అన్వేషించండి

T Rajaiah: ఒంటరిగా మారిన రాజయ్య, ఆవేదనతో బీఆర్ఎస్ టికెట్‌పై ఘాటు వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంపై రాజయ్య మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇల్లు అలకగానే పండగ కాదని అన్నారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉందని అన్నారు.

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య తన నియోజకవర్గం లింగాలఘనపురం మండలంలో కల్యాణ్ చెక్కులను బుధవారం (ఆగస్టు 30) పంపిణీ చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ఇతర మండల స్థాయి నేతలు హాజరుకాలేదు. దీంతో ఎమ్మెల్యే రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక ఒంటరిగానే చెక్కులు పంపిణీ చేశారు. సదరు స్థానిక లీడర్లు అందరూ మొన్నటిదాకా తన వెంట తిరిగేవారని, తాజాగా అధిష్ఠానం తనకు టికెట్ నిరాకరించడం వల్ల వారంతా తనకు దూరం అయ్యారని అన్నారు. కడియం శ్రీహరికి టికెట్ కన్ఫామ్ అవ్వడం వల్ల తన వెంట ఉన్న ప్రజా ప్రతినిధులు కడియం వర్గానికి జంప్ అయ్యారని అన్నారు.

అయితే, తనకు బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంపై రాజయ్య మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇల్లు అలకగానే పండగ కాదని అన్నారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉందని అన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అంతా అనుకుంటున్నారని, ఎవరూ రారు, ఏదీ కాదని అన్నారు. తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా ప్రజా జీవితంలో అందరం కలిసి పని చేశామని అన్నారు. మళ్లీ మనం ప్రజా జీవితంలో ప్రజల్లోకి వెళ్లాలంటే కచ్చితంగా ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. ఏదో జరగబోయేది ఊహించుకోకండి, అనేక మార్పులు చేర్పులు ఉంటాయని రాజయ్య అన్నారు. 

కొద్ది రోజుల క్రితం ఘనపూర్ ఎమ్మెల్యే అయిన రాజయ్యకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించారు. దీంతో అప్పటి నుంచి రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసలే కడియం శ్రీహరి అంటే రాజయ్యకు పడదు. ఈ క్రమంలో రాజయ్య కన్నీరు కూడా పెట్టుకున్న సంగతి తెలిసిందే. 

మంగళవారం ఆయన హన్మకొండ సర్క్యూట్ హౌజ్ మార్గంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన బీఆర్ఎస్ టికెట్ల జాబితాలోనూ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిసిందని అన్నారు. కేసీఆర్ తనకు స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఇస్తారనే నమ్మకం ఇంకా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు టికెట్ కేటాయించకపోవడంపై మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. మందకృష్ణ మాదిగతో పాటు పలువురు నియోజకవర్గ  లీడర్లు తనకు ఫోన్ ​లో మద్దతు తెలుపుతున్నారని అన్నారు. తనకు ఎన్నికలలోపు టికెట్ కేటాయించకపోతే తన రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. 

తెలంగాణలో ఎస్సీ మాదిగల జనాభా 12 శాతం నుంచి 13 శాతం, మాలలు 5 శాతం నుంచి 6 శాతం, ఇతర ఉపకులాలు 0.7 శాతం నుంచి 1 శాతం వరకు ఉంటాయని వివరించారు. స్టేషన్ ​ఘన్ ​పూర్​లో 85 వేల ఎస్సీ జనాభా ఉంటే.. అందులో 67 వేల వరకు మాదిగ కులానికి చెందినవారే ఉన్నారని వివరించారు. టికెట్ మాదిగలకు మాత్రమే కేటాయించాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తుందని వివరించారు. ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు ఇస్తామంటున్నారని.. కానీ తనకు ఎమ్మెల్యే టికెట్ పై మాత్రమే ఆసక్తి ఉందని ఎమ్మెల్యే రాజయ్య స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget