అన్వేషించండి

Kisan Mitra Chhadi: ప్రతి రైతు చేతిలో ఉండాల్సిన కిసాన్ మిత్ర ఛడీ! పాము కాటు నుంచి రక్షించే యంత్రం ఎలా పని చేసుంది?

Kisan Mitra Chhadi: భారత్‌లో ఏటా వేల సంఖ్యలో రైతులు పాము కాటుతో మరణిస్తున్నారు. దీని నుంచి రక్షించేందుకు కేంద్రం కిసాన్ మిత్ర ఛడీ పేరుతో యంత్రాన్ని ఆవిష్కరించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రైతుల రక్షణకు కేంద్రం కిసాన్ మిత్ర ఛడీ ప్రవేశపెట్టింది.
  • ఈ స్మార్ట్ స్టిక్ పాములు, విషపురుగులు గుర్తించి హెచ్చరిస్తుంది.
  • సెన్సార్లు, AIతో పనిచేసేది, 5-15 మీటర్ల పరిధిలో గుర్తింపు.
  • పాముకాటు మరణాలు తగ్గించి, రైతులకు భద్రత కల్పిస్తుంది.

Kisan Mitra Chhadi: భారత్‌లో వ్యవసాయ ఆధారిత దేశం. భారత్‌కు వెన్నుముకగా నిలిచే రైతులు నిరంతరం ప్రకృతితో పోరాడుతూనే ఉంటారు. అయితే వారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో పాము కాటు ఒకటి. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా సుమారు 46వేల మంది నుంచి 60 వేల మంది వరకు మరణిస్తున్నారు. ఇందులో అత్యధికులు పొలాల్లో రాత్రివేళ నీరు పెట్టడానికి వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి గమనించిన కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న అస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే కిసాన్ మిత్ర ఛడీ

ఏంటీ కిసాన్ మిత్ర ఛడీ

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయ్‌సేన్‌లో నిర్వహించిన జాతీయ వ్యవసాయ మేళాలో కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివార్జ సింగ్ చౌహాన్ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. చూడటానికి సాధారణ చేతికర్రలా కనిపించే ఈ కిసాన్ మిత్ర ఛడీ నిజానికి ఇంటర్నెట్‌ ఆఫ్ థింగ్స్ ఆధారంగా పని చేస్తుంది. 

పొలాల్లో పాములలు లేదా ఇతర విష జంతువులు ఉన్నాయో లేదో ఈ కర్ర ముందే పసిగట్టి రైతును హెచ్చరిస్తుంది. ముఖ్యంగా చీకటి సమయాల్లో లేదా పొలాల్లో నీరు పెట్టేట్పుడు ఎదురయ్యే ప్రమాదాలను నివారించడానికి ఇది ఒక రక్షణ కవచంలా పని చేస్తుంది. 

కిసాన్ మిత్ర ఛడీ ఎలా పని చేస్తుంది?

ఈ స్మార్ట్ స్టిక్ పని తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. దీని వెనుక అత్యాధునిక సెన్సార్లు, సాంకేతిక దాగి ఉన్నాయి. రైతు ఈ కర్రను పట్టుకొని పొలానికి వెళ్లినప్పుడు దానిపై ఉన్న ఒక ప్రత్యేక బటన్ నొక్కి నేలకు ఆనిస్తే చాలు ఒక వేళ సమీపంలో పాము ఉంటే ఆ కర్ర గట్టిగా వైబ్రేట్ అవుతుంది. ఈ పరికరంలో పాసివ్ ఇన్‌ఫ్రారెడ్, ఆల్ట్రాసోనిక్ సెన్సార్లు అమర్చి ఉంటాయి. పాములు విడుదల చేసే థర్మల్‌ సిగ్నేచర్స్‌, వాటి కధలికల వల్ల కలిగే సెన్సిటివ్ వైబ్రేషన్లు గుర్తిస్తాయి. 

ఈ స్టిక్ ఐదు నుంచి 15 మీటర్ల పరిధిలో పాములను కచ్చితంగా గుర్తిస్తుంది. అయితే దీనిని హెచ్చరిక సంకేతాలు 100 మీటర్ల దూరం వరకు కూడా పని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరికరం ఆధునిక వెర్షన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కూడా జోడించారు. ఇది పాము కదలికలకు, గాలికి ఊగే గడ్డి కదలికలకు మధ్య తేడాను గుర్తించి, తప్పుడు హెచ్చరికలు రాకుండా చూస్తుంది. 

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

పాముకాటు ప్రమాదాలు తగ్గుతాయా?

ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 30 నుంచి 40 లక్షల పాముకాట్లు నమోదు అవుతున్నాయి. ఇందులో 60 వేల మంది వరకు చనిపోతున్నారు. ఈ మరణాలలో అత్యధికులు చెప్పులు లేకుండా లేదా తక్కువ వెలుతురులో పనిచేసే రైతులే. ఈ గణాంకాలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, కిసాన్ మిత్ర ఛడీ వంటి ఆవిష్కరణలు ఈ మరణాలను గణనీయంగా తగ్గించగలవు. ఈ స్టిక్ కేవలం ఒక పనిముట్టు మాత్రమే కాదు, గ్రామీణ భారత్‌ ప్రాణాలను కాపాడే పరికరం. శాస్త్రవేత్తల ఈ ప్రయత్నం, వ్యవసాయాన్ని సురక్షితంగా, ఆధునికంగా మార్చడంలో ఒక ప్రధానమైన, అవసరమైన అడుగుగా మారనుంది. నాగుపాము లేదా కట్లపాము వంటి అత్యంత విషపూరితమైన పాముల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ పరికరం ప్రత్యేకంగా ఒక వరంలా మారనుంది. సకాలంలో హెచ్చరికలు అందుకోవడం ద్వారా, రైతులు వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను, ప్రాణాంతక ప్రమాదాలను తగ్గనున్నాయి. సరైన సాంకేతికత, అవగాహనతో, మన రైతులు ఇకపై ఎలాంటి భయం లేకుండా తమ కష్టార్జితాన్ని పండించుకోగలుగుతారు.

మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Frequently Asked Questions

కిసాన్ మిత్ర ఛడీ అంటే ఏమిటి?

కిసాన్ మిత్ర ఛడీ అనేది పాములను గుర్తించి రైతులకు హెచ్చరికలు అందించే ఒక స్మార్ట్ స్టిక్. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఆధారంగా పనిచేస్తుంది.

కిసాన్ మిత్ర ఛడీ ఎలా పనిచేస్తుంది?

ఈ స్మార్ట్ స్టిక్ లో అత్యాధునిక సెన్సార్లు ఉంటాయి. నేలను ఆనిస్తే, సమీపంలో పాము ఉంటే ఇది వైబ్రేట్ అవుతుంది. ఇది పాములు విడుదల చేసే థర్మల్ సిగ్నేచర్స్, వాటి కదలికలను గుర్తిస్తుంది.

కిసాన్ మిత్ర ఛడీ ఎంత దూరం వరకు పాములను గుర్తించగలదు?

ఈ పరికరం 5 నుంచి 15 మీటర్ల పరిధిలో పాములను కచ్చితంగా గుర్తిస్తుంది. హెచ్చరిక సంకేతాలు 100 మీటర్ల దూరం వరకు పని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కిసాన్ మిత్ర ఛడీ వల్ల పాముకాటు ప్రమాదాలు తగ్గుతాయా?

అవును, కిసాన్ మిత్ర ఛడీ వంటి ఆవిష్కరణలు దేశంలో ప్రతి సంవత్సరం సంభవిస్తున్న వేలాది పాముకాట్ల వల్ల కలిగే మరణాలను గణనీయంగా తగ్గించగలవు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tata Docomo: కోర్టు తీర్పు అమలు చేస్తే జీఎస్టీ కట్టాలన్న అధికారులు - కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే
కోర్టు తీర్పు అమలు చేస్తే జీఎస్టీ కట్టాలన్న అధికారులు - కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే
JPMorgan Case: పైఆఫీసర్ లైంగికంగా వేధించింది - అమెరికాలో భారతీయ ఉద్యోగి కేసు - పాపం రాణా !
పైఆఫీసర్ లైంగికంగా వేధించింది - అమెరికాలో భారతీయ ఉద్యోగి కేసు - పాపం రాణా !
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Advertisement

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tata Docomo: కోర్టు తీర్పు అమలు చేస్తే జీఎస్టీ కట్టాలన్న అధికారులు - కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే
కోర్టు తీర్పు అమలు చేస్తే జీఎస్టీ కట్టాలన్న అధికారులు - కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే
JPMorgan Case: పైఆఫీసర్ లైంగికంగా వేధించింది - అమెరికాలో భారతీయ ఉద్యోగి కేసు - పాపం రాణా !
పైఆఫీసర్ లైంగికంగా వేధించింది - అమెరికాలో భారతీయ ఉద్యోగి కేసు - పాపం రాణా !
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Viral Video: టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !
టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !
US Kurnool Youth: అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
Car Care Tips: వేసవిలో పొరపాటున కూడా ఈ వస్తువులను కారు ఉంచొద్దు.. చిన్న తేడావచ్చినా అంతా బూడిదే
వేసవిలో పొరపాటున కూడా ఈ వస్తువులను కారు ఉంచొద్దు.. చిన్న తేడావచ్చినా అంతా బూడిదే
Gayapadda Simham OTT : ఆ ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Embed widget