అన్వేషించండి

వరంగల్‌ వరద ప్రాంతాల్లో గవర్నర్ టూర్- ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని సూచన

తెలంగాణ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన నేపథ్యంలో త్వరలోనే ముంపు ప్రాంతాలను పర్యటిస్తానని మంగళవారం గవర్నర్ తమిళి సై ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన నేపథ్యంలో  త్వరలోనే ముంపు ప్రాంతాలను పర్యటిస్తానని మంగళవారం గవర్నర్ తమిళి సై ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం ఉదయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

ముందుగా ఆమె హైదరాబాద్‌ నుంచి వరంగల్ కు చేరుకున్నారు. వరంగల్‌ వెళ్లిన తరువాత ఆమె ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి గవర్నర్ వస్తున్నారని ముందుగానే తెలుసుకున్న ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అక్కడ నుంచి బయల్దేరిన ఆమె హనుమకొండ జవహర్‌ నగర్‌ లో వరద ప్రాంతాన్ని పరిశీలించారు. వరద బాధితులను ఆమె పరామర్శిచారు. బాధితులకు రెడ్ క్రాస్‌ ఆధ్వర్యంలో హెల్త్‌ కిట్స్‌, నిత్యావసరాలు పంపిణీ చేశారు. బాధితులను పరామర్శించిన అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ...'' భారీ వరదలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయని అన్నారు. 

వరదల వల్ల ఎంత నష్టం జరిగింది అనేది ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ పట్టణానికి నలువైపులా ఉన్న చెరువులకు వరద పోటెత్తిన కారణంగా ఈ పరిస్థితి చోటుచేసుకుందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సింది అని గవర్నర్ అభిప్రాయపడ్డారు. 

ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు ముంపు ప్రాంతాల్లో పరిశీలించి, ప్రజల పరిస్థితిని చూసి సహాయక చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. వరంగల్ పట్టణంలో స్థానిక ప్రజలు చాలా ఏళ్లుగా జవహర్ నగర్ కాలనీ బ్రిడ్జిని పున: నిర్మించాలని కోరుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు గవర్నర్. 

వరంగల్‌ నగరాన్ని మొత్తాన్ని వరదలు ముంచెత్తిన్నప్పటికీ అధికార పార్టీ నుంచి ఒక్కరు కూడా బాధితులను పరామర్శించడానికి వెళ్లలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న టైంలో  గవర్నర్ సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget