వియత్నాంలోని ఫు కుయోక్ దీవి సమీపంలో భారత టూరిస్టులతో వెళ్తున్న ఒక బోట్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Boat capsized near Phu Quoc Island in Vietnam | వియత్నాంలోని ఫు కుయోక్ దీవి సమీపంలో భారత పర్యాటకులతో వెళ్తున్న బోటు బోల్తా పడింది. భారత ఎంబసీ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది.

- వియత్నాంలో భారతీయ టూరిస్టుల బోటు బోల్తా, 15 మంది మృతి.
- లావా మొబైల్ కంపెనీ పర్యాటకులు, అలల ఉధృతితో బోటు మునిగింది.
- బోటు పూర్తిగా తలకిందులు కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.
- బాధిత కుటుంబాలకు భారత ఎంబసీ రెండు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు.
Indian Tourists Boat capsize | వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫు కుయోక్ దీవి సమీపంలో భారత టూరిస్టులతో వెళ్తున్న బోట్ ఒక్కసారిగా బోల్తా పడింది. హాన్ మే రుట్ నుంచి అన్ థోయ్ పోర్టుకు వస్తున్న ఈ పడవ తీరానికి కేవలం 400 మీటర్ల దూరంలో ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది వరకు భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల వారే అధికంగా ఉన్నట్లు సమాచారం. భారత్ నుంచి లావా మొబైల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లను వియత్నాం టూర్ తీసుకెళ్లగా ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని ఇతర బోట్ల నిర్వాహకులు స్పందించి నిమిషాల్లోనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే, బోటు పూర్తిగా తలకిందులు కావడంతో.. చాలా మంది లోపలే ఇరుక్కుపోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కొందరిని మాత్రమే స్పృహలో ఉండగా కాపాడగలిగారు. వర్షం లేకపోయినప్పటికీ, సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
In a tragic incident, a boat carrying several Indian tourists has capsized near Phu Quoc Island in Vietnam a few hours ago.
— India in Vietnam (@AmbHanoi) July 11, 2026
Exact details of the incident are being ascertained as search and rescue operations by local authorities are ongoing.
In order to provide information…
2 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసిన భారత ఎంబసీ..
భారత రాయబార కార్యాలయం ఒకేసారి రెండు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది, హెల్ప్లైన్ నంబర్లను జారీ చేసింది. ప్రభావిత కుటుంబాలకు సమాచారం, సహాయం అందించడానికి, హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414 నెంబర్లలో సంప్రదించవచ్చు అని సూచించారు.
హనోయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. +84 91 308 9165 నంబర్లో సంప్రదించి కుటుంబసభ్యులు టూరిస్టుల సమాచారం కోసం ప్రయత్నించవచ్చు అని పేర్కొన్నారు. ఎలాంటి సహాయం, సందేహాల కోసమైనా అందుబాటులో ఉన్నామని భారత ఎంబసీ పేర్కొంది.
🚨 BREAKING: TOURIST SPEEDBOAT SINKS OFF PHU QUOC
— NGO-SUGAR (@ngosugartp) July 11, 2026
A speedboat carrying 32 Indian tourists sank near Hon May Rut Ngoai, Phu Quoc, at around 10:30 a.m. on July 11.
🛟 18 people had been rescued by early afternoon.
⚠️ Authorities say fatalities are feared, but the official death… pic.twitter.com/rTkrbZ6GQp
వియత్నాం టూర్ వెళ్లిన మొబైల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు
ఒక మొబైల్ కంపెనీ భారత్ నుండి 250 మంది డిస్ట్రిబ్యూటర్లు, వారి కుటుంబాలను వియత్నాం ట్రిప్కు తీసుకెళ్లింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుండి 75 మంది ఉన్నారు. ట్రిప్లో భాగంగా 3 పడవల్లో విహరిస్తుండగా, 32 మంది భారతీయులు, నలుగురు సిబ్బందితో హాన్ మే రుట్ నుండి అన్థోయ్ పోర్టుకు బయల్దేరిన ఒక స్పీడ్ బోట్ ప్రమాదానికి గురైంది.
పడవ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫు కుయోక్ స్పెషల్ ఎకనమిక్ జోన్ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఏడాదికి లక్షలాది మంది విదేశీయులు సందర్శించే ఈ దీవిలో, విహారయాత్రకు వెళ్లిన భారతీయులు ఇలా జలసమాధి కావడం తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది.
Frequently Asked Questions
వియత్నాంలో భారతీయ పర్యాటకులకు ఏం జరిగింది?
ఈ ప్రమాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు?
ఈ ఘోర ప్రమాదంలో 15 మంది భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల వారే అధికంగా ఉన్నట్లు సమాచారం.
బోటు బోల్తా పడటానికి కారణం ఏమిటి?
వర్షం లేనప్పటికీ, సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బోటు పూర్తిగా తలకిందులు కావడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం ఏర్పడింది.
ప్రభావిత కుటుంబాలు సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలి?
భారత రాయబార కార్యాలయం రెండు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. ప్రభావిత కుటుంబాలు సమాచారం కోసం హో చి మిన్ సిటీ, హనోయిలలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















