అన్వేషించండి

T Rajaiah: ఒంటరిగా మారిన రాజయ్య, ఆవేదనతో బీఆర్ఎస్ టికెట్‌పై ఘాటు వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంపై రాజయ్య మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇల్లు అలకగానే పండగ కాదని అన్నారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉందని అన్నారు.

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య తన నియోజకవర్గం లింగాలఘనపురం మండలంలో కల్యాణ్ చెక్కులను బుధవారం (ఆగస్టు 30) పంపిణీ చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ఇతర మండల స్థాయి నేతలు హాజరుకాలేదు. దీంతో ఎమ్మెల్యే రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక ఒంటరిగానే చెక్కులు పంపిణీ చేశారు. సదరు స్థానిక లీడర్లు అందరూ మొన్నటిదాకా తన వెంట తిరిగేవారని, తాజాగా అధిష్ఠానం తనకు టికెట్ నిరాకరించడం వల్ల వారంతా తనకు దూరం అయ్యారని అన్నారు. కడియం శ్రీహరికి టికెట్ కన్ఫామ్ అవ్వడం వల్ల తన వెంట ఉన్న ప్రజా ప్రతినిధులు కడియం వర్గానికి జంప్ అయ్యారని అన్నారు.

అయితే, తనకు బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంపై రాజయ్య మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇల్లు అలకగానే పండగ కాదని అన్నారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉందని అన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అంతా అనుకుంటున్నారని, ఎవరూ రారు, ఏదీ కాదని అన్నారు. తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా ప్రజా జీవితంలో అందరం కలిసి పని చేశామని అన్నారు. మళ్లీ మనం ప్రజా జీవితంలో ప్రజల్లోకి వెళ్లాలంటే కచ్చితంగా ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. ఏదో జరగబోయేది ఊహించుకోకండి, అనేక మార్పులు చేర్పులు ఉంటాయని రాజయ్య అన్నారు. 

కొద్ది రోజుల క్రితం ఘనపూర్ ఎమ్మెల్యే అయిన రాజయ్యకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించారు. దీంతో అప్పటి నుంచి రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసలే కడియం శ్రీహరి అంటే రాజయ్యకు పడదు. ఈ క్రమంలో రాజయ్య కన్నీరు కూడా పెట్టుకున్న సంగతి తెలిసిందే. 

మంగళవారం ఆయన హన్మకొండ సర్క్యూట్ హౌజ్ మార్గంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన బీఆర్ఎస్ టికెట్ల జాబితాలోనూ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిసిందని అన్నారు. కేసీఆర్ తనకు స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఇస్తారనే నమ్మకం ఇంకా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు టికెట్ కేటాయించకపోవడంపై మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. మందకృష్ణ మాదిగతో పాటు పలువురు నియోజకవర్గ  లీడర్లు తనకు ఫోన్ ​లో మద్దతు తెలుపుతున్నారని అన్నారు. తనకు ఎన్నికలలోపు టికెట్ కేటాయించకపోతే తన రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. 

తెలంగాణలో ఎస్సీ మాదిగల జనాభా 12 శాతం నుంచి 13 శాతం, మాలలు 5 శాతం నుంచి 6 శాతం, ఇతర ఉపకులాలు 0.7 శాతం నుంచి 1 శాతం వరకు ఉంటాయని వివరించారు. స్టేషన్ ​ఘన్ ​పూర్​లో 85 వేల ఎస్సీ జనాభా ఉంటే.. అందులో 67 వేల వరకు మాదిగ కులానికి చెందినవారే ఉన్నారని వివరించారు. టికెట్ మాదిగలకు మాత్రమే కేటాయించాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తుందని వివరించారు. ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు ఇస్తామంటున్నారని.. కానీ తనకు ఎమ్మెల్యే టికెట్ పై మాత్రమే ఆసక్తి ఉందని ఎమ్మెల్యే రాజయ్య స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Vishwanath And Sons Movie : సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
Tata Punch EV Facelift Price And Features:468 km రేంజ్‌తో వచ్చిన Tata Punch EV 2026 మోడల్‌ - బ్యాటరీ, ఫీచర్లు, డిజైన్‌లో వచ్చిన మార్పులు ఇవే
కొత్త Tata Punch EVకి ఇప్పుడు యమా క్రేజ్‌ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది?
Embed widget