అన్వేషించండి

YS Jagan With MLC Candidates: నో డౌట్ - ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన, పక్కా వైసీపీ ఎన్నికల వ్యూహం!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహానికి తెర తీసింది. ఎమ్మెల్సీ కోటాలో పదవుల పంపకాల్లో పక్కాగా సామాజిక వర్గాల సమీకరణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

ఎన్నికల వ్యూహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర తీసింది. ఎమ్మెల్సీ కోటాలో పదవుల పంపకాల్లో పక్కాగా సామాజిక వర్గాల సమీకరణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. టార్గెట్ 175 లో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యూహత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఎమ్మెల్సీల పదవుల సందడి....
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ చెందిన ఆశావహులకు ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తూ, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి నష్టపోయిన విధేయులకు జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. అంతే కాదు సామాజిక వర్గాల వారీగా కీలకమయిన అంశం కావటంతో, జగన్ ఆచి తూచి వ్యవహరించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మోజార్టీ స్థానాలను బీసీ వర్గాలకు కేటాయించారు. ఇప్పటి వరకు సామాజిక కోణంలో పెద్దల సభలో అడుగుపెట్టని కులాలకు సైతం జగన్ అకాశం ఇచ్చారు. దీంతో ఆయా వర్గాలను పూర్తిగా ఆకట్టుకునేందుకు వీలవుతుందని పార్టీ భావిస్తోంది. టార్గెట్ 175 స్థానాల పైనే గంపెడు ఆశలు పెట్టుకున్న జగన్, ఇక రాబోయే రోజులను పూర్తిగా ఎన్నికల కోణంలో నే చూడాలని భావిస్తోందిని, అందులో భాగంగానే ఏడాది ముందుగానే పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్రంగా చేసుకుందనే ప్రచారం జరుగుతోంది.
2024 ఎన్నికలే టార్గెట్....
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పార్టీ పరంగా ప్రత్యేక గృహ సారథులను రంగంలోకి దింపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్ని వర్గాలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ కీలకమయిన సామాజిక వర్గాలకు పెద్ద పీఠ వేసింది. అందులో భాగంగానే గతంలో ఎన్నడూ ప్రాదాన్యత దక్కని కులాలను వెతికి మరీ ఆయా ఎమ్మెల్సీ స్థానాలను ఆ వర్గాలకు కేటాయించారు సీఎం జగన్.
ఎమ్మెల్సీ అభ్యర్థులతో సీఎం జగన్ సమావేశం....
ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తరవాత సీఎం జగన్ వారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విదంగా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్దులను ఎంపిక చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పార్టీలో మెదటినుండి పని చేస్తున్న వారికి, కులాల వారీగా వారి శ్రమకు గుర్తింపు ఇస్తూ కీలకమయిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 18మందిలో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే ఓసీలకు ఇచ్చామని, అధికంగా 14 స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారికి ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు జగన్. 
గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి సాహసం చేయలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటుగా ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని, అదే విధంగా సామాజిక వర్గాల కోణంలోనూ రాజకీయంగా అణచివేతకు గురయిన కులాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆయా సామాజిక వర్గాలకు మరింత ప్రాధాన్యం ఇస్తామన్నారు. బీసీ వర్గాలంటే కేవలం బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదని, బ్యాక్ బోన్ క్లాస్ గా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఆయా వర్గాలకు తెలియచేశామని చెప్పారు. రానున్న రోజులు ఆయా వర్గాలు అన్నీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పూర్తిగా సహకరించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: విజయవాడలో కాల్ మనీ రాకెట్– ఎంపీ కేశినేని చిన్ని, ముల్పూరి కిశోర్‌లపై సీఎంకు కేశినేని నాని లేఖ
విజయవాడలో కాల్ మనీ రాకెట్– ఎంపీ కేశినేని చిన్ని, ముల్పూరి కిశోర్‌లపై సీఎంకు కేశినేని నాని లేఖ
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Embed widget