అన్వేషించండి

Andhra News: కొన్ని గంటల్లో పెళ్లి - నిన్న వధువు పరార్, నేడు ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు..

Pattikonda News: కొన్ని గంటల్లో పెళ్లనగా.. శుక్రవారం అదృశ్యమైన యువతి ప్రియునితో కలిసి శనివారం పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

Pattikonda Love Story In Kurnool District: పెళ్లికి కొన్ని గంటల ముందు ఓ యువతి కల్యాణ మండపం నుంచి పారిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సదరు యువతి ఓ అబ్బాయితో వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లాలో (Kurnool District) శుక్రవారం జరగ్గా.. అదే యువతి శనివారం ప్రియునితో కలిసి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తికొండలోని గోపాల్ ప్లాజాలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లికూతురు వైష్ణవి అదృశ్యమైంది. ఆమె తన ప్రియుడితో కలిసి శనివారం పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. ప్రియుడిని పెళ్లి చేసుకుని అతనితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. వైష్ణవి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో కల్యాణమండపం నుంచి వెళ్లిపోయానని.. పెళ్లికుమారుడితో తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని పోలీసులకు తెలిపింది. అందుకే తనకు నచ్చిన అబ్బాయితో వెళ్లానని చెప్పింది. 

ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని..

తమపై తండ్రి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని వైష్ణవి పోలీసులను కోరింది. అయితే, ఆమె తండ్రిని తీసుకుని వస్తే ఫిర్యాదు వెనక్కు తీసుకుంటానని చెప్పడంతో ఆమె పీఎస్ నుంచి వెళ్లిపోయింది.

ఇదీ జరిగింది

అనంతపురానికి (Anantapuram) చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడు విశ్వాసికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లి, రాత్రి సంప్రదాయాల ప్రకారం చిన్నతాంబులం, పెద్ద తాంబూలం కూడా చేశారు. అయితే అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో ఉదయం 4 గంటలకు కళ్యాణ మండపం నుంచి వెళ్లిపోయింది. దీంతో కొన్ని గంటల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఈ క్రమంలో పెళ్లి కుమార్తె తండ్రి కన్నీరు మున్నీరవుతూ పత్తికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు తెల్లవారుజామున ఆమె ఓ యువకునితో వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనతో అటు వరుడు, ఇటు వధువు తరఫు వారు నిరుత్సాహంగా ఉండిపోయారు. శుక్రవారం ఈ ఘటన జరగ్గా.. శనివారం సదరు యువతి పోలీసుల ఎదుట ప్రత్యక్షమైంది.

Also Read: Free Gas Cylinder In AP: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హులు ఎవరు? ఎలా బుక్‌ చేయాలి? ఎప్పుడు బుక్ చేయాలి?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget