Punishment for 8 IAS Officers: Andhra Pradesh High Court సంచలన తీర్పు | ABP Desam
Andhra Pradesh High Court సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది IAS అధికారులకు తొలుత 2 వారాల పాటు జైలు శిక్ష విధించింది. వారంతా క్షమాపణలు కోరటంతో జైలు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లల్లో నెలలో ఓ రోజు వెళ్లి సేవ చేయాలని పేర్కొంది. ఇలా ఏడాది పాటు చేయాలని స్పష్టం చేసింది. దాంతో పాటుగా ఓ రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని వారిని ఆదేశించింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని కోర్టు ధిక్కరణగా భావించి తొలుత జైలు శిక్ష విధించి, ఆ తర్వాత దాంట్లో మార్పులు చేసింది. ఆ 8 మంది IAS అధికారులు ఎవరంటే విజయ్ కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎంఎం నాయక్. వీరి వైఖరిని కోర్టు ధిక్కరణగా భావించి ధర్మాసనం తీర్పునిచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets