అన్వేషించండి

Raitukosam Telugu desam: రైతు కోసం తెలుగుదేశం పేరిట టీడీపీ ఆందోళనలు... నేటి నుంచి ఐదు రోజుల పాటు నిరసనలు... రైతుల సమస్యలపై పోరాడనున్నట్లు ప్రకటన

రైతుల సమస్యలపై టీడీపీ పోరుబాట పట్టింది. ఇవాళ్టి నుంచి 5 రోజులపాటు ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనలు చేపట్టనుంది.

రైతుల సమస్యలపై టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనలు చేపట్టనుంది. ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు రైతు కోసం తెలుగుదేశం పేరిట నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ స్థానాలను 5 జోన్లుగా విభజించి రోజుకో జోన్‌ పరిధిలో నిరసనలు తెలపాలని నిర్ణయించింది. 5 పార్లమెంట్ స్థానాల పరిధిలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గోనున్నారు. ఇవాళ రాయలసీమ పరిధిలోని నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఆందోళన చేపట్టనున్నారు. 

ఐదు జోన్లలలో

రేపు(15వ తేదీ) కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో, 16న ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో నిరసనలు చేపట్టనున్నారు. 17వ తేదీన అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలో, 18న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ స్థానాల పరిధిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనునన్నట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది. 

Also Read: TDP Fight : టీడీపీ వర్సెస్ టీడీపీ ! నేతల మధ్య ఆధిపత్య పోరాటమే ప్రతిపక్షానికి అసలు సమస్యా..!?

తహసీల్దార్లకు వినతి పత్రాలు

టీడీపీ సీనియర్‌ నేతలు అయ్యన్నపాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, జ్యోతుల నెహ్రూ, బి.సి.జనార్దన్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులుకు జోన్ల బాధ్యతలు అప్పగించారు. నిరసనన అనంతరం తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించనున్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే చేపట్టినట్లు రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వైసీపీ ప్రభుత్వ వైఖరితో ఏపీలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని టీడీపీ ఆరోపిస్తుంది.

Also Read: EAPCET Results 2021: నేడు ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ విభాగాల ఫలితాలు.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే​

నారా లోకేశ్ పాల్గొనే అవకాశం

వర్షాలు బాగా కురిసినా సాగునీరు అందకపోవడం, పంట కాలువలు, డ్రెయిన్లలో పూడిక తొలగించకపోవడం, వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్ల బిగింపు, విత్తనాలు, ఎరువులపై రాయితీలు నిలిచిపోవడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంది. బీమా, పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఇలాంటి సమస్యలపై పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. రైతులకు రుణమాఫీ రద్దు, రైతురథం ద్వారా ట్రాక్టర్లు అందించే పథకాన్ని నిలిపివేయడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ నెల 17న ఉత్తరాంధ్రలో జరిగే నిరసన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొనే అవకాశం ఉంది.

Also Read: Dalitha Bandhu News: మూడు వారాల్లోనే దళిత బంధు నిధులు.. ముగిసిన సీఎం రివ్యూ, హాజరైన భట్టి విక్రమార్క

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
Pawan Kalyan Kotappakonda Visit: కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
J and K Accident: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
Embed widget