అన్వేషించండి

Errabelli Dayakar Rao: కస్తూర్బా స్కూల్‌లో భోజనంలో బల్లి ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్, బాధ్యులపై చర్యలకు ఆదేశం

కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, అందుకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 

Errabelli Dayakar Rao Visits to Devaruppula Kasturba School: వరంగల్ : దేవరుప్పుల మండల కేంద్రం కస్తూర్బా పాఠశాలలో రెండు కిందట భోజనంలో బల్లి పడిన ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. అలాంటి ఘటన జరగడంతో స్కూల్ ను సందర్శించి విద్యార్థినిలతో కలిసి స్కూల్ సమస్యలను తెలుసుకున్నారు మంత్రి ఎర్రబెల్లి. మంత్రి వెంట కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్ ఉన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తుందని, అందుకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, సంబంధిత అధికారులతో కలిసి స్కూల్, అవరణ, పరిసరాలు, వంట గది, భోజన హాల్ లను మంత్రి పరిశీలించారు.
స్కూల్ కోసం రూ.20 లక్షలు మంజూరు
పాఠశాల అవసరాల కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. భోజనంలో బల్లి రావడం ఘటనలో బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆదేశాలు జారీ చేశారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుండి స్కూల్ కి లక్ష రూపాయలు అందచేశారు. విద్యార్థులతో పాటు కూర్చొని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మంత్రి ఎర్రబెల్లి. సంఘటన జరిగినా తల్లితండ్రులకు సమాచారం ఇవ్వని ప్రిన్స్ పాల్  తీరుపై మంత్రి మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలని ఉన్నతాధికారులకు, స్కూల్ సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం వారి చదువుపై ప్రభావం చూపుతుందని, కనుక వారికి అందించే ఆహారం విషయంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని చెప్పారు.

అసలేం జరిగింది..
జనగామ జిల్లా దేవరుప్పుల కస్తుర్బా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. ఈ ఘటనలో 25 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురి అయ్యారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు వీరిని వెంటనే జనగామ ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే దోసకాయ కర్రీ లో బల్లి పడిందని.. దానినే తమకు పెట్టారని బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. భోజనం తిన్న తరువాత కొద్ది మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయని విద్యార్థినులు తెలిపారు. బల్లి పడిందని తెలియక తాము తినడంతో అస్వస్థతకు గురయ్యామని వారు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు చాలా మంది జనగామ హాస్పిటల్ కి చేరుకుని పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి - పోలీసుల రహస్య విచారణ !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Warangal Crime News: వరంగల్‌లో భార్య, కుమార్తెలను స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టి చంపేసిన భర్త! ప్రమాదంగా డ్రామా! కుమారుడి కోసం ఘాతుకం!
వరంగల్‌లో భార్య, కుమార్తెలను స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టి చంపేసిన భర్త! ప్రమాదంగా డ్రామా! కుమారుడి కోసం ఘాతుకం!
Telangana Congress: కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తికి అదే కారణమా? త్వరలోనే తీపి కబురు వింటారా?
కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తికి అదే కారణమా? త్వరలోనే తీపి కబురు వింటారా?
TRS Kavitha : కవిత నోట టీఆర్‌ఎస్ మాట! అదే పేరుతో పార్టీ పెడుతున్నారా? మీడియాతో చేసిన కామెంట్స్‌కు అర్థమేంటీ? 
కవిత నోట టీఆర్‌ఎస్ మాట! అదే పేరుతో పార్టీ పెడుతున్నారా? మీడియాతో చేసిన కామెంట్స్‌కు అర్థమేంటీ? 
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!

వీడియోలు

Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ
IPL 2026 Jofra Archer Death Overs RR vs GT | 19వ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ మ్యాజిక్
Siraj Catch Drop GT vs RR IPL 2026 | సిరాజ్ ఈజీ క్యాచ్‌ను సిక్సర్‌గా మార్చేశాడా
IPL 2026 Delhi Capitals vs Mumbai Indians | ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం
Riyan Parag Credits Dhruv Jurel RR vs GT IPL 2026 | రియాన్ పరాగ్ ప్లాన్ వెనుక ఉన్నది అతనే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS CSK Updates: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
AP Rains Alert: ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
IPL 2026 SRH VS LSG Result Update: పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
MAVIGUN : జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
Khanapur Municipal Chairman: కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
RTC Bus Catches Fire: హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
Vignesh Shivan : హీరోగా సినిమా ఓకే చేసిన అనిరుధ్ - లాస్ట్ మూమెంట్‌లో యాక్టింగ్ ఎందుకు మానేశాడంటే?
హీరోగా సినిమా ఓకే చేసిన అనిరుధ్ - లాస్ట్ మూమెంట్‌లో యాక్టింగ్ ఎందుకు మానేశాడంటే?
ఎస్‌యూవీల‌కు గండి కొట్టిన‌ మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
ఎస్‌యూవీల‌కు గండి కొట్టిన‌ మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
Embed widget