అన్వేషించండి

Revanth Reddy: టీఆర్ఎస్ పరిస్థితి ఇక చేవెళ్ల బస్టాండే... రైతుల వడ్లు కొనే వరకూ కాంగ్రెస్ పోరాటం... చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి ఫైర్

నిత్యావసర ధరలు, భూసంస్కరణలపై తెలంగాణ కాంగ్రెస్ పోరుబాట పట్టింది. రేవంత్ రెడ్డి చేవెళ్లలో పాదయాత్ర చేశారు. టీఆర్ఎస్ చెరువుకు గండి పడిందని, ఆ పార్టీ పరిస్థితి ఇక చేవెళ్ల బస్టాండే అని ఎద్దేవా చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పోరుబాట పట్టింది. రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, భూ సంస్కరణలు ప్రధానాంశాలుగా పాదయాత్రలు చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. శనివారం చేవెళ్ల నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. 10 కిలోమీటర్లు కొనసాగిన రేవంత్ పాదయాత్ర చేవెళ్లకు చేరుకుంది. యాత్రలో రాజ్యసభ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. పాదయాత్ర ముగింపు సభలో మాట్లాడిన ఆయన... దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎంపీటీసీ కావలి సుజాత టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారన్నారు. టీఆర్ఎస్ చెరువుకు గండి పడిందని, టీఆర్ఎస్ పరిస్థికి ఇక చేవెళ్ల బస్టాండే అని ఎద్దేవా చేశారు. 

Also Read: 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు.. రైతు బంధు పథకం అమలుకు కేసీఆర్ ఆదేశం !

పన్నులు దోచుకుంటున్నారు

దేశంలో 8 ఏళ్లుగా దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ లు పాలన సాగిస్తున్నారని, 2014 లో 60 రూపాయల లీటర్ పెట్రోల్ ఇప్పుడు 108 లీటర్ అయ్యిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేతిలో డబ్బులు ఉంటే సంచి నిండా సరుకులు వచ్చేవని, ఇప్పుడు సంచిలో డబ్బు తీస్కుకొని పోతే చేతిలో సరుకులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. మోదీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చారని, అంటే ఇప్పటికీ 14 కోట్ల ఉద్యోగాలు రావాలన్నారు. కానీ మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. పెట్రోల్ లీటరుకు 60 రూపాయలు, గ్యాస్ రూ.400 ఉండేవని, ఇప్పుడు ధరలు పెంచి కేసీఆర్, మోదీలు దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 30 లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకున్నాయన్నారు.Revanth Reddy: టీఆర్ఎస్ పరిస్థితి ఇక చేవెళ్ల బస్టాండే... రైతుల వడ్లు కొనే వరకూ కాంగ్రెస్ పోరాటం...  చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి ఫైర్

Also Read: ఉద్యోగుల విభజనపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు... కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన

రైతుల వడ్లు కొనే వరకూ పోరాటం

'పండించిన పంటలకు ధరలు లేవు. అమ్మబోతే అడవి, కొనపోతే కొరివి అయ్యింది. వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు విడుస్తున్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం కట్టినా అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ చేస్తే చేవెళ్లను తొలగించి ఇక్కడ రైతులకు అన్యాయం చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారిన వాళ్లు అభివృద్ది కోసం పార్టీ మారాం అంటున్నారు. 
వాళ్లను ఎక్కడికక్కడ నిలదీయాలి. దిల్లీలో అగ్గి పుట్టిస్తామని కేసీఆర్ అన్నాడు. అగ్గి పుట్టియ్యలేదు కానీ ఫామ్ హౌస్ లో పండుకున్నారు. రైతుల వడ్లు కొనే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ కు ప్రజలంతా అండగా ఉండాలి.' అని రేవంత్ రెడ్డి అన్నారు.Revanth Reddy: టీఆర్ఎస్ పరిస్థితి ఇక చేవెళ్ల బస్టాండే... రైతుల వడ్లు కొనే వరకూ కాంగ్రెస్ పోరాటం...  చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి ఫైర్ 

Also Read:  ఆ ఇద్దరు స్టాండప్ కమెడియన్లకు కేటీఆర్ ఆఫర్ ! బెంగళూరు గాలి తీసేశారుగా !?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth: సర్పంచ్ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను ఎన్నుకోవద్దు -  మక్తల్ బహిరంగసభలో సీఎం రేవంత్ పిలుపు
సర్పంచ్ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను ఎన్నుకోవద్దు - మక్తల్ బహిరంగసభలో సీఎం రేవంత్ పిలుపు
YSRCP MLCs: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు రివర్స్ - జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ - పోతుల సునీత కూడా?
బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు రివర్స్ - జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ - పోతుల సునీత కూడా?
Ustaad Bhagat Singh First Song : 'ఉస్తాద్ భగత్ సింగ్' వైబ్ స్టార్ట్ - పవన్ కల్యాణ్ న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా...
'ఉస్తాద్ భగత్ సింగ్' వైబ్ స్టార్ట్ - పవన్ కల్యాణ్ న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా...
PV Sunil vs Raghurama: ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Virat Kohli about Test Retirement | క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లి
Virat Kohli Records in Ranchi ODI | రాంచీలో కోహ్లీ రికార్డుల మోత
BCCI Summons to Gautam, Ajit Agarkar | గంభీర్‌ పై బీసీసీఐ కీలక నిర్ణయం!
ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth: సర్పంచ్ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను ఎన్నుకోవద్దు -  మక్తల్ బహిరంగసభలో సీఎం రేవంత్ పిలుపు
సర్పంచ్ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను ఎన్నుకోవద్దు - మక్తల్ బహిరంగసభలో సీఎం రేవంత్ పిలుపు
YSRCP MLCs: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు రివర్స్ - జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ - పోతుల సునీత కూడా?
బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు రివర్స్ - జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ - పోతుల సునీత కూడా?
Ustaad Bhagat Singh First Song : 'ఉస్తాద్ భగత్ సింగ్' వైబ్ స్టార్ట్ - పవన్ కల్యాణ్ న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా...
'ఉస్తాద్ భగత్ సింగ్' వైబ్ స్టార్ట్ - పవన్ కల్యాణ్ న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా...
PV Sunil vs Raghurama: ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
Revanth Reddy Football Practice:
"పాలిటిక్స్ అయినా ఫుట్‌బాల్ అయినా నేను బరిలోకి దిగనంత వరకే... " ప్రాక్టీస్‌లో దుమ్మురేపుతున్న రేవంత్‌
Andhra MLCs: వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
Seaplane Water Aerodromes: ఏపీలో పది ప్రాంతాల్లో సీప్లేన్ వాటర్ ఏరో డ్రోమ్‌లు- గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం 
ఏపీలో పది ప్రాంతాల్లో సీప్లేన్ వాటర్ ఏరో డ్రోమ్‌లు- గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం 
Bhuta Shuddhi Vivaha: భూతశుద్ధి వివాహం ఎప్పుడు చేసుకుంటారు? ముహూర్తంతో సంబంధం లేకున్నా ఎందుకు? విధానం ఏంటి?
భూతశుద్ధి వివాహం ఎప్పుడు చేసుకుంటారు? ముహూర్తంతో సంబంధం లేకున్నా ఎందుకు? విధానం ఏంటి?
Embed widget