India vs South Africa T20 World Cup Suryakumar Yadav | భారత్ ఓటమికి అసలు కారణం ఇదే
టీ20 వరల్డ్ కప్ 2026 ( T20 World Cup 2026 ) సూపర్-8లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచులో సౌతాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో భారత్ను చిత్తు చేసింది. ఈ ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) షాకింగ్ నిజాలను వెల్లడించారు.
సూర్య మాట్లాడుతూ.. "మా ఓటమిని మిల్లర్, బ్రెవిస్ ఇన్నింగ్స్ శాసించాయి. కేవలం 21 పరుగులకే 3 వికెట్లు తీసి మేం అద్భుతంగా ఆరంభించాం. కానీ 7 నుంచి 15 ఓవర్ల మధ్య సౌతాఫ్రికా బ్యాటర్లు గేర్ మార్చి మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. 187 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పవర్ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం కోలుకోలేని దెబ్బ తీసిందని సూర్య ఒప్పుకున్నారు.
బ్యాటర్లు విఫలమైనా, బౌలింగ్లో బుమ్రా ( Jasprit Bumrah ), అర్ష్దీప్ ( Arshdeep Singh ) జోడీ అదరగొట్టిందని సూర్య కొనియాడారు. బుమ్రా, అర్ష్దీప్ కలిసి 5 వికెట్లు తీసి ప్రత్యర్థిని నియంత్రించే ప్రయత్నం చేశారు. కానీ బ్యాటింగ్లో శివం దూబే ( Shivam Dube ) మినహా మరెవరూ కనీస పోరాటం కనబరచలేదు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు నిరాశపరిచారు.
సౌతాఫ్రికా బౌలర్ మార్కో యాన్సెన్ ( Marco Jansen ) 4 వికెట్లతో, కేశవ్ మహరాజ్ 3 వికెట్లతో భారత పతనాన్ని శాసించారు. అయితే ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామని సూర్య ధీమా వ్యక్తం చేశారు. "జింబాబ్వేతో జరగబోయే తదుపరి మ్యాచులో మా శైలి మార్చుకోం.. స్వేచ్ఛగా ఆడి బలంగా పుంజుకుంటాం" అని కెప్టెన్ స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు





















