అన్వేషించండి

AP Assembly Sessions: ఆ 2 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం - ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Andhrapradesh News: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆరోగ్య వర్శిటీ పేరు మార్పు బిల్లులకు ఏపీ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు.

AP Assembly Approves Two Bills: ఏపీ అసెంబ్లీలో (AP Assembly) మంగళవారం పలు కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ - 2022 (భూ యాజమాన్య హక్కు చట్టం), ఆరోగ్య వర్శిటీ పేరు మార్పు బిల్లులకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో విజయవాడలోని (Vijayawada) ఆరోగ్య వర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుర్ధరించారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) సభలో కీలక ప్రకటన చేశారు. అయితే, ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ సభలో ప్రకటించారు. పూర్తిగా తెలుగులోనే సభాపతి ప్రకటన చేయడంపై సభ్యులు అభినందనలు తెలిపారు.

స్పీకర్ ప్రశ్నోత్తరాలు

అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన 'నాడు - నేడు' పనుల్లో భారీగా అవినీతి జరిగిందని.. టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రవణ్ కుమార్, ఏలూరి సాంబశివరావు సభలో ప్రస్తావించారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. మంత్రి నారా లోకేశ్ స్పందించారు. 'నాడు - నేడు'పై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు. అలాగే, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తామని.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు స్కూళ్లను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. 'గతంలో నాసిరకం పనులు ఎందుకు చేపట్టారు.? పనులు ఎందుకు సరిగ్గా జరగలేదు.?' ఆరా తీస్తామని అన్నారు.

తొలి ఏడాదిలో 'కేజీ టు పీజీ' వ్యవస్థ ప్రక్షాళన చేపడతామని మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య పెంచుతామని.. అందుకే మెగా డీఎస్సీ వేశామని చెప్పారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని.. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఓ పద్ధతి ప్రకారం అన్నీ చేస్తామని స్పష్టం చేశారు. 

గ్రూప్ - 1 పరీక్షపై

గ్రూప్ - 1 ఉద్యోగాల నియామక పరీక్షపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అసెంబ్లీలో ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని.. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. సభ్యుల సూచన మేరకు సీబీఐ విచారణను పరిశీలిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. గతంలో గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగింది నిజమేనని.. దీనిపై కోర్టులో విచారణ జరుగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వం కూడా విచారణ కమిటీ వేసిందని.. ఆగస్ట్ 31లోగా నివేదిక వస్తుందని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా సభ్యులు కోరిన విధంగా సీబీఐ విచారణపై పరిశీలిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Also Read: Amaravathi : ఆంధ్రప్రదేశ్ రాజధానికి గోల్డెన్ డేస్ - ఇక పరుగులు పెట్టనున్న అమరావతి నిర్మాణం !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget