అన్వేషించండి

AP Assembly Sessions: 'హూ కిల్డ్ బాబాయ్? త్వరలోనే జవాబు' - ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

Andhrapradesh News: వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించారు. 'హు కిల్డ్ బాబాయ్?' అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుందని అన్నారు.

CM Chandrababu Sensational Comments On Viveka Murder Case: 'హు కిల్డ్ బాబాయ్' అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అసెంబ్లీలో ప్రకటించారు. వివేకా హత్య కేసు (Viveka Murder Case) అంశంపై ఆయన సభలో ప్రస్తావించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో దౌర్జన్యాలు, బెదిరింపులు, అవమానాలు, హత్యా ఘటనలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించే పరిస్థితి ఉండేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 'హు కిల్డ్ బాబాయ్.?' అనే ప్రశ్నకు జగన్ సమాధానం తేల్చలేకపోయారని.. ఇప్పుడు జవాబు వస్తుందని చెప్పారు. వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగిందని.. హత్య జరిగాక ఘటనా స్థలికి సీఐ వెళ్లారని చెప్పారు. సీబీఐకి విషయం తెలపడానికి సీఐ వెళ్లారని.. కానీ, వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. 'విచారణాధికారిపైనే కేసు పెడితే హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకునే పరిస్థితి వచ్చింది. వివేకా హత్య కేసు నిందితుల అరెస్టుకు వెళ్లిన సీబీఐ సిబ్బందే వెనక్కు తిరిగివచ్చారు. త్వరలోనే ప్రశ్నలన్నింటికీ జవాబు వస్తుంది.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

'ఐదేళ్లలో దోపిడీ'

ప్రభుత్వ ఆదాయం ఐదేళ్లలో దోపిడీ జరిగిందని.. ఇసుక, మద్యం వంటివి రూ.లక్షల కోట్ల మేర దోపిడీ జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైందని.. 2019 నుంచి రాష్ట్ర వృద్ధి రేటు పడిపోయిందని అన్నారు. రాష్ట్రంలో రోడ్లను బాగు చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం నుంచి అసెంబ్లీలో 3 శ్వేతపత్రాలు ప్రవేశపెడతామని చెప్పారు. 'రాజధాని నిర్మాణం పూర్తైతే దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల ప్రజా సంపద వచ్చి ఉండేది. ఈ రోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. 2020 - 21 నాటికి పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారు. టీడీపీ హయాంలో ప్రాజెక్ట్ 72 శాతం పూర్తైంది. కాంట్రాక్టర్లు, అధికారులను మార్చడం, రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం చేశారు. పోలవరాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోలవరంపై బడ్జెట్‌లో నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు' అని చంద్రబాబు పేర్కొన్నారు.

'రాజధాని కలను చంపేశారు'

వైసీపీ ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసిందని.. ఏపీ ప్రజల రాజధాని కలను చంపేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమరావతికి బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయించడంతో.. అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయనే ఆశ అందరిలోనూ కనిపిస్తుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని.. అందుకే 2 నెలల టైం తీసుకుని బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనకు వచ్చినట్లు చంద్రబాబు చెప్పారు.

Also Read: AP Assembly Sessions: ఆ 2 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం - ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ
నేడు తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ
YSRCP Mavigun Vs Amaravati 2026: వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Alluri Crime News: 8 ఏళ్ల చిన్నారిపై పాస్టర్ అమానుషం.. వేడి అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్ లో రికార్డ్
8 ఏళ్ల బాలికపై పాస్టర్ అమానుషం.. అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్లో రికార్డ్- అల్లూరి జిల్లాలో ఘటన

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Musi River Cleaning Execution Deadline: మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
Raksha Gowda: గుప్పెడంత మనసు సీరియల్ వసుధార.. రక్షా గౌడ రియల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
గుప్పెడంత మనసు సీరియల్ వసుధార.. రక్షా గౌడ రియల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Alluri Crime News: 8 ఏళ్ల చిన్నారిపై పాస్టర్ అమానుషం.. వేడి అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్ లో రికార్డ్
8 ఏళ్ల బాలికపై పాస్టర్ అమానుషం.. అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్లో రికార్డ్- అల్లూరి జిల్లాలో ఘటన
Pawan Kalyan Health Condition: పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
World Cup Black Magic: ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సమయంలో ఒక ఆటగాడిపై క్షుద్రశక్తులు ప్రయోగించారా? ఇందులో వాస్తవం ఏంటి?
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సమయంలో ఒక ఆటగాడిపై క్షుద్రశక్తులు ప్రయోగించారా? ఇందులో వాస్తవం ఏంటి?
Embed widget