By: ABP Desam | Updated at : 15 Apr 2023 01:41 PM (IST)
స్టీల్ ప్లాంట్ బిడ్లో తెలంగాణ పాల్గొంటుందా ?
Vizag Steel Plant Bid : విశాఖ ఉక్కు మంటలు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీటును ఒక్క సారిగా పెంచేశాయి. నేతల మాటల వేడి వేసవి వేడిని మించి పోతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదన్న అంచనాల మధ్య బీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చింది. సింగరేణిని దించింది. ఈక్విటీ బిడ్ వేస్తామని ప్రకటిం చింది. రూ.5వేల కోట్లు మూలధన నిధులు సేకరణకు సంబంధించి బిడ్లను ఆహ్వానించింది. దీని ప్రకారం కనీస మూలధనం విలువ రూ.5వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన సంస్థకు స్టీల్ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే స్టీల్ను అందజేస్తారు. ఈ బిడ్లలో పాల్గొనడానికి నేటితో గడువు ముగియనుంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వ తీరుతో.. , ప్లాంట్ పునరుద్ధరణకు EOI బిడ్డింగ్ చాలా కీలకమైనది. 15/4/23న మధ్యాహ్నం 3 గంటలలోపు EOIని ఖరారు చేసి , పాల్గొనమని SAIL మరియు AP, తెలంగాణ ప్రభుత్వాలకు విన్నపం. @SAILsteel @ysjagan #KCR @KTRBRS @BRSharish pic.twitter.com/xFbUZte2KY
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 14, 2023
ఇ ప్పటి వరకు కొన్ని సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇందులో పాల్గొనడానికి అవకాశం లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నట్లు అధికారులు ద్వారా తొలుత ప్రచారం జరిగింది. కేవలం ప్రయివేటు సంస్థలకు మాత్రమే బిడ్లలో పాల్గొనే అవకాశం ఉందని అంటూ వచ్చారు. అయితే ఇదంతా ఉత్తిత్తి ప్రచారమేనని మరికొందరు అధికారులు చెబుతున్నారు. ఎవరైనా బిడ్లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున తరుపున సింగరేణి కంపెనీకి చెందిన డైరెక్టర్ల బృందం ఈ బిడ్డింగ్లో పాల్గొనడానికి ఇప్పటికే స్టీల్ప్లాంట్కు రావడం రెండు రోజుల పాటు పలువురు డైరెక్టర్లు, సిఎండితో భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ మూలధన సేకరణకు బిడ్ వేయాలని... సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
సింగరేణి ద్వారా లేదా ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా బిడ్ వేయించాలని తెలంగాణ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందని చెబుతున్నారు. దీనికి కారణం స్టీల్ ప్లాంట్ రాజకీయంలో బీజేపీ యూటర్న్ తీసుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని చెబుతూ.. మళ్లీ వెంటనే .. డిజిన్వెస్ట్ ప్రక్రియ ఆపడం లేదని చెబుతున్నారు. దీంతో.. స్టీల్ ప్లాంట్ బిడ్లో పాల్గొని తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంలో సీరియస్గా ఉందని నిరూపించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్లో పాల్గొనకపోతే విపక్షాలు విమర్శలు చేసే అవకాశం ఉంది రాజకీయ ప్రయోజనాల కోసమే బిడ్డింగ్ లో పాల్గొంటామని హడావుడి చేశారని... అంతగా ఆర్థిక వెసులుబాటు ఉంటే తెలంగాణలో మూతపడిన పరిశ్రమల్ని తెరిపించాలన్న డిమాండ్లు విపక్షాలు చేస్తున్నాయి. ఇప్పుడు వెనక్కి తగ్గితే ఈ విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?
BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?
Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!
తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!
TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!
Lady VRO: చేతిలో పిల్లాడు ఉన్నా అక్రమ మైనింగ్ను అడ్డుకుని మహిళా వీఆర్వో సాహసం
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!