అన్వేషించండి

CM Jagan on Ramya Case : రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టు తీర్పు చరిత్రాత్మకం : సీఎం జగన్

CM Jagan on Ramya Case : గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య కేసులో దోషికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇది చరిత్రాత్మక తీర్పు అని సీఎం జగన్ అన్నారు. నిందితుడికి శిక్షపడేలా చేసిన పోలీస్ శాఖకు అభినందనలు తెలిపారు.

CM Jagan on Ramya Case : గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి ఉరి శిక్ష విధించింది. ఈ ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. 'విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు' అని ట్వీట్ చేశారు. దిశ స్ఫూర్తితో రమ్య కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసులను, ప్రాసిక్యూషన్‌ న్యాయవాదిని సీఎం అభినందించారు. మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కేసు చాటిచెప్పిందన్నారు. మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి  ఈ తీర్పు గట్టి సందేశాన్ని పంపిందని సీఎం వ్యాఖ్యానించారు. నేరాల నిరోధంలో, దురదృష్టవశాత్తు జరిగే నేరాల దర్యాప్తులో పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేసి మహిళల భద్రత, రక్షణలకు పెద్దపీట వేయాలన్నారు. దర్యాప్తులో, విచారణలో ఉన్న ఈ తరహా కేసుల సత్వర పరిష్కారం కోసం కృషిచేయాలన్నారు.

 మంత్రి రోజా స్పందన 

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో 9 నెలల్లోనే విచారణ పూర్తి చేసి, నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు రావడంపై రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. దిశ చట్టం స్ఫూర్తితో హత్య జరిగిన పది గంటల్లోనే నిందితుడ్ని పట్టుకుని, ఐదు రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేసి దిశ పోలీసులతో విచారణ జరిపించి నిందితుడ్ని శిక్షపడేలా చేశారని రోజా అన్నారు. ఈ దిశ చట్టాన్ని అమలు చేస్తే నిందితులను 21 రోజుల్లోనే శిక్షించవచ్చన్నారు. నిందితులకు తప్పు చెయ్యాలంటే భయం ఉంటుందని, ఆడపిల్లలకు రక్షణ ఉంటుందన్నారు. 

రమ్య కుటుంబానికి అండగా 

"దిశ చట్టం అమలు చేయకపోయినా దిశ చట్టం స్ఫూర్తితో ఈ కేసు విచారణ చేపట్టారు. 9 నెలల్లోనే విచారణ జరిపి నిందితుడికి శిక్ష పడేటట్లు చేశారు. ఆడపిల్లల మీద జరిగిన ఏ చిన్న విషయాన్ని అయినా టీడీపీ రాజకీయం చెయ్యాలని చూస్తుంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో దిశ లాంటి చట్టాలు ఎందుకు చేయలేదు. గత ప్రభుత్వంలో మహిళలపై ఎన్నో ఘోరాలు జరిగాయి. అయినా అప్పటి ప్రభుత్వం ఏ చట్టాలు తీసుకురాలేదు. సీఎం జగన్ మాత్రం మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే దిశ చట్టం, యాప్ తీసుకొచ్చారు. టీడీపీ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. దిశ యాప్ ద్వారా ఇప్పటికే 900 మంది మహిళలను రక్షించారు. రమ్య ఘటన చాలా దురదృష్టకరం. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం చాలా వేగంగా స్పందించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించారు. ఈ కేసులో త్వరితగతిన తీర్పు వచ్చేలా చేసి సీఎం జగన్ రమ్య ఆత్మకు శాంతి కలిగేలా చేశారు." అని మంత్రి రోజా అన్నారు. 

రికార్డు సమయంలో కేసు విచారణ 

రమ్య కేసులో తీర్పుపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. రమ్య కేసులో దోషికి ఉరిశిక్ష పడడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఈ ఘటనలో అదుపుచేసేందుకు సీఎం జగన్ దిశ చట్టం తీసుకొచ్చారన్నారు. రమ్య కేసులో ప్రభుత్వం చాలా వేగంగా పనిచేసిందన్నారు. సీఎం ఆదేశాలతో పోలీసులు అత్యంత వేగంగా విచారణ చేసి దోషికి శిక్ష పడేలా చేసిందన్నారు. 9 నెలల్లోనే శశికృష్ణకు శిక్షపడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Pawan meets Chandrababu : గ్రామ వికాసమే లక్ష్యం - చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు
గ్రామ వికాసమే లక్ష్యం - చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Chiranjeevi - Venkatesh: చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?
చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?
Embed widget