అన్వేషించండి

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. పనిలో పనిగా వార్నింగ్ కూడా ఇచ్చిన టీపీసీసీ చీఫ్

కొంపల్లిలో డిజిటల్ మెంబెర్ షిప్ డ్రైవ్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రారంభించారు. నాయకులు ఎంత మంది ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు.

హుజూరాబాద్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్లేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్, పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజులపాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొంపల్లిలో డిజిటల్ మెంబెర్ షిప్ డ్రైవ్ ను రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, తదితర నేతలు ప్రారంభించారు. నగర, బ్లాక్, మండల కాంగ్రెస్ నేతలకు నిర్వహిస్తున్న డిజిటల్ మెంబర్ షిప్ అవగాహన సదస్సులో రేవంత్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలలో నూతనోత్సాహాన్ని నింపారు.

నాయకులు ఎంత మంది ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు. గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందని.. మేము పదవులు అనుభవిస్తున్నాం అంటే కార్యకర్తల వల్లేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైనది క్రమశిక్షణ అని.. తాగుబోతు సీఎం మాటలు నిజం చేయొద్దు అన్నారు. కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాన్నారు. అలాంటి కార్యకర్తలకు పార్టీ పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యతను తీసుకుంటానన్నారు. పార్టీ కోసం విశేషంగా పనిచేసే కార్యకర్తలకు రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని చెప్పారు.

Also Read: పోడు భూములపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి నోటీసులు, అసలు ఏంటి ఈ వ్యవహారం?

బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలే
తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలే. రైతులకు అండగా ఉండాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మాత్రం రైతుల పక్షాన ఉంటుంది. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉంది. తెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌస్‌లో బందీ ఐనది. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్లు చచ్చిన వాళ్లతో సమానం. కష్టపడే కార్యకర్తలను రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తాను. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికే ఈ రెండు రోజుల సదస్సు నిర్వహిస్తున్నాం. కష్టపడని పార్టీ కార్యకర్తలపై జనవరి 26 తర్వాత నేనే చర్యలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి అలర్ట్ చేశారు.
Also Read: పేరు విలియమ్స్ .. చేయాల్సింది పియానో వాయించడం.. చేసింది అమ్మాయిలకు టోకరా ! ఈ మోసగాడి కథ మామూలుగా లేదు.. !

కొంపల్లిలోని ఆస్పైసియాస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ విచ్చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడీ , ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజులు మాణికం ఠాగూర్‌కు ఘన స్వాగతం పలికి వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఆ తరువాత రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పార్టీ వ్యూహాలపై చర్చించారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget