అన్వేషించండి

YSRCP: 25 ఓట్ల మెజార్టీతో గెల్చుకున్న ఆ నియోజకవర్గంపై సీఎం జగన్ కీలక నిర్ణయం!

AP Politics: రెండు సార్లు రీ కౌంటింగ్ తరువాత.. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తరువాత అప్పట్లో తెలుగుదేశం పార్టీ సిట్టిగ్ శాసన సభ్యుడు బోండా ఉమా గెలిచినట్లుగా ఎన్నికల అధికారి సైతం ప్రకటించారు.

AP Politics: పాతిక ఓట్ల మెజార్టీతో గెల్చుకున్న ఆ నియోజకవర్గంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆ నియోజకవర్గ శాసన సభ్యునికి సైతం నెక్ట్స్ నో సీట్ అని చెప్పేశారనే ప్రచారం జరుగుతోంది.

25 ఓట్లతో గెల్చుకున్న సీటుపై జగన్ కీలక నిర్ణయం...
2019 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన 151మంది శాసన సభ్యులను గెలిపించటం ఒక రికార్డ్ గా మారింది. అలాంటి రికార్డ్ లను మరిన్ని బ్రేక్ చేయాలనే కాన్సెప్ట్ తో ఉన్న జగన్ ఈ సారి వై నాట్ 175 అనే స్లోగన్ ను తీసుకొచ్చారు. దీంతో ఇక ప్రతి నియోజకవర్గం కీలకంగా మారింది. ఏదోలా గెలిచేద్దాం అంటూ బ్లైండ్ గా దూసుకుపోవాలనే ధోరణిలో జగన్ అస్సలు లేరని పలు సందర్బాల్లో బహిర్గం అవుతుంది. తాజాగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటి బయకు వస్తున్న క్రమంలో వై నాట్ 175 టార్గెట్ లో జగన్ ఎంత పక్కాగా ఉంటున్నారో చెప్పకనే చెబుతున్నారు. అలాంటి సందర్బమే బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బయటకు వచ్చిందని పార్టి నేతలు అంటున్నాురు.

గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 25 ఓట్ల మెజార్టీతో గెల్చుకుంది. అది రెండు సార్లు రీ కౌంటింగ్ తరువాత.. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తరువాత అప్పట్లో తెలుగుదేశం పార్టీ సిట్టిగ్ శాసన సభ్యుడు బోండా ఉమా గెలిచినట్లుగా ఎన్నికల అధికారి సైతం ప్రకటించారు. అయితే మరో సారి రీ కౌంటింగ్ పెట్టటంతో ప్రభుత్వ ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ పుణ్యమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు మల్లాది విష్ణు విన్ అయ్యారు. 25 ఓట్లతో గెల్చినట్లుగా ప్రకటించారు, అఫిడవిట్ ఇవ్వటంతో నాటకీయ పరిణామాలకు తెర పడింది. అయితే ఇప్పడు అదే విజయవాడ సెంట్రల్ సీటు ను తిరిగి కైవసం చేసుకునేందుకు టీడీపీ మాజీ శాసన సభ్యుడు బోండా ఉమా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్లతో ఓడిపోవటంతో ఆ మెజార్టీని అధిగమించేందుకు బోండా అన్ని రకాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఈసారి వైసీపీకి చాలా కీలకం..
ఈ సారి 175సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా భావిస్తున్న క్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటు బాధ్యతల నుండి మల్లాది విష్ణును తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వినిపిస్తోంది. ఈ మేరకు జగన్ ఇప్పటికే ప్రైవేట్ సర్వే చేయించారని అంటున్నారు. మల్లాది విష్ణు, దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. ఆయన చనిపోయిన తరువాత విష్ణు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి జగన్ వెంట నడిచారు. వైఎస్ ఫ్యామిలికి మోస్ట్ వాంటెడ్ జాబితాలో మల్లాది విష్ణు పేరు ఉంటుంది. అలాంటి కీలకమయిన నేతకు సైతం టిక్కెట్ డౌట్ అని జగన్ ముందుగాను చెప్పేశారని అంటున్నారు. అందులో భాగంగానే మల్లాది విష్ణుకు ఇప్పటికే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలను జగన్ అప్పగించారని అంటున్నారు.

ఈ నియోజకవర్గంలో తెలుగు దేశం బలంగా ఉండటం ఒక ఎత్తయితే, అదే సమయంలో అధికార పార్టికి చెందిన కార్పోరేటర్లకు , ఎమ్యెల్యే విష్ణుకు మధ్య గ్యాప్ ఏర్పడిందనే కారణాలు కూడ ఉన్నాయని చెబుతున్నారు. సో టార్గెట్ 175 లో భాగంగా బెజవాడ లో అత్యంత కీలకం అయిన సెంట్రల్ నియోజకవర్గ సిట్టింగ్ శాసన సభ్యుడికి సీట్ ను మార్చి వేరొకరికి సీటును కేటాయించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Embed widget