అన్వేషించండి

Manickam Tagore : జగన్ పార్టీకి మిగిలేది ముగ్గురు ఎంపీలే - ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ జోస్యం - ఏం జరుగుతోంది ?

AP Congress : జగన్ పార్టీకి ముగ్గురు ఎంపీలే మిగులుతారని ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఠాగూర్ జోస్యం చెప్పారు. ఇంతకు మించిన వివరాలేమీ చెప్పకపోవడంతో ఇన్ సైడ్ న్యూస్ ఏదో ఆయనకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నారు.

Only Three MPs For Jagan Party :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు  రోజు రోజులుకు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఊపు పెంచకుంటూ పోతోంది. నిన్నా మొన్నటిదాకా అసలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్నది  కూడా ఎవరూ పట్టించుకోలేదు. అభ్యర్థుల్ని నిలబెట్టినా నిలబెట్టకపోయినా పెద్దగా తేడా ఉండదని ఊరుకున్నారు. కానీ ఎప్పుడైతే  షర్మిల ఏపీసీసీ  చీఫ్ గా నియమితులయ్యారో అప్పటి నుంచి ఆ పార్టీ నేతలు చేసే ప్రతి కామెంట్ హైలెట్ అవుతోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్  గా మాణిగం ఠాగూర్ వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన తెలంగాణలో పని చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెప్పించేందుకు ఆయనను ఏపీకి నియమించారు. షర్మిల దూకుడుగా ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్వహిస్తన్న కార్యక్రమాల్లో మాణిగం ఠాగూర్ కీలకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. 

వైసీపీకి ముగ్గురే ఎంపీలు మిగులుతారా ? 

మాణిగం ఠాగూర్ తాజాగా సోషల్ మీడియాలో ఓ కీలక ప్రకటన చేశారు.  జగన్ పార్టీకి కేవలం ముగ్గురంటే ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు. మాణిగం ఠాగూర్ ప్రకటన సోషల్ మీడియాలో ఒక్క సారిగా వైరల్ అయింది. ప్రస్తుతం ఉన్న ఎంపీలందరూ పార్టీకి గుడ్ బై చెబితే.. చివరికి ముగ్గురు ఎంపీలు మిగులుతారా లేకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ కేవలం మూడు సీట్లు గెలుచుకుంటుందా అన్నదానిపై క్లారిటీ లేదు. ఇతర వివరాలపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. టిక్కెట్ల కసరత్తులో భాగంగా  జగన్ మోహన్ రెడ్డి ఎంపీల విషయంలో కీలక నిర్మయాలు తీసుకుంటున్నారు. అతి కొద్ది మంది మాత్రమే మళ్లీ టిక్కెట్ కేటాయిస్తున్నారు.     

ఎంపీలందర్నీ మార్చేస్తున్న సీఎం జగన్          

ఇప్పటికే కర్నూలు, మచిలీపట్నం, నర్సరావుపేట ఎంపీలు రాజీనామా  చేశారు. విజయనగరం, అరకు, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు ఇలా అనేక  నియోజకవర్గాల ఎంపీ టిక్కెట్లను మార్చేశారు ఇప్పటి వరకూ ఎంపీ టిక్కెట్లు ఫలానా వారికి ఖాయం అని వైసీపీ నుంచి ప్రకటన రాలేదు. కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డిలకు మాత్రమే ఖాయమని ఇంకెవరికీ ఎన్నికల వరకూ గ్యారంటీ ఉండదని చెబుతున్నారు. ఈ లెక్కలేసుకుని మాణిగం ఠాగూర్ కామెంట్లు చేశారా లేకపోతే.. ఇప్పుడు ఉన్న 22 మంది ఎంపీల్లో 19 మంది పార్ట ఫిరాయిస్తున్నారని చెబుతున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. ఎప్పుడో ఓ ఎంపీ దూరమయ్యారు.                  

వచ్చే ఎన్నికల్లో వచ్చే సీట్ల గురించి చెప్పారా ? 

అయితే మాణిగం ఠాగూర్  వచ్చే ఎన్నికల్లో వచ్చే సీట్ల గురించి  పెట్టారని కొంత మంది విశ్లేషిస్తున్నారు. లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం అందుకే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని.. కుప్పకూలిపోతున్న వైసీపీ కోట అన్న పద్దతిలో చెప్పారని అంటున్నారు.  మాణిగం ఠాగూర్ మాత్రం ఈ ఊహాగానాలను అలా వదిలేశారు. ఆయన ఏ  సోర్స్ తో ఈ ప్రకటన చేశారన్నది మాత్రం చెప్పడం లేదు.                     

టాప్ హెడ్ లైన్స్

ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!
ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Embed widget