అన్వేషించండి

AP Schools Reopen: ఏపీలో బడి గంట మోగింది... కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తెరుచుకున్న విద్యా సంస్థలు

ఏపీలో పాఠశాలలు తెరుచుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ విద్యా సంస్థలు అన్ని సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు పునః ప్రారంభం అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో బడిగంట మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలు తెరవచ్చని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.  విద్యాసంస్థల్లో ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మించకూడదు. తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే విద్యార్థులు తరగతులకు హాజరుకావాలి.

రోజు విడిచి రోజు తరగతులు

విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. విద్యాసంస్థల లోపల, బయట పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చేయాలి. ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతిరోజూ పాఠశాలలకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశించింది. తరగతుల్లో పిల్లల సంఖ్య అధికంగా ఉంటే రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. 

Also Read: APSWREIS Recruitment 2021: రెండ్రోజుల్లో ముగియనున్న గడువు.. ఈ పోస్టులకు అప్లయ్ చేశారా?

ఆ విద్యార్థులకు ఐసోలేషన్ గది

పాఠశాలల్లోకి ప్రవేశించే ముందు విద్యా్ర్థులకు థర్మల్‌ స్కానింగ్‌ చేస్తారు. విద్యార్థులలో ఎవరికైనా జలుబు, జ్వరం, కొవిడ్ లక్షణాలు ఉంటే... వారిని ఇళ్లకు తిరిగి పంపి కరోనా నిర్థారణ పరీక్షలు చేయించనున్నారు. కోవిడ్‌ లక్షణాలున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించనున్నారు. ఇళ్లలో కొవిడ్ బాధితులు, వృద్ధులు, రోగులు ఉన్న విద్యార్థులు పాఠశాలలకు రాకుండా ఇంటి వద్దనే ఉండాలని విద్యాశాఖ సూచించింది. అనారోగ్యంతో ఉండే విద్యార్థులు స్కూళ్లకు రాకుండా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి ప్రతి వారం కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించాలని సూచించింది. వారిలో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ ఉంటే మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు చేయించాలని అన్ని స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు పంపింది.

Also Read: BSF Recruitment 2021: మీరు టెన్త్ పూర్తి చేసి ఉంటే రూ.69,100 జీతం వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయండిలా

కోవిడ్ జాగ్రత్తలపై ఓ పీరియడ్

తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఏర్పాట్లు చేయించాలని విద్యాశాఖ సూచించింది. మధ్యాహ్న భోజనం సమయంలోనూ అందరికీ ఒకేసారి కాకుండా విడివిడిగా భోజన ఏర్పాట్లు చేయాలని తెలిపింది. స్కూలు నుంచి విద్యార్థులు వెళ్లే సమయంలోనూ అందర్నీ ఒకేసారి కాకుండా 10 నిమిషాల వ్యవధిలో బయటకు పంపమని సూచించింది. స్కూలుకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు భౌతిక దూరం ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు తెలిపింది. స్కూలులో కోవిడ్‌ నిబంధనలపై ఒక పీరియడ్ తీసుకోవాలని చెప్పింది. విద్యార్థులు గుంపులుగా లేకుండా చూసుకోవాలని తెలిపింది. స్కూలు అసెంబ్లీ, గేమ్స్ వంటివి పూర్తిగా రద్దు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.    

 

Also Read: AP Schools: ఆ పిల్లల చదువులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... అదే స్కూళ్లల్లోనే కొనసాగించాలని ఆదేశాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Team India Highest Score: టీ20లో భారత్ అత్యధిక స్కోరు.. శ్రీలంక బౌలర్లను బాదేసిన స్మృతి, షఫాలీ, రిచా ఘోష్
టీ20లో భారత్ అత్యధిక స్కోరు.. శ్రీలంక బౌలర్లను బాదేసిన స్మృతి, షఫాలీ, రిచా ఘోష్
Actor Vijay Quits Cinema: నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Team India Highest Score: టీ20లో భారత్ అత్యధిక స్కోరు.. శ్రీలంక బౌలర్లను బాదేసిన స్మృతి, షఫాలీ, రిచా ఘోష్
టీ20లో భారత్ అత్యధిక స్కోరు.. శ్రీలంక బౌలర్లను బాదేసిన స్మృతి, షఫాలీ, రిచా ఘోష్
Actor Vijay Quits Cinema: నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
Kaleshwaram Project: మేడిగడ్డ కుంగుబాటుపై ఎల్‌ అండ్‌ టీకి తుది నోటీసులు.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం!
మేడిగడ్డ కుంగుబాటుపై ఎల్‌ అండ్‌ టీకి తుది నోటీసులు.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం!
మూడవ ప్రపంచ యుద్ధం నుంచి AI విపత్తు వరకు 2026లో ఏం జరుగుతోందో తెలుసా?
మూడవ ప్రపంచ యుద్ధం నుంచి AI విపత్తు వరకు 2026లో ఏం జరుగుతోందో తెలుసా?
Champion Box Office Collection Day 3 : మూడు రోజుల్లో కలెక్షన్స్ 'ఛాంపియన్' - పది కోట్లకు చేరువలో రోషన్ స్పోర్ట్స్ డ్రామా
మూడు రోజుల్లో కలెక్షన్స్ 'ఛాంపియన్' - పది కోట్లకు చేరువలో రోషన్ స్పోర్ట్స్ డ్రామా
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Embed widget