అన్వేషించండి

Top Headlines: ఏపీకి తుపాను గండం - సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్?, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:

1. ఏపీకి తుపాను గండం

రాష్ట్రాని(Andhra Pradesh)కి మ‌రో తుఫాను(Cyclone) గండం పొంచి ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ఇటీవ‌ల ఫెంగ‌ల్(Fengal) తుఫాను కార‌ణంగా త‌మిళ‌నాడులోని కొన్ని జిల్లాలు అత‌లాకుత‌లం అయిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌భావం ఏపీలోని తిరుప‌తి(Tirupati), నెల్లూరు(Nellore), అనంత‌పురం జిల్లాల‌పైనా ప‌డింది. ఇక‌, తాజాగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. నెల్లూరు, ఉత్తర తమిళనాడు మధ్యలో కేంద్రీకృతమైంది. ఇది రానున్న రెండు రోజుల్లో బ‌ల‌ప‌డి వాయుగుండంగా మారేందుకు చాన్స్ ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా చదవండి.

2. మన్యం ప్రాంతాలను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి

కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల మన్యం పరిధిలో ప్రజలను పులి భయం పరుగులు తీయిస్తోంది. వారం రోజుల క్రితం ప్రత్తిపాడు మండలం ఏజెన్సీ ప్రాంతమైన బాపన్నధారలో పెద్దపులి ఆవుదూడపై దాడిచేసి చంపిన తరువాత భయం మరింత ఎక్కువైంది. దీంతో ప్రత్తిపాడు మండల పరిధిలోని సుమారు 10 గ్రామాల్లో ప్రజలకు బయటకు రావాలంటే జడుసుకుంటున్నారు. సాయంత్రానికే ఇంటికి చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో అడుగు బయటపెట్టడం లేదు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే అడ్డతీగల మండలం కీనపర్తిలో పొలం పనులకు వెళ్లి వస్తున్న వ్యక్తికి పులి కనిపించింది. ఇంకా చదవండి.

3. టీడీపీ అధిష్టానానికి, శ్రేణులకు పార్థసారధి, శిరీష రిక్వెస్ట్

" తెలియక జరిగిన పొరపాటు ఇది నన్ను క్షమించండి " అంటూ ఏపీ మంత్రి పార్థసారథి చంద్రబాబును వేడుకున్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా అలాగే చెప్పారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వీరితో పాటు కలిసిపోయి వైసిపి మాజీ మంత్రి జోగి రమేష్ కూడా పాల్గొనడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇలా కూటమినేతలతో కలిసినందుకు జగన్ వద్ద జోగి రమేష్‌కు చీవాట్లు పడతాయి అనుకుంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇంకా చదవండి.

4. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.?

అల్లు అర్జున్ ను అరెస్టు చేసినట్లుగా కేటీఆర్‌ను ఏదో ఓ సందర్భంలో హఠాత్తుగా అరెస్టు చేసే అవకాశాలు ఉండకపోవచ్చని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అర్జున్ కేసు వేరు.. కేటీఆర్ కేసు వేరు. కేటీఆర్ అరెస్టు అంశం రాజకీయంగా సున్నితమైనది. ఆయన తప్పు చేశారా లేదా అన్నది ముందుగా ప్రజల ముందు ఉంచాలి. ఆయనను అరెస్టు చేయడం కరెక్టే అని మెజార్టీ ప్రజలు అనుకునేలా చేయగలిగితే అప్పుడు అరెస్టు చేసి చట్టం ముందు పెడితే రాజకీయంగా నష్టం ఉండదని అంచనా వేస్తున్నారు. ఇంకా చదవండి.

5. ఇవాళ కేటీఆర్, రేపటి టార్గెట్ కేసీఆర్‌యేనా.?

రాజకీయాల్లో కనికరం ఉండదు. రాజకీయంగా శత్రువు దొరికితే అంతే. ఇది రాజుల కాలం నుంచి వస్తున్నదే. రక్త సంబంధికుడైనా సరే  సింహాసనం కోసం పోటీలోకి వస్తే కనికరం లేకుండా ఖతం చేయాల్సిందే. అప్పుడు కత్తితో నిర్మూలిస్తే.. ఇవాళ రాజకీయ పార్టీలు తమ రాజకీయ శత్రువుల కోసం చట్టాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇది దేశ రాజకీయాల్లో సామాన్య విషయంగా మారింది. ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి, రాజకీయంగా తమ దారికి తెచ్చుకోవడానికి, చివరకు రాజకీయ సమాధి కట్టడానికి చట్టపరంగా ఎలాంటి చర్యలకైనా సిద్ధమవుతున్నాయి పార్టీలు. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget