అన్వేషించండి

Andhra Pradesh News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, కొత్త రూట్‌తో గోవా, బెంగళూరుకు రైట్ రైట్

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ వచ్చింది. గుంటూరు - గుంతకల్లు మధ్య రెండో రైలు మార్గంలో ఇదివరకే రాకపోకలను అనుమతించారు. పనులు పూర్తయితే అటు బెంగళూరు, ఇటు గోవాకు రూట్ క్లియర్ అవుతుంది.

Guntur - Guntakal Train Route | ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త. త్వరలోనే మరో రైలు మార్గం అందుబాటులోకి రానుంది. గుంటూరు - గుంతకల్లు మధ్య రెండో రైలు మార్గం పనులు పూర్తికావొచ్చాయి. డబ్లింగ్, విద్యుదీకరణ పనుల కోసం 41 కిలోమీటర్ల కుగానూ 3631 కోట్లు ఖర్చు చేయడానికి ఐదేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం సగం, కేంద్ర రైల్వే శాఖ సగం చొప్పున భరించాలని ఒప్పందం చేసుకున్నాయి.

ఇప్పటివరకు దాదాపు 350 కిలోమీటర్ల మేర పని పూర్తయింది. మరోవైపు రైళ్ల రాకపోకలను అనుమతించారు. ఒకవేళ మొత్తం 401 కిలోమీటర్ల పనులు పూర్తయితే అటు బెంగళూరుతో పాటు రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కోస్తాంధ్రకు, రాజధాని అమరావతికి, టారిస్ట్ ప్రాంతం గోవాకు వేగంగా చేరుకోవడానికి ఈ మార్గం ఉపయోగపడుతుంది. గుంటూరు గుంతకల్లు మధ్య ఈ రెండు రైలు మార్గంలో ప్రయాణానికి గంటన్నర సమయం ఆదా అవుతుంది. దేశంలో తూర్పు పడమర ప్రాంతాల మధ్య అనుసంధానం మరింత పెరగనుంది. తద్వారా మరిన్ని కొత్త రైళ్లు ప్రారంభించే అవకాశం ఏర్పడుతుంది. కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే గోవా నుంచి మచిలీపట్నం వరకు పలు వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడానికి అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

సొరంగ మార్గాలతో పనులలో జాప్యం..

బొగడ వద్ద 1.6 కిలోమీటర్ల టన్నెల్ పనులు ప్రారంభించాల్సి ఉంది. మరోవైపు చలమ వద్ద ప్రారంభించిన 0.34 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు అటవీశాఖ అనుమతి సైతం తీసుకున్నారు. 2026 డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దిగువమెట్ల- నంద్యాల మార్గంలో 40 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంది. ఇందులో దిగువ మెట్ల నుంచి గాజులపల్లి మధ్య రెండు సొరంగాల పనుల కారణంగా 27 కిలోమీటర్ల పనులలో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నంద్యాల -గాజులపల్లి మార్గంలో 13 కిలోమీటర్ల పనులు మొదలుపెట్టారు.. మరో ఆరు నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నారు. నంద్యాల- పాణ్యం మధ్య 14 కిలోమీటర్ల పనులను వచ్చే ఏడాది జూన్ వరకు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓవరాల్ గా ఈ ప్రాజెక్టు పూర్తయితే చాలా ప్రాంతాల వారికి ప్రయాణం ఈజీ కానుంది. దూరం తగ్గడంతో పాటు ప్రయాణించే సమయం కలిసొస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget