రైతులను గండాలు వెంటాడుతున్నాయి. పంటలు చేతికి వచ్చిన వరి రైతులు కొనుగోళ్ల కోసం ఆందోళన చెందుతుండగా మిర్చి రైతులను తామర పురుగు వెంటాడుతుంది. అమెరికాలోని హవాయి, ఫ్లోరిడా నుంచి వ్యాప్తి చెందిన ఈ వ్యాధి ఇప్పడు తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి పంటను నాశనం చేస్తుంది. గత నెల రోజులుగా మిర్చి పంటపై దాడి చేస్తూ పంట ఎదుగదలను, పూతను దెబ్బతీస్తుంది. పరిస్ధితిని పరిశీలించిన శాస్త్ర వేత్తలు రైతులకు పలు సూచనలు సలహాలు అందించింనా కాని ఫలితం లేకుండా పోతుంది. పురుగు ఉదృతిని గమనిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో ఎక్కడా కూడా మిర్చి పంట చేతికి అందే దాఖలాలు కనిపించడం లేదు.నెల రోజుల నుంచి మిర్చి పంటలను ఆశించిన తామర పురుగు మిర్చి పంటలో ఆకులు, మొగ్గలు, పువ్వులు, కాయలు, పండ్లను దేనినీ వదలకుండా పీల్చిపిప్పి చేసి నాశనం చేస్తుంది. మొక్క మొదళ్ల నుంచి పూత వరకు పంటపై తామర పురుగు దాడి చేయడంతో రైతులు పంటపై ఆశలు వదులుకుంటున్నారు. కళ్లముందే పంట నాశనం అవుతుండటంతో సాగుచేసిన వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు.
Minister KTR About Sr NTR: ఖమ్మంలో ఎన్టీఆర్ పార్క్ ప్రారంభించిన కేటీఆర్
Mallareddy Dance On World Heart Day: యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని మల్లారెడ్డి సూచన
World Heart Day | Rainbow Hospital | గుండె లోపాలను గర్భంలోనే గుర్తిస్తే ప్రాణాలు కాపాడొచ్చు | ABP
KA Paul on Telangana Politics : సికింద్రాబాద్ బహిరంగసభతో తనేంటో చెప్తానంటున్న పాల్ | ABP Desam
Small Kid Crying For Ganesh Nimajjanam | వెళ్లిపోతున్న గణపయ్య.. ఏడ్చేసిన చిన్నారి | ABP Desam
Tamilsai : ఎంత అవమానించినా వెనక్కి తగ్గను -గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు !
మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్ఎస్- హింట్ ఇచ్చిన హరీష్
Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్ను నా రూమ్కు పిలిచి నిద్రపోయా
బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు
/body>