Sessions) మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను చాలా ఇబ్బందులు పెట్టిందని.. సీఎంగా చేసిన చంద్రబాబునే తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు జైలులో పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామ గురించి ప్రస్తావిస్తూ పవన్ సభలో నవ్వులు పూయించారు. 'సీనియర్ నేత రఘురామ కృష్ణంరాజును సైతం చాలా ఇబ్బంది పెట్టారు. అయినా ఆయన అవేవీ పట్టించుకోలేదు. సోమవారం సభకు జగన్ వచ్చినప్పుడు చాలా పెద్ద మనసుతో ఆయన దగ్గరకి వెళ్లి ఆప్యాయంగా నవ్వుతూ పలకరించారు. దాడి చేసినా, హాని తలపెట్టినా పట్టించుకోని మీ పెద్ద మనసుకు ధన్యవాదాలు. మీ నుంచి మేము చాలా నేర్చుకోవాలి. సభా ముఖంగా మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు.' అని పవన్ అనగా సభలో నవ్వులు పూశాయి.

'నేను తప్పు చేసినా చర్యలు తీసుకోండి'

రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో పని చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని.. అవినీతికి ఆస్కారం లేకుండా పని చేయాలని అన్నారు. తప్పు చేస్తే జనసేన వారిపైనా చర్యలుంటాయని చెప్పారు. తాను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, ఏపీ పునఃనిర్మాణం కోసం జనసేన సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ఎందరో మహానుభావుల స్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని చెప్పారు. 'గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది. రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ఆగిపోయాయి. శాంతి భద్రతలు క్షీణించాయి. సహజ వనరుల దోపిడీ జరిగింది. పెట్టుబడులు రాకుండా చేశారు. కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం' అని పవన్ పేర్కొన్నారు.

పవన్ ఫస్ట్ ఆన్సర్

కాగా, ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మండలి సభ్యులు తొలి ప్రశ్న అడిగారు. దీనిపై స్పందించిన పవన్.. వైసీపీ హయాంలో ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. కేంద్రం పంచాయతీలకు నిధులిస్తున్నా గత ప్రభుత్వం మాత్రం పంచాయతీలకు నిధుల బదలాయింపులో జాప్యం చేసిందని చెప్పారు. దీని వల్ల కేంద్రానికి రూ.11 కోట్లు పెనాల్టీ చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. భారీ ఎత్తునే నిధుల మళ్లింపు జరిగినట్లు వెల్లడించారు. గ్రామ సచివాలయాల్లో సర్పంచులకు స్థానం ఉండేలా చర్యలు తీసుకుంటామని పవన్ పేర్కొన్నారు.

2 బిల్లులకు ఆమోదం

ఏపీ అసెంబ్లీలో (AP Assembly) మంగళవారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ - 2022 (భూ యాజమాన్య హక్కు చట్టం), ఆరోగ్య వర్శిటీ పేరు మార్పు బిల్లులకు ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. విజయవాడలోని (Vijayawada) ఆరోగ్య వర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుర్ధరించారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) సభలో కీలక ప్రకటన చేశారు. అయితే, ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ సభలో ప్రకటన చేశారు.

Also Read: AP Assembly Sessions: 'హూ కిల్డ్ బాబాయ్? త్వరలోనే జవాబు' - ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget