CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
చెన్నై సూపర్ కింగ్స్ అంటే గుర్తొచ్చే పేర్లు.. ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా. ఈ ముగ్గురిలో కనీసం ఒక్కరు లేకుండా సీఎస్కే మైదానంలోకి దిగడం గత 17 ఏళ్ల ప్రస్థానంలో ఇదే తొలిసారి. గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్తో చెన్నై టీమ్ లో కొత్త ప్రయాణం మొదలైంది.
ధోనీ క్యాప్టియన్సీ లో సీఎస్కే 10 సార్లు ఫైనల్ చేరి, 5 టైటిళ్లను సొంతం చేసుకుంది. 'చిన్న తల'గా పేరు తెచ్చుకున్న సురేష్ రైనా ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్. ఇక రవీంద్ర జడేజా.. వికెట్లు, క్యాచ్లు, పరుగుకు అంటూ అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. CSK కు బ్యాక్ బోన్ లాగా ఉండేవాడు. ముఖ్యంగా 2023 ఫైనల్లో జడేజా కొట్టిన ఆ బౌండరీ సీఎస్కే చరిత్రలోనే ఎవరు మర్చిపోలేరు.
సురేష్ రైనా 2022లోనే ఐపీఎల్కు వీడ్కోలు పలకగా, 2026 సీజన్ మినీ వేలానికి ముందు జరిగిన భారీ ట్రేడింగ్లో రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్కు వెళ్లిపోయాడు. ఇక 'తల' ధోనీ జట్టులోనే ఉన్నప్పటికీ, గాయం కారణంగా ఈ సీజన్ తొలి రెండు వారాలు ఆటకు దూరమయ్యాడు. దీంతో ఈ ముగ్గురు దిగ్గజాలు లేకుండానే చెన్నై తన తొలి మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
ట్రెండింగ్ వార్తలు





















