By: ABP Desam | Updated at : 12 Jan 2022 07:42 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 41,954 కరోనా పరీక్షలు చేయగా.. 3,205 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన మెుత్తం కరోనా కేసుల సంఖ్య 20,87,879కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్ కారణంగా.. ఎవరూ చనిపోలేదు. తాజాగా 281 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మెుత్తం 20,63,255 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 10,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
#COVIDUpdates: 12/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 12, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,84,984 పాజిటివ్ కేసు లకు గాను
*20,60,360 మంది డిశ్చార్జ్ కాగా
*14,505 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,119#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Y1L8zqQ8gI
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 1,94,720 కరోనా కేసులు నమోదయ్యాయి. 442 మంది వైరస్తో మృతి చెందారు. 60,405 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,46,30,536కు పెరిగింది.
మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి పెరిగింది. ఇందులో 1805 మంది రికవరయ్యారు.
చాలా రాష్ట్రాల్లో మంగళవారం కరోనా కేసులు పెరిగాయి. బంగాల్లో 21,098 మందికి కరోనా సోకింది. దీంతో మరోసారి రోజువారి కేసుల సంఖ్య లక్ష మార్కు దాటింది. తమిళనాడులో 15,379 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో 9,066 కేసులు నమోదయ్యాయి.
పండుగ సీజన్ కావడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని లేకుంటే మరో దారుణమైన కరోనా వేవ్ చూడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Guntur News : బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న గుజరాత్ కిలేడీలు, వాహనాల తాళాలు లాక్కొని బ్లాక్ మెయిల్!
Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి
East Godavari News : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్
Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు
Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే
Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
PM Modi Telangana Tour: మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్
CM KCR On Dalit Bandhu: దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేయండి - అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం