News
News
వీడియోలు ఆటలు
X

Corona Cases: ఏపీలో కొత్తగా 122 కరోనా కేసులు నమోదు.. ఒకరు మృతి

ఏపీలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 122 మందికి కొవిడ్ పాజిటివ్ సోకింది. 

FOLLOW US: 
Share:

ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 18,788 మంది శాంపిల్స్ పరీక్షించగా అందులో 122 మందికి కరోనా సోకింది. కొవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 213మ మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రం ఇప్పటి వరకు మొత్తం 20,70,957 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  వైరస్ కారణంగా ఇప్పటి వరకు 14,453 మంది మరణించారు. ప్రస్తుతం.. 2,030 మంది చికిత్స పొందుతున్నారు.

దేశంలో కొత్తగా 8,306 కరోనా కేసులు నమోదుకాగా 211 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 8,834 మంది కరోనా నుంచి రికవరయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 552 రోజుల కనిష్ఠానికి చేరాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 98,416 వద్ద ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కేసులు: 34,641,561‬

మొత్తం మరణాలు: 4,73,537

యాక్టివ్​ కేసులు: 98,416

మొత్తం కోలుకున్నవారు: 3,40,69,608

వ్యాక్సినేషన్..

దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. ఆదివారం 24,55,911 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,27,93,09,669కి చేరింది.

ఒమిక్రాన్ కేసులు.. 

దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం దేశంలో కొత్తగా మరో 16 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9 కేసులు నిర్ధరణయ్యాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, దిల్లీలో ఒకటి, ముంబయిలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. నైజీరియా నుంచి మహారాష్ట్ర వచ్చిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆమె సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ఫిన్లాండ్‌ నుంచి పుణె వచ్చిన మరో వ్యక్తిలోనూ ఈ వైరస్‌ గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి చేరింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబంలోని 9 మందికి ఈ వేరియంట్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు వెల్లడించింది. 

Also Read: Jagan CBI : సాక్షులను ప్రభావితం చేస్తారు, జగన్‌కు హాజరు మినహాయింపు వద్దు.. హైకోర్టులో సీబీఐ వాదన !

Also Read: AP NGO's: రేపటి నుంచి ఉద్యమకార్యాచరణకు సిద్ధం... నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం

Also Read: Polavaram : వచ్చే ఏడాది ఏప్రిల్‌కు పోలవరం పూర్తి కాదు .. రాజ్యసభలో తేల్చి చెప్పిన కేంద్రం !

Published at : 06 Dec 2021 06:49 PM (IST) Tags: ap corona cases New Corona Cases Corona Deaths In AP Covid updates latest covid updates

సంబంధిత కథనాలు

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

AP SSC Exams: ఏపీలో రేపటి నుంచే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: ఏపీలో రేపటి నుంచే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

Tirupati: గోవిందరాజస్వామి గుడిలో అపశ్రుతి, కూలిన చెట్టు, ఒకరి మృతి! ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Tirupati: గోవిందరాజస్వామి గుడిలో అపశ్రుతి, కూలిన చెట్టు, ఒకరి మృతి! ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్రలో వివేకా హత్యపై ప్లకార్డులు, ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ నినాదాలు

Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్రలో వివేకా హత్యపై ప్లకార్డులు, ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ నినాదాలు

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

టాప్ స్టోరీస్

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

Project K: ‘ప్రాజెక్ట్ కె’లో విలన్ పాత్రకు కమల్ అంత డిమాండ్ చేశారా? అసలు నిజం ఇది!

Project K: ‘ప్రాజెక్ట్ కె’లో విలన్ పాత్రకు కమల్ అంత డిమాండ్ చేశారా? అసలు నిజం ఇది!