అన్వేషించండి

CM Jagan on Ramya Case : రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టు తీర్పు చరిత్రాత్మకం : సీఎం జగన్

CM Jagan on Ramya Case : గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య కేసులో దోషికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇది చరిత్రాత్మక తీర్పు అని సీఎం జగన్ అన్నారు. నిందితుడికి శిక్షపడేలా చేసిన పోలీస్ శాఖకు అభినందనలు తెలిపారు.

CM Jagan on Ramya Case : గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి ఉరి శిక్ష విధించింది. ఈ ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. 'విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు' అని ట్వీట్ చేశారు. దిశ స్ఫూర్తితో రమ్య కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసులను, ప్రాసిక్యూషన్‌ న్యాయవాదిని సీఎం అభినందించారు. మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కేసు చాటిచెప్పిందన్నారు. మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి  ఈ తీర్పు గట్టి సందేశాన్ని పంపిందని సీఎం వ్యాఖ్యానించారు. నేరాల నిరోధంలో, దురదృష్టవశాత్తు జరిగే నేరాల దర్యాప్తులో పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేసి మహిళల భద్రత, రక్షణలకు పెద్దపీట వేయాలన్నారు. దర్యాప్తులో, విచారణలో ఉన్న ఈ తరహా కేసుల సత్వర పరిష్కారం కోసం కృషిచేయాలన్నారు.

 మంత్రి రోజా స్పందన 

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో 9 నెలల్లోనే విచారణ పూర్తి చేసి, నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు రావడంపై రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. దిశ చట్టం స్ఫూర్తితో హత్య జరిగిన పది గంటల్లోనే నిందితుడ్ని పట్టుకుని, ఐదు రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేసి దిశ పోలీసులతో విచారణ జరిపించి నిందితుడ్ని శిక్షపడేలా చేశారని రోజా అన్నారు. ఈ దిశ చట్టాన్ని అమలు చేస్తే నిందితులను 21 రోజుల్లోనే శిక్షించవచ్చన్నారు. నిందితులకు తప్పు చెయ్యాలంటే భయం ఉంటుందని, ఆడపిల్లలకు రక్షణ ఉంటుందన్నారు. 

రమ్య కుటుంబానికి అండగా 

"దిశ చట్టం అమలు చేయకపోయినా దిశ చట్టం స్ఫూర్తితో ఈ కేసు విచారణ చేపట్టారు. 9 నెలల్లోనే విచారణ జరిపి నిందితుడికి శిక్ష పడేటట్లు చేశారు. ఆడపిల్లల మీద జరిగిన ఏ చిన్న విషయాన్ని అయినా టీడీపీ రాజకీయం చెయ్యాలని చూస్తుంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో దిశ లాంటి చట్టాలు ఎందుకు చేయలేదు. గత ప్రభుత్వంలో మహిళలపై ఎన్నో ఘోరాలు జరిగాయి. అయినా అప్పటి ప్రభుత్వం ఏ చట్టాలు తీసుకురాలేదు. సీఎం జగన్ మాత్రం మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే దిశ చట్టం, యాప్ తీసుకొచ్చారు. టీడీపీ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. దిశ యాప్ ద్వారా ఇప్పటికే 900 మంది మహిళలను రక్షించారు. రమ్య ఘటన చాలా దురదృష్టకరం. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం చాలా వేగంగా స్పందించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించారు. ఈ కేసులో త్వరితగతిన తీర్పు వచ్చేలా చేసి సీఎం జగన్ రమ్య ఆత్మకు శాంతి కలిగేలా చేశారు." అని మంత్రి రోజా అన్నారు. 

రికార్డు సమయంలో కేసు విచారణ 

రమ్య కేసులో తీర్పుపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. రమ్య కేసులో దోషికి ఉరిశిక్ష పడడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఈ ఘటనలో అదుపుచేసేందుకు సీఎం జగన్ దిశ చట్టం తీసుకొచ్చారన్నారు. రమ్య కేసులో ప్రభుత్వం చాలా వేగంగా పనిచేసిందన్నారు. సీఎం ఆదేశాలతో పోలీసులు అత్యంత వేగంగా విచారణ చేసి దోషికి శిక్ష పడేలా చేసిందన్నారు. 9 నెలల్లోనే శశికృష్ణకు శిక్షపడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget