అన్వేషించండి

Kishan Reddy: తెలంగాణ రైల్వేకు బడ్జెట్‌లో రికార్డు, ఈసారి భారీగా నిధులు - కిషన్ రెడ్డి

Telangana News: 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,336 కోట్లు కేటాయింపులు జరిగాయి. 2014-15 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే దాదాపు 21 రెట్లు ఎక్కువ’’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Kishan Reddy on Railway Budget allocations: గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం రైల్వేల పరంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తూ వస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే. బడ్జెట్ కేటాయింపులు మొదలుకొని, నూతన రైల్వేట్రాక్ ల నిర్మాణం, విద్యుద్ధీకరణ, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, నూతన రైల్వేస్టేషన్ల ఏర్పాటు, సిద్ధిపేట,మెదక్ నూతన రైల్వే లైన్ల ప్రారంభం, చర్లపల్లి నూతన టెర్మినల్ నిర్మాణం వంటి ఎన్నో అంశాలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరిచి రాష్ట్రంలో రైల్వేలు పురోగతి సాధించడంలో కీలకమైన పాత్రను పోషించింది. 

గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల నరేంద్రమోదీ ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేకమైన శ్రద్ధకు కొనసాగింపుగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా రైల్వేల అభివృద్ధికి రూ. 5,336 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులు 2014-15 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే దాదాపు 21 రెట్లు ఎక్కువ. అదే 2009-14 మధ్యన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు కేటాయింపులతో పోలిస్తే 6 రెట్ల కంటే ఎక్కువ. 

కొత్త రైల్వే ట్రాక్ లు
తెలంగాణ రాష్ట్రానికి పెద్దమొత్తంలో నిధులను కేటాయించడమే కాకుండా అంతే రీతిలో రాష్ట్రంలో నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణాన్ని కూడా చేపట్టింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 32,946 కోట్ల విలువైన నూతన రైల్వే ట్రాక్ ల ప్రాజెక్టులు నిర్మాణం జరుపుకుంటున్నాయి. గతంలో 2009-14 మధ్యన సంవత్సరానికి సగటున 17 కి. మీ. ల నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణం జరగగా, గత 10 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి సగటున 65 కి. మీ. ల నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణం జరిగింది. వీటితో పాటుగా అనేక నూతన రైల్వే మార్గాలకు సంబంధించిన, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ ప్రాజెక్టులు ఫైనల్ లొకేషన్ సర్వేను జరుపుకుంటున్నాయి. 

విద్యుద్ధీకరణ కూడా
నూతన రైల్వే ట్రాక్ లను నిర్మించడమే కాకుండా, నిర్మించిన రైల్వే ట్రాక్ ల విద్యుద్ధీకరణపై కూడా రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధను కనబరచింది. తద్వారా నేడు తెలంగాణ రాష్ట్రంలో 100% రైల్వేల విద్యుద్ధీకరణ సాధ్యమయ్యింది. నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణం, విద్యుద్ధీకరణతో పాటుగా రక్షణ పరంగా కూడా రైల్వేశాఖ గట్టి చర్యలు చేపట్టింది. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 437 రైల్ ఓవర్ బ్రిడ్జ్ & రైల్ అండర్ బ్రిడ్జ్ ల నిర్మాణం జరిగింది. 

అమృత్ భారత్ స్టేషన్ లకు నిధులు
వీటితోపాటుగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించనున్నారు. వీటికి సంబంధించిన నిధుల కేటాయింపు జరగడమే కాకుండా ఆయా రైల్వేస్టేషన్లలో పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఆయా రైల్వేస్టేషన్ల వివరాలు:అదిలాబాద్, బాసర, బేగంపేట, భద్రాచలం రోడ్డు, గద్వాల, హఫీజ్ పేట, హైటెక్ సిటీ, హుప్పు గూడ, హైదరాబాద్, జడ్చర్ల, జనగామ, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట్ జంక్షన్, ఖమ్మం, లింగంపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మలక్ పేట, మల్కాజ్ గిరి, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్ నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగుళాంబ, తాండూర్, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్ పుర, జహీరాబాద్ రైల్వేస్టేషన్లు.

వీటితోపాటుగా హైదరాబాద్ లోని ప్రధాన రైల్వే స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడానికి చర్లపల్లిలో నిర్మిస్తున్న నూతన టెర్మినల్ పనులు 99% పూర్తి అయ్యాయి. త్వరలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం కానుంది. అలాగే, రూ.715 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని తలపెట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు కూడా చాలా వేగంగా కొనసాగుతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

In Pics: హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
Sangareddy Court: ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
Arekapudi Gandhi: కౌశిక్ భార్య మాపై పూలకుండీలు విసిరేసింది - అరెకపూడి గాంధీ
కౌశిక్ భార్య మాపై పూలకుండీలు విసిరేసింది - అరెకపూడి గాంధీ
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Langur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP DesamSitaram Yechury Political Journey | విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
In Pics: హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
Sangareddy Court: ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
Arekapudi Gandhi: కౌశిక్ భార్య మాపై పూలకుండీలు విసిరేసింది - అరెకపూడి గాంధీ
కౌశిక్ భార్య మాపై పూలకుండీలు విసిరేసింది - అరెకపూడి గాంధీ
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Embed widget