అన్వేషించండి

Manickam Tagore : జగన్ పార్టీకి మిగిలేది ముగ్గురు ఎంపీలే - ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ జోస్యం - ఏం జరుగుతోంది ?

AP Congress : జగన్ పార్టీకి ముగ్గురు ఎంపీలే మిగులుతారని ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఠాగూర్ జోస్యం చెప్పారు. ఇంతకు మించిన వివరాలేమీ చెప్పకపోవడంతో ఇన్ సైడ్ న్యూస్ ఏదో ఆయనకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నారు.

Only Three MPs For Jagan Party :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు  రోజు రోజులుకు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఊపు పెంచకుంటూ పోతోంది. నిన్నా మొన్నటిదాకా అసలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్నది  కూడా ఎవరూ పట్టించుకోలేదు. అభ్యర్థుల్ని నిలబెట్టినా నిలబెట్టకపోయినా పెద్దగా తేడా ఉండదని ఊరుకున్నారు. కానీ ఎప్పుడైతే  షర్మిల ఏపీసీసీ  చీఫ్ గా నియమితులయ్యారో అప్పటి నుంచి ఆ పార్టీ నేతలు చేసే ప్రతి కామెంట్ హైలెట్ అవుతోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్  గా మాణిగం ఠాగూర్ వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన తెలంగాణలో పని చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెప్పించేందుకు ఆయనను ఏపీకి నియమించారు. షర్మిల దూకుడుగా ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్వహిస్తన్న కార్యక్రమాల్లో మాణిగం ఠాగూర్ కీలకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. 

వైసీపీకి ముగ్గురే ఎంపీలు మిగులుతారా ? 

మాణిగం ఠాగూర్ తాజాగా సోషల్ మీడియాలో ఓ కీలక ప్రకటన చేశారు.  జగన్ పార్టీకి కేవలం ముగ్గురంటే ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు. మాణిగం ఠాగూర్ ప్రకటన సోషల్ మీడియాలో ఒక్క సారిగా వైరల్ అయింది. ప్రస్తుతం ఉన్న ఎంపీలందరూ పార్టీకి గుడ్ బై చెబితే.. చివరికి ముగ్గురు ఎంపీలు మిగులుతారా లేకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ కేవలం మూడు సీట్లు గెలుచుకుంటుందా అన్నదానిపై క్లారిటీ లేదు. ఇతర వివరాలపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. టిక్కెట్ల కసరత్తులో భాగంగా  జగన్ మోహన్ రెడ్డి ఎంపీల విషయంలో కీలక నిర్మయాలు తీసుకుంటున్నారు. అతి కొద్ది మంది మాత్రమే మళ్లీ టిక్కెట్ కేటాయిస్తున్నారు.     

ఎంపీలందర్నీ మార్చేస్తున్న సీఎం జగన్          

ఇప్పటికే కర్నూలు, మచిలీపట్నం, నర్సరావుపేట ఎంపీలు రాజీనామా  చేశారు. విజయనగరం, అరకు, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు ఇలా అనేక  నియోజకవర్గాల ఎంపీ టిక్కెట్లను మార్చేశారు ఇప్పటి వరకూ ఎంపీ టిక్కెట్లు ఫలానా వారికి ఖాయం అని వైసీపీ నుంచి ప్రకటన రాలేదు. కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డిలకు మాత్రమే ఖాయమని ఇంకెవరికీ ఎన్నికల వరకూ గ్యారంటీ ఉండదని చెబుతున్నారు. ఈ లెక్కలేసుకుని మాణిగం ఠాగూర్ కామెంట్లు చేశారా లేకపోతే.. ఇప్పుడు ఉన్న 22 మంది ఎంపీల్లో 19 మంది పార్ట ఫిరాయిస్తున్నారని చెబుతున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. ఎప్పుడో ఓ ఎంపీ దూరమయ్యారు.                  

వచ్చే ఎన్నికల్లో వచ్చే సీట్ల గురించి చెప్పారా ? 

అయితే మాణిగం ఠాగూర్  వచ్చే ఎన్నికల్లో వచ్చే సీట్ల గురించి  పెట్టారని కొంత మంది విశ్లేషిస్తున్నారు. లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం అందుకే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని.. కుప్పకూలిపోతున్న వైసీపీ కోట అన్న పద్దతిలో చెప్పారని అంటున్నారు.  మాణిగం ఠాగూర్ మాత్రం ఈ ఊహాగానాలను అలా వదిలేశారు. ఆయన ఏ  సోర్స్ తో ఈ ప్రకటన చేశారన్నది మాత్రం చెప్పడం లేదు.                     

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget