(Source: Poll of Polls)
Viral News: ఫుల్లుగా మద్యం సేవించాడు - బస్సెక్కి నిద్రపోయాడు, కండక్టర్ ఏం చేశారంటే?
Kadapa News: ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఎక్కడా స్థలం లేదన్నట్లు ఆర్టీసీ బస్సు పైకెక్కి నిద్రపోయాడు. స్థానికులు కేకలు వేయగా కండక్టర్ అతన్ని నిద్రలేపి కిందకు దించాడు.

Drinker Man Slept On RTC Bus: ఫుల్లుగా మద్యం సేవించాడు. ఎక్కడా చోటు లేనట్లు బస్సు టాప్ ఎక్కి హాయిగా నిద్రపోయాడు. ఇది చూసిన మిగతా ప్రయాణికులు అవాక్కయ్యారు. ఈ ఘటన కడప జిల్లాలో (Kadapa District) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేంపల్లిలో ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించాడు. ఈ మత్తులో రాయచోటి (Rayachoti) డిపోకు చెందిన రాయచోటి - వేంపల్లె పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు టాప్ ఎక్కి నిద్రించాడు. ఇది గమనించని బస్ డ్రైవర్ బస్సును తీశారు. వేంపల్లి నుంచి రాయచోటికి వెళ్లే క్రమంలో చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లికి బస్సు చేరుకుంది. బస్సు టాప్పై వ్యక్తి నిద్రిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు కేకలు డ్రైవర్, కండక్టర్లను అప్రమత్తం చేశారు. దీంతో వారు బస్సును ఆపి తాగుబోతును కిందకు దించి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీన్ని చూసిన ప్రయాణికులు, స్థానికులు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Andhra News: కొన్ని గంటల్లో పెళ్లి - నిన్న వధువు పరార్, నేడు ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్కు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























