అన్వేషించండి

PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ లబ్ధిదారు రైతు చనిపోతే, ప్రభుత్వ సాయం ఎవరికి అందుతుంది?

పీఎం కిసాన్ పథకం 13వ విడత నగదును కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతోంది.

PM Kisan Samman Nidhi: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయ రంగ వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. ఆ పథకాల్లో ఒకదాని పేరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana). ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2009లో ప్రారంభించింది. ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం పేద రైతులకు రూ. 6,000 ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈ సొమ్మును మూడు భాగాలుగా మార్చి, ఏడాదికి మూడు సార్లు చొప్పున రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తోంది. అంటే, సగటున 4 నెలలకు ఒకసారి, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,000 రైతు ఖాతాలో జమ అవుతాయి. పీఎం కిసాన్ పథకం 13వ విడత (PM Kisan Scheme 13th Installment) నగదును కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతోంది.

రైతు చనిపోతే ప్రయోజనం ఎవరికి లభిస్తుంది?
పీఎం కిసాన్ స్కీమ్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని నియమాలను ముందుగా తెలుసుకుందాం. సాధారణంగా, ఈ పథకం గురించి రైతుల్లో చాలా ప్రశ్నలు ఉంటాయి. ఒకవేళ పీఎం కిసాన్ పథకం లబ్ధిదారు చనిపోతే, ఈ పథకం ద్వారా వచ్చే ప్రయోజనం తన కుటుంబానికి కొనసాగుతుందా, లేదా? అన్నది కూడా రైతుల్లో ఉన్న సంశయాల్లో ఒకటి. ఈ ప్రశ్నకు ఇవాళ సమాధానం తెలుసుకుందాం. 

ఒకవేళ, పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుగా ఉన్న రైతు చనిపోతే, ఆ రైతు వారసుడు సంబంధింత భూమి యాజమాన్యాన్ని పొందాలి. అప్పుడు, అతనే ఈ పథకం లబ్ధిదారు అవుతాడు. 

అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6,000 ప్రయోజనం పొందడానికి, PM కిసాన్ పోర్టల్‌లో కొత్తగా పేరు నమోదు చేసుకోవాలి. ఈ పోర్టల్‌లో నమోదు చేసే ముందు, అతను కిసాన్ యోజనకు అర్హుడా, కాదా అన్న విషయాన్ని అధికారులు తనిఖీ చేస్తారు.

PM కిసాన్ పోర్టల్‌లో ఇలా నమోదు చేసుకోండి:
1. PM కిసాన్ పోర్టల్‌లో మీ పేరు నమోదు చేసుకోవడానికి, అధికారిక పోర్టల్ https://pmkisan.gov.in ని సందర్శించండి.
2. ఆ తర్వాత, New Farmer Registration బటన్‌ మీద క్లిక్ చేయండి.
3. దీని తర్వాత, మీ ఆధార్ నంబర్‌ను అక్కడ నమోదు చేసి, ఆపై క్యాప్చా కోడ్‌ను పూరించాలి.
4. ఆ తర్వాత, 'క్లిక్ హియర్ టు కంటిన్యూ' ఆప్షన్‌ ఎంచుకోండి.
5. ఇప్పుడు మీకు ఒక దరఖాస్తు ఫారం ఓపెన్‌ అవుతుంది. అందులో, ప్రభుత్వం తరపున అడిగిన మొత్తం సమాచారాన్ని పూరించాలి. ఆ ఫారం నింపిన తర్వాత సేవ్ చేయడం మరిచిపోవద్దు.
6. ఇక్కడితో, PM కిసాన్ పథకం కోసం మీ పేరు నమోదు ప్రక్రియ పూర్తి అవుతుంది.
7. ఇది కాకుండా, మీరు మొబైల్ ద్వారా, లేదా CSC కేంద్రానికి వెళ్లి ఆఫ్‌లైన్ కూడా దరఖాస్తు పొందవచ్చు.

PM కిసాన్ పథకానికి సంబంధించిన సహాయం కోసం:
పీఎం కిసాన్ లబ్ధిదార్లకు సాయం చేయడానికి ప్రభుత్వం కొన్ని హెల్ప్‌ లైన్ నంబర్‌లను జారీ చేసింది. ఆ నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా, పథకానికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఆ నంబర్లు... 1555261, 1800115526 లేదా 011-23381092. ఈ మూడు నంబర్లు టోల్ ఫ్రీ నంబర్లు. 

ఇది కాకుండా, pmkisan-ict@gov.in ఐడీకి ఈ-మెయిల్‌ పంపడం ద్వారా కూడా పథకం గురించి సమాచారాన్ని పొందవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget