అన్వేషించండి

What Is Jagan Plan : సాగు చట్టాల విషయంలో కేంద్రంలాగే ఏపీ ప్రభుత్వం కూడా మనసు మార్చుకుందా ? కొత్త మార్గంలో 3 రాజధానులు తెస్తారా ?

బిల్లులు వెనక్కి తీసుకున్నప్పటికీ మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని ఎక్కువ మంది భావించడం లేదు. కొత్త మార్గంలో రాజధానిని తరలిస్తారని అంటున్నారు.

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ బిల్లులను వెనక్కి తీసుకుంటూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అయితే ఎక్కువ మంది ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో వెనక్కి  తగ్గుతుందని అనుకోవడం లేదు. ఈ విషయంలో మంత్రి కొడాలి నాని  కూడా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులు వెనక్కి తీసుకున్నామని... ఈ విషయంలో అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారని అన్నారు. అదే సమయలో మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి వెనక్కి తగ్గరని ఆయన సంకేతం కూడా ఇచ్చారు. ఏం జరుగుతుందో.. అసెంబ్లీలో  చూడాలని అన్నారు.

 

Also Read: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం ! కొత్త వ్యూహం ఏమిటి ?

మూడు రాజధానుల అంశానికి టెక్నికల్‌గా చాలా సమస్యలు ఉన్నాయని.. అందుకే న్యాయస్థానాల్లో నిలువలేకపోతున్నాయని ఆయన అన్నారు. అంటే.. టెక్నికల్‌గా సమస్యలు లేకుండా చేసుకుంటూ మరోసారి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తారన్న భావన ఎక్కువ మందికి వస్తోంది. అది ఎలా ముందుకు తెస్తారన్నది ఇప్పుడు రాజకీయవర్గాలకు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాజధానిగా అమరావతిని మార్చాలంటే ఎన్నో న్యాయపరమైన చిక్కులతో ఉంది. ఎందుకంటే రైతులు దాదాపుగా 30వేల ఎకరాలను రాజధాని కోసం సీఆర్డీఏకి ఇచ్చారు. రైతులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందాల ప్రకారం ... ఖచ్చితంగా రాజధానిని అభివృద్ధి చేయాలి. వారి ప్లాట్లను వారికి అప్పగించాలి.

 

Also Read : తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !

అలా కాకుండా ఏం చేసినా చట్ట విరుద్దమే అవుతుంది. అదే సమయంలో అమరావతిని రాజధానిగా అంగీకరించే విషయంలో ప్రభుత్వ పెద్దలు ఏ మాత్రం అంగీకరించే అవకాశం లేదు. అలా చేయడం  తమకు రాజకీయంగా కూడా నష్టం చేస్తుందని వారి అంచనా. అందుకే ఖచ్చితంగా ప్రభుత్వం వేరే వ్యూహంతో ఉందని.. అదేమిటో ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేయబోయే ప్రకటనతోనే తేలిపోతుందంటున్నారు. ఇప్పుడు శాసనమండలిలో కూడా పూర్తి స్థాయిలో బలం ఉన్నందున కొత్త రూపంలో బిల్లులు ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకుంటారని భావిస్తున్నారు.

Koo App
జడ్పిటిసి మందా జక్రికి అభినందనల వెల్లువ జి.కొండూరు మండల జడ్పిటిసి సభ్యులు మందా జక్రధరరావు (జక్రి)కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో జడ్పిటిసిగా విజయం సాధించారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, నందిగామ నియోజకవర్గానికి చెందిన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు. - Nagaraju pajjuru (@Nagaraju_pajjuru) 21 Nov 2021

 

Also Read : అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !

లేదా ప్రస్తుతం సెలక్ట్ కమిటీలో ఉన్న బిల్లల ప్రక్రియనే కొనసాగించి.., సెలక్ట్ కమిటీ నివేదిక కూడా ఇప్పించి చట్ట బద్దంగా నిర్ణయం తీసుకున్నామనిపించేలా చేయవచ్చని కొంత మంది భావిస్తున్నారు.త అలా చేసినా చట్టం ప్రకారం చెల్లదన్న భావన కొంత మందిలో ఉంది.  ఎలా చూసినా కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గదన్న అభిప్రాయంతో ఎక్కువ మంది ఉన్నారు.  

Also Read : శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ ! ఇక "రద్దు తీర్మానాన్ని" ఉపసంహరించుకుంటారా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
BRS Meeting In Warangal: వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
పైరవీ చేస్తే సీరియస్ యాక్షన్- పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పవన్ వార్నింగ్
పైరవీ చేస్తే సీరియస్ యాక్షన్- పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పవన్ వార్నింగ్
Encounter in Karregutta: తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs RR Match preview IPL 2025 | నేడు బెంగుళూరులో రాజస్థాన్ రాయల్స్ తో RCB ఫైట్ | ABP DesamRohit Sharma 70 Runs vs SRH IPL 2025 | సరైన సమయంలో బీభత్సమైన ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ | ABP DesamMumbai Indians top 3 Position IPL 2025 | అనూహ్య రీతిలో పాయింట్స్ టేబుల్ లో దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్ | ABP DesamIshan Kishan Match Fixing Trending IPL 2025 | తీవ్ర వివాదమవుతున్న ఇషాన్ కిషన్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
BRS Meeting In Warangal: వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
పైరవీ చేస్తే సీరియస్ యాక్షన్- పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పవన్ వార్నింగ్
పైరవీ చేస్తే సీరియస్ యాక్షన్- పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పవన్ వార్నింగ్
Encounter in Karregutta: తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
Prabhas Fauji Actress: మాది పాకిస్తాన్ కాదు, ఆ ఆర్మీతో సంబంధం లేదు... క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి
మాది పాకిస్తాన్ కాదు, ఆ ఆర్మీతో సంబంధం లేదు... క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి
Abir Gulaal Movie: పహల్గాం ఉగ్ర దాడి - బాలీవుడ్ మూవీ 'అబీర్ గులాల్' బ్యాన్
పహల్గాం ఉగ్ర దాడి - బాలీవుడ్ మూవీ 'అబీర్ గులాల్' బ్యాన్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
Masooda OTT Streaming: రెండేళ్ల తర్వాత రీజనల్ నుంచి ఇంటర్నేషనల్ ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 'మసూద' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
రెండేళ్ల తర్వాత రీజనల్ నుంచి ఇంటర్నేషనల్ ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 'మసూద' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Embed widget