By: ABP Desam | Updated at : 31 May 2023 04:21 PM (IST)
Edited By: Pavan
రూ.10 కోసం నడి రోడ్డుపై స్నానం, వాహనదారుడిపై రూ. 3,500 ఫైన్ వేసిన పోలీసులు ( Image Source : ప్రతీకాత్మక చిత్రం )
Tamilnadu News: సోషల్ మీడియా వచ్చాక ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఫేమస్ అయిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు తమ టాలెంట్ ప్రదర్శించి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. మరికొందరు వింత చేష్టలతో ఫేమస్ అయిపోవాలని తపిస్తున్నారు. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం లాంటివి చేస్తూ వాటిని వీడియోలు తీస్తూ సోషల్ మీడియాల్లో అప్ లోడ్ చేస్తున్నారు. యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టా, ఫేస్బుక్ రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ ను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు మాత్రం పిచ్చి పిచ్చి చేష్టలతో ఓవర్ నైట్ లో ఫేమస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో బిజీగా ఉండే రోడ్లపైకి వచ్చి స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కూటీలపై బకెట్ లో నీళ్లు తీసుకుని బిజీగా ఉండే రోడ్లపైకి వస్తున్నారు. సిగ్నల్ పడగానే మగ్గుతో ఒంటిపై నీళ్లు పోసుకుంటూ అక్కడే సబ్బు పెట్టుకుని స్నానం చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి చేష్టలకు సోషల్ మీడియాలో బాగానే వ్యూస్ వస్తుండటంతో ఒకరి తర్వాత మరొకరు ఈ ట్రెండ్ ఫాలో అవుతూ రీల్స్ చేస్తున్నారు. ఈ ఇలాంటి వికృత చేష్టలతో తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఎంటర్టైన్ చేస్తున్నామని చెబుతూ అక్కడి వ్యక్తులను అసౌకర్యానికి గురిచేస్తున్నారు. అలాంటి 'బాతింగ్ ఆన్ రోడ్' వీడియో చేసిన ఓ వ్యక్తికి తమిళనాడు పోలీసులు ఫైన్ వేశారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రూ.10 బెట్ కోసం రూ.౩,500 ఫైన్
తాజాగా తమిళనాడులోని ఈరోడ్ లో ఎం ఫరూక్ (24) అనే యువకుడు నడి రోడ్డుపై స్నానం చేయడంతో తమిళనాడు పోలీసులు అతడిని గుర్తించి ఫైన్ వేశారు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల ఎం. ఫరూక్ ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. తన ఫాలోవర్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు. పచ్చి చేపలను తినడం, చక్కెరకు బదులు ఉప్పు వేసిన టీ తాగడం, రోడ్లపై నిద్రపోవడం లాంటి తన ఫాలోవర్స్ విసిరే ఛాలెంజెస్ చేస్తుంటాడు. తాజాగా రూ. 10 బెట్టింగ్ కోసం నడిరోడ్డుపై స్నానం చేసేందుకు సిద్ధమయ్యాడు. నిత్యం వాహనాల రద్దీతో బిజీగా ఉండే ఈరోడ్ లోని పన్నీర్ సెల్వం పార్క్ జంక్షన్ వద్ద స్కూటీపై వచ్చాడు. వెంట బకెట్ లో నీళ్లు తెచ్చుకున్నాడు. సిగ్నల్ పడగానే స్నానం చేయడం మొదలు పెట్టాడు. ఇదంతా తనతో పాటు వచ్చిన వారు వీడియో తీశారు. దానిని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. తోటి వాహనాదారులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎం ఫరూక్ ను గుర్తించి తనపై రూ.3,500 ఫైన్ వేశారు.
'ఆదివారం రోజు ఫరూక్ పన్నీర్ సెల్వం పార్క జంక్షన్ వద్ద నడిరోడ్డుపై స్నానం చేశాడు. అక్కడే ఉన్న వాళ్లు ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగితే ఎండల నుండి ఉపశమనం కోసం నీళ్లు పోసుకుంటున్నట్లు సమాధానం ఇచ్చాడు. ఇదంతా తనతో పాటు వచ్చిన వారు రికార్డు చేశారు. తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు' అని స్థానిక డీఎస్పీ జి.జవహార్ తెలపారు.
Viral Video: ట్రెడ్మిల్ చేస్తూ కుప్ప కూలిన యువకుడు, గుండెపోటుతో మృతి - వైరల్ వీడియో
Viral News: టాబ్లెట్ అనుకుని ఎయిర్పాడ్ మింగేసిన మహిళ, కడుపులో వినిపించిన శబ్దాలు
Spanish Man Arrest: లైవ్లో రిపోర్టర్కు లైంగిక వేధింపులు, వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
Flight: విమానం బాత్రూములో ఓ జంట పాడుపని, సిబ్బంది డోర్ ఓపెన్ చేయగానే ప్రయాణికుల అరుపులు
Viral Video: ఈ వీడియో చూస్తే మందుబాబుల గుండెలు ధడేల్, రోడ్లపై పారిన 2 మిలియన్ లీటర్ల వైన్
వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా
జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- అచ్చెన్న, అశోక్ సస్పెన్డ్
Singareni workers: సింగరేణి కార్మికుల అకౌంట్లలో రూ.లక్షలు జమ-త్వరలోనే పండుగ బోనస్
Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్కు ప్లస్ అవుతోందా ?
/body>