అన్వేషించండి

Uttam Kumar Reddy: తెలంగాణ ప్రజల్లో స్వాతంత్య్రం వచ్చిన ఫీలింగ్ - నెల రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్

Telangana News: ప్రజా పాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చేసి చూపించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యాం అన్నారు.

Congress One Month Rule in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తవుతోంది. తమ నెల రోజుల పాలనపై నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. ప్రజా పాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చేసి చూపించామని పేర్కొన్నారు. నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యాం.. నీటి పారుదల శాఖలో జవాబుదారీ, పారదర్శకంగా పని చేస్తున్నాం అని తెలిపారు.

తెలంగాణలో కొత్తగా స్వాతంత్య్రం వచ్చిన ఫీలింగ్..
కాంగ్రెస్ పాలన మొదలుకాగానే రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కొత్తగా స్వాతంత్య్రం వచ్చినట్టు భావిస్తున్నారు. ప్రజా భవన్ లోకి సామాన్యులను అనుమతించి ప్రజా వాణి (Prajavani in Telangana) ద్వారా వారి సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఒక నియంత పాలన అంతమైందన్న ఆనందంలో ఉన్నారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు పాలకులు, అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వం నుంచి ఎలాంటి పాలన ఆశిస్తున్నారో అది వారికి అందుతోంది. తనకు బాధ్యతలు అప్పగించిన నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖలపై సమీక్షలు చేసినట్లు తెలిపారు.

Uttam Kumar Reddy: తెలంగాణ ప్రజల్లో స్వాతంత్య్రం వచ్చిన ఫీలింగ్ - నెల రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన అంశం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు చెందిన మెడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడం లాంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష చేసింది. జ్యూడిషియల్ ఎంక్వరీ కోసం ఒక సిట్టింగ్ జడ్జి ని నియమించాలని కోరినట్లు మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై, కాళేశ్వరం ఓవరాల్ ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన లోపాలపై ఉన్నతాధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలకు, మీడియా వాళ్లకు వాస్తవాలు తెలిపాం. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలసి వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

నెల రోజుల పాలనపై సంతృప్తిగా ఉన్నాం.. 
పౌరసరఫరా శాఖలో 58 వేళ కోట్ల రూపాయల అప్పులు పేరుకు పోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పేదలకు ఇస్తున్న బియ్యం కిలో 38 రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందన్నారు. దీన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగ పడేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నెల రోజుల పాలన అత్యంత సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ లో అత్యంత పారదర్శకంగా పారదర్శకంగా, జవాబు దారి తనంతో పని చేస్తామని తాజా ప్రకటన ద్వారా ప్రజలకు మరోసారి హామీ ఇచ్చారు.

Also Read: ఈ నెల 8న తెలంగాణ కేబినెట్ భేటీ - నెల రోజుల పాలన, 6 గ్యారెంటీల అమలుపై సమీక్ష

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Super Power: తెలంగాణ కాంగ్రెస్‌లో సూపర్ పవర్ రేవంత్ రెడ్డి - ఇక అసంతృప్త నేతలంతా దారికి రావాల్సిందేనా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సూపర్ పవర్ రేవంత్ రెడ్డి - ఇక అసంతృప్త నేతలంతా దారికి రావాల్సిందేనా?
Shiv Pratap Shukla: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
Telangana డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి పెళ్లి వేడుక.. అధికార హోదా ఉన్నా.. ఆత్మీయతకే పెద్దపీట!
డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి పెళ్లి వేడుక.. అధికార హోదా ఉన్నా.. ఆత్మీయతకే పెద్దపీట!
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shiv Pratap Shukla: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Vijay Trisha: జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే
తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే
Embed widget