అన్వేషించండి

Cyclone Effect In AP: ఏపీకి తుఫాను గండం- నెల్లూరు, ఉత్త‌ర త‌మిళ‌నాడు మ‌ధ్య అల్ప‌పీడ‌నం

Andhra Pradesh Weather: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తుఫానుగండం పొంచిఉంది. ద‌క్షిణమ‌ధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడనం.. నెల్లూరు, ఉత్త‌ర త‌మిళ‌నాడు మ‌ధ్య కేంద్రీకృత‌మైంది. ఇది వాయుగుండంగా మారనుంది.

Cyclone effect In AP:  రాష్ట్రాని(Andhra Pradesh)కి మ‌రో తుఫాను(Cyclone) గండం పొంచి ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ఇటీవ‌ల ఫెంగ‌ల్(Fengal) తుఫాను కార‌ణంగా త‌మిళ‌నాడులోని కొన్ని జిల్లాలు అత‌లాకుత‌లం అయిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌భావం ఏపీలోని తిరుప‌తి(Tirupati), నెల్లూరు(Nellore), అనంత‌పురం జిల్లాల‌పైనా ప‌డింది. ఇక‌, తాజాగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. నెల్లూరు, ఉత్తర తమిళనాడు మధ్యలో కేంద్రీకృతమైంది. ఇది రానున్న రెండు రోజుల్లో బ‌ల‌ప‌డి వాయుగుండంగా మారేందుకు చాన్స్ ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఇదేస‌మ‌యంలో వాయుగుండం.. నెల్లూరు వైపు వ‌స్తుందా? త‌మిళ‌నాడు వైపు వెళ్లుందా? అనే విష‌యంపై ఒక అంచ‌నాకు రాలేక పోతున్నారు. ఏదేమైనా.. ప్ర‌స్తుతం ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం.. ప్ర‌భావం మాత్రం ప‌డుతుంద‌ని చెబుతున్నారు. 

రేప‌టి నుంచి వ‌ర్షాలు.. 

వాయుగుండం ప్ర‌భావంతో బుధ‌వారం(ఈ నెల 18) నుంచి కోస్తా(Coastal) తీరం వెంబ‌డి ఉన్న జిల్లాల్లో ఓమోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ విభాగం అధికారులు తెలిపారు. అదేవిధంగా త‌దుప‌రి నాలుగు రోజులు కూడా.. ప్ర‌కాశం(Prakasam), నెల్లూరు(Nellore), తిరుప‌తి(Tirupati) జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల‌పైనా వాయుగుండం ప్ర‌భావం ఉంటుంద‌ని, ఒక‌టి రెండు చోట్ల భారీ వర్షాలు కువ‌ర‌నున్నాయ‌ని తెలిపారు. 

అధికారులు అప్ర‌మ‌త్తం

వాయుగుండం ప్ర‌భావం.. ఇది తుఫానుగా మారే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో, బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను అప్ర‌మ్మత్తం చేసింది. 

ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొంటాం:  మంత్రి

రాష్ట్రంలో ఎలాంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anita) తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కొండపావులూరులోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్ ను  సందర్శించిన సంద‌ర్భంగా మాట్లాడారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విపత్తుల నష్టాన్ని తగ్గించేలా తీసుకోవాల్సిన చర్యలపై మూడు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రమాద అంచనా, ముందస్తు అవగాహన, వెంటనే స్పందించే అంశంపై అధికారులు పూర్తి అవగాహనతో ఉండాలన్నారు.

మ‌రోవైపు చ‌లి-పులి!

ఒక‌వైపు కోస్తా తీరం వెంబ‌డి జిల్లాల‌ను వాయుగుండం భ‌య‌పెడుతుంటే.. మ‌రోవైపు ఉత్త‌రాంధ్ర జిల్లాలు శీత‌ల గాలుల‌తో వ‌ణుకుతున్నాయి. సాధార‌ణంగానే ఉత్త‌రాంధ్ర‌కు శీత‌ల గాలులు(Cold Winds) ఎక్కువ‌గా వీస్తాయి. అయితే.. ఈ సారి ప‌ది రోజుల‌ ముందుగానే.. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా త‌గ్గిపోయాయి. దీంతో మ‌న్యం జిల్లాలైన అల్లూరి సీతారామ‌రాజు జిల్లా, శ్రీకాకుళంలోని ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌లు గ‌జ‌గ‌జ‌లాడుతున్నారు. సోమవారం జి.మాడుగులలో 4.1 డిగ్రీలు, అరకులోయలో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణో­గ్రతలు నమోద‌య్యాయి. ఇక‌, చింతపల్లిలో 7.0, జీకే వీధిలో 7.3, హుకుంపేటలో 7.8 ,పెదబయలులో 9.0, అనంతగిరిలో 9.4 ,కొయ్యూరులో 11.6 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

దుప్ప‌టి ముసుగులో భాగ్య‌న‌గ‌రం 

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్(Hyderabad) దుప్ప‌టి ముసుగు త‌న్నింది. గ‌తానికి భిన్నంగా ఈ ఏడాది చ‌లిగాలులు భాగ్య‌న‌గ‌ర వాసుల‌ను వ‌ణికిస్తున్నాయి. ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు చలిగాలుల తీవ్రత కొన‌సాగుతుండ‌డంతో పాఠ‌శాల‌ల‌కు వెళ్లే చిన్నారులు వ‌ణికిపోతున్నారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు బయట అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు. ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతున్న‌ట్టు  వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సాధారణం కంటే పలు ప్రాంతాల్లో 6నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండటంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంద‌ని పేర్కొన్నారు. ఇక‌, చ‌లిగాలుల‌కు తోడు పొగ‌మంచు ద‌ట్టంగా కురుస్తుండ‌డంతో ర‌హ‌దారులపై ప్ర‌యాణం చేయ‌డం వాహ‌న‌దారుల‌ను బెంబేలెత్తిస్తోంది. మరో రెండురోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. చలి తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ప్ర‌జ‌లు మాస్క్‌లు, స్వెటర్లను ఆశ్ర‌యిస్తున్నారు. అదేవిధంగా మార్నింగ్ వాక్ చేసేవారు 9 గంట‌ల త‌ర్వాత కానీ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget