అన్వేషించండి

Three Capitals : మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం ! కొత్త వ్యూహం ఏమిటి ?

ఏపీ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకున్నట్లుగా హైకోర్టుకు తెలిపింది.  మూడు రాజధానుల బిల్లులు,  సీఆర్డీఏ రద్దు వంటి అంశాలపై హైకోర్టులో రోజువారి విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. నిజానికి బిల్లులు ఎప్పుడో పాసైపోయాయి. గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. ఆ సమయంలో కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆచరణ ఆగిపోయింది. ఇప్పుడు వాటి చట్టబద్ధతపైనే విచారణ జరుపుతున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ రెండు బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించడం రాజకీయవర్గాల్లో సంచలనానికి కారణం అవుతోంది. 

Also Read: YS Jagan : వరద విపత్తును ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొలేకపోయిందా ? సీఎం జగన్ తీరుపైనా విమర్శలు ఎందుకు ?

అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభం అయిన తర్వాత ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఆ తర్వాత మంత్రులతో సమావేశమైన సీఎం జగన్ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా నిర్ణయం ప్రకటించారు. మంత్రులు ఆమోదించారు. ఈ విషయాన్ని  హైకోర్టులో మూడు రాధానులపై విచారణ జరుగుతున్న సందర్భంలో ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ వివరించారు.  న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టు స్పందన తెలియాల్సి ఉంది. 

Also Read: Nellore Mayor Election: నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గా పొట్లూరి స్రవంతి..

మూడు రాజధానుల బిల్లులు మొదటగా అసెంబ్లీలో పాసై మండలికి వచ్చాయి. అప్పట్లో మండలిలో  ఆమోదం పొందలేదు. వాటిని సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లుగా అప్పటి మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. అయితే అనూహ్యంగా తర్వాత జరిగిన సమావేశాల్లో మరోసారి ఏపీ ప్రభుత్వం అవే బిల్లులను ప్రశవ పెట్టింది. అసెంబ్లీలో ఆమోదించింది. కానీ మళ్లీ మండలిలో ఆమోదం పొందలేదు. కానీ రెండు వారాల గడువు తర్వాత మండలి ఆమోదం కూడా అవసరం లేదని పాసయినట్లేనని చెప్పుకున్న ప్రభుత్వం బిల్లులను గవర్నర్‌కు పంపింది. ఆయన ఆమోద ముద్రవేశారు. ప్రభుత్వం గెజిట్ కూడా జారీ చేసింది. కానీ రైతులు మాత్రం చట్ట విరుద్ధంగా బిల్లులు ఆమోదించారని కోర్టుకు వెళ్లారు. 

Also Read: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు

మూడు  రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గినట్లుగా కాదని.. మరో రూపంలో తెర మందుకు తెస్తారని భావిస్తున్నారు. కోర్టుల్లో ఆ బిల్లులు నిలబడవన్న కారణంగానే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఏ రూపంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

Also Read: చంద్రబాబుకు సోనూసూద్ పరామర్శ... అసెంబ్లీ పరిణామాలపై విచారం వ్యక్తం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Elon Musk Sells X: ఎలాన్‌మస్క్‌ కీలక నిర్ణయం, ఎక్స్ సంస్థ విక్రయం - ఎంతకి అమ్మాడో తెలుసా
ఎలాన్‌మస్క్‌ కీలక నిర్ణయం, ఎక్స్ సంస్థ విక్రయం - ఎంతకి అమ్మాడో తెలుసా
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Ravindra Jadeja Records: రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్, ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత
రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్, ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP DesamKavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk Sells X: ఎలాన్‌మస్క్‌ కీలక నిర్ణయం, ఎక్స్ సంస్థ విక్రయం - ఎంతకి అమ్మాడో తెలుసా
ఎలాన్‌మస్క్‌ కీలక నిర్ణయం, ఎక్స్ సంస్థ విక్రయం - ఎంతకి అమ్మాడో తెలుసా
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Ravindra Jadeja Records: రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్, ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత
రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్, ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత
Vijay Varma: 'ఐస్‌క్రీమ్‌లా ఆస్వాదిస్తేనే సంతోషం' - తమన్నాతో బ్రేకప్ ప్రచారం వేళ రిలేషన్ షిప్‌పై విజయ్ వర్మ ఏమన్నారంటే?
'ఐస్‌క్రీమ్‌లా ఆస్వాదిస్తేనే సంతోషం' - తమన్నాతో బ్రేకప్ ప్రచారం వేళ రిలేషన్ షిప్‌పై విజయ్ వర్మ ఏమన్నారంటే?
Rashmika: ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
MS Dhoni Trolling:  కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
Embed widget