అన్వేషించండి

Cm Jagan: పాక్షికంగా ఇళ్లు ధ్వంసమైనా పరిహారం... వారికి రూ. 25 లక్షల సాయం.. వరద సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష

వరద సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్షించారు. పూర్తిగా ఇళ్లు ధ్వంసమైన వారికి రూ. 95 వేలు అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 25 లక్షల సాయం అందించాలన్నారు.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు జిల్లాలు తీవ్రనష్టం వాటిల్లింది. వరద సహాయక చర్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం అసెంబ్లీ ఛాంబర్‌లో కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. వరద బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారు. మానవతా దృక్పథంతో సాయం అందించాలన్నారు. బాధితుల కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ పొటాటో, రూ.2వేలు సాయం తక్షణమే అందించాలన్నారు. గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకున్నారు. వరద సాయం అందించేందుకు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2 వేలు ఇవ్వాలన్నారు. 

Also Read: తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !

104 కాల్ సెంటర్ ద్వారా సమస్యలు పరిష్కరించండి

వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ, రక్షిత తాగునీరు అందించడం యుద్ధ ప్రాతిపదికన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 104 కాల్‌సెంటర్‌ పై విస్తృత ప్రచారం చేసి వరదలకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా పరిష్కరించాలన్నారు. ఈ నంబర్ కు ఫోన్ చేసిన వాళ్ల సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల నిర్వహణపై దృష్టిపెట్టాలన్న సీఎం.. అవసరమున్న చోట డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. రోడ్లను పునరుద్ధరించడంపై దృష్టిపెట్టాలన్న సీఎం.. రవాణా సాగేలా తాత్కాలిక పనులు వెంటనే చేయాలని సూచించారు. వచ్చే నాలుగు వారాల్లో టెండర్లను ఖరారుచేసి పనులు మొదలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Also Read: సాగు చట్టాల విషయంలో కేంద్రంలాగే ఏపీ ప్రభుత్వం కూడా మనసు మార్చుకుందా ? కొత్త మార్గంలో 3 రాజధానులు తెస్తారా ?

ఇళ్లు ధ్వంసమైన వారి రూ.95 వేలు

ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా వారికి వెంటనే సాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పూర్తిగా ఇళ్లు ధ్వంసమైన వారికి రూ. 95,100 సాయం అందించాలని, ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరు చేయాలన్నారు. పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ.5200 నగదు వెంటనే అందించేలని సూచించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికే 90శాతం మేర నష్టపరిహారం అందించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వరదల్లో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు. నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి, ఆర్టీసీ కండక్టర్‌ కుటుంబానికి తోడుగా ఉండాలన్నారు. వారికి రూ.25 లక్షల పరిహారం అందించాలన్నారు. విపత్తు సహాయ కార్యక్రమాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. పంటల నష్టం అంచనా వేయాలని అధికారులను కోరారు. విత్తనాలు 80శాతం సబ్సిడీపై సరఫరా చేయాలన్నారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.10 కోట్లు చొప్పున మొత్తంగా రూ.40 కోట్లు అందించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.  

Also Read: ఓ అడుగు వెనక్కి వేసి.. మరో అవకాశం సృష్టించుకున్న జగన్ ! బిల్లుల ఉపసంహరణ వెనుక పక్కా రాజకీయ వ్యూహం !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Embed widget