అన్వేషించండి

Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!

Manchu Manoj And Mounika: మంచు మనోజ్‌ దంపతులు రాజకీయాల్లోకి రానున్నారని తెలుస్తోంది. శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల వేళ ఈ విషయంపై కీలక ప్రకటన చేయనున్నారు.

Manchu Manoj Political News: మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మొదలైన వివాదం ఇప్పుడు మరో టర్న్ తీసుకోనుంది. తన ఫ్యామిలీకి లైఫ్ థ్రెట్‌ ఉందని ఆరోపిస్తూ వస్తున్న మంచు మనోజ్‌ రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. భార్య మౌనికతో కలిసి ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఇవాళ శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల సందర్భంగా ఈ ప్రకటన వస్తుందని అంటున్నారు. 

మంచు ఫ్యామిలీలో వివాదంలో మలుపులు

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు. తర్వాత ఆ పార్టీ విజయం కోసం ప్రచారం కూడా  చేశారు. తర్వాత కొన్ని రోజులకే ఆ పార్టీ నుంచి దూరంగా జరిగారు. 2024 ఎన్నికల్లో తటస్థంగా ఉండిపోయారు. ఆ ఫ్యామిలీలో విభేదాలు రావడంతో తలో చోట ఉంటున్నారు. మొన్న ఈ వివాదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో వివాదం కేసులు, కోర్టులు, మీడియాకు చేరింది. 

మరోసారి ఫ్యామిలీపై మనోజ్ ఆరోపణలు 

వివాదం కొలిక్కి వచ్చిందని అనుకుంటున్న టైంలో ఆదివారంలో మంచు మనోజ్ మరో బాంబు పేల్చారు. తన ఇంటికి వచ్చిన మంచు విష్ణు తన ఫ్యామిలీకి హాని తలపెట్టేందుకు యత్నించారని ఆరోపించారు. తన ఇంటికి విద్యుత్ సరఫరా చేసే జనరేటర్‌లో పంచదార వేశారని చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటి హాని జరగకపోయినా కుటుంబానికి ప్రాణ హాని మాత్రం ఉందని ఆరోపించారు. సోమవారం పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేస్తానని చెప్పిన మనోజ్‌ ఇవాళ నంద్యాల బయల్దేరి వెళ్లారు. 

Also Read: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు

రాజకీయాల్లోకి మనోజ్ దంపతులు వచ్చే అవకాశం

శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొని తన రాజకీయ అరంగేట్రం విషయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మౌనిక తరఫు బంధువులు రాజకీయాల్లో ఉన్నారు. ఆమె అక్క అఖిల ప్రియ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా చేశారు. వాళ‌్ల పేరెంట్స్ కూడా టీడీపీ, వైసీపీ, ప్రజారాజ్యం పార్టీల్లో పని చేశారు. 2014 ఎన్నికల టైంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మృతి చెందారు. ఆమె వారసురాలిగా అఖిల ప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. 12 మార్చి 2017న భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన అన్న  కుమారుడు బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు జగత్ విఖ్యాత్‌ రెడ్డి ఇప్పుడిప్పుడే ప్రజల్లో తిరుగుతున్నారు.  

 వారి స్ఫూర్తితోనే మంచు మనోజ్, మౌనిక దంపతులు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో నంద్యాల వెళ్లిన మంచు మనోజ్, మౌనిక దంపతులు రాజకీయాల్లోకి ప్రవేశించే విషయాన్ని ప్రకటించనున్నారు. అక్క, తమ్ముడు, మామయ్య  టీడీపీలో వీళ్లు మాత్రం జనసేనలోకి వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీలో ఉన్న ఈ కుటుంబంలో విభేదాలు చాలానే ఉన్నాయి. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా జనసేనను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. 

Also Read: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget