అన్వేషించండి

Uttam Kumar Reddy: తెలంగాణ ప్రజల్లో స్వాతంత్య్రం వచ్చిన ఫీలింగ్ - నెల రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్

Telangana News: ప్రజా పాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చేసి చూపించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యాం అన్నారు.

Congress One Month Rule in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తవుతోంది. తమ నెల రోజుల పాలనపై నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. ప్రజా పాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చేసి చూపించామని పేర్కొన్నారు. నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యాం.. నీటి పారుదల శాఖలో జవాబుదారీ, పారదర్శకంగా పని చేస్తున్నాం అని తెలిపారు.

తెలంగాణలో కొత్తగా స్వాతంత్య్రం వచ్చిన ఫీలింగ్..
కాంగ్రెస్ పాలన మొదలుకాగానే రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కొత్తగా స్వాతంత్య్రం వచ్చినట్టు భావిస్తున్నారు. ప్రజా భవన్ లోకి సామాన్యులను అనుమతించి ప్రజా వాణి (Prajavani in Telangana) ద్వారా వారి సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఒక నియంత పాలన అంతమైందన్న ఆనందంలో ఉన్నారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు పాలకులు, అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వం నుంచి ఎలాంటి పాలన ఆశిస్తున్నారో అది వారికి అందుతోంది. తనకు బాధ్యతలు అప్పగించిన నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖలపై సమీక్షలు చేసినట్లు తెలిపారు.

Uttam Kumar Reddy: తెలంగాణ ప్రజల్లో స్వాతంత్య్రం వచ్చిన ఫీలింగ్ - నెల రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన అంశం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు చెందిన మెడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడం లాంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష చేసింది. జ్యూడిషియల్ ఎంక్వరీ కోసం ఒక సిట్టింగ్ జడ్జి ని నియమించాలని కోరినట్లు మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై, కాళేశ్వరం ఓవరాల్ ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన లోపాలపై ఉన్నతాధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలకు, మీడియా వాళ్లకు వాస్తవాలు తెలిపాం. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలసి వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

నెల రోజుల పాలనపై సంతృప్తిగా ఉన్నాం.. 
పౌరసరఫరా శాఖలో 58 వేళ కోట్ల రూపాయల అప్పులు పేరుకు పోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పేదలకు ఇస్తున్న బియ్యం కిలో 38 రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందన్నారు. దీన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగ పడేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నెల రోజుల పాలన అత్యంత సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ లో అత్యంత పారదర్శకంగా పారదర్శకంగా, జవాబు దారి తనంతో పని చేస్తామని తాజా ప్రకటన ద్వారా ప్రజలకు మరోసారి హామీ ఇచ్చారు.

Also Read: ఈ నెల 8న తెలంగాణ కేబినెట్ భేటీ - నెల రోజుల పాలన, 6 గ్యారెంటీల అమలుపై సమీక్ష

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget